నెత్తురోడుతున్న గాజా
సెంట్రల్ గాజాలో శనివారం నలుగురు బందీల విడుదల కోసం ఇజ్రాయెల్ చేపట్టిన ఆపరేషన్లో ఏకంగా 274 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. దాదాపు 700 మంది గాయాల పాలయ్యారు.
నలుగురు బందీల విడుదల కోసం జరిగిన ఆపరేషన్లో 274 మంది మృతి
700 మందికి పైగా గాయాలు
దేర్-అల్-బలాహ్: సెంట్రల్ గాజాలో శనివారం నలుగురు బందీల విడుదల కోసం ఇజ్రాయెల్ చేపట్టిన ఆపరేషన్లో ఏకంగా 274 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. దాదాపు 700 మంది గాయాల పాలయ్యారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు ఉన్నారు. ఈ విషయాన్ని గాజా పాలస్తీనా ఆరోగ్య విభాగం తెలిపింది. తొలుత ఈ ఆపరేషన్లో 100 మంది చనిపోయారని ఇజ్రాయెల్ పేర్కొంది. అయితే ఈ సంఖ్య 274కు చేరింది. బాధితుల హాహాకారాలతో అల్-అఖ్సా ఆసుపత్రి నిండిపోయినట్లు ఓ స్వచ్ఛంద సంస్థ తెలిపింది. ఆదివారం సెంట్రల్ గాజాలోని నుసీరాత్ శరణార్థి శిబిరంలోని రెండు వేర్వేరు ప్రదేశాలపై దాడి చేసి హమాస్ చెరలోని నలుగురు బందీలను ఇజ్రాయల్ ప్రత్యేక దళాలు రక్షించిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో భారీగా ప్రాణనష్టం సంభవించడంపై అంతర్జాతీయంగా ఇజ్రాయెల్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బందీలను రక్షించే సమయంలో బలగాలపై భారీఎత్తున దాడులు జరిగాయని ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి డేనియల్ హగారీ తెలిపారు ఆపరేషన్లో ఓ అధికారి మృతి చెందినట్లు చెప్పారు.
‘‘నుసీరాత్లోని రెండు వేర్వేరు అపార్ట్మెంట్లలో బందీలను ఉంచారు. వాటి మధ్య దాదాపు 200 మీటర్ల దూరం ఉంది. రెండు భవంతుల్లోకి మా బలగాలు ఒకే సమయంలో ప్రవేశించాయి. అయితే.. వారిపై పెద్దఎత్తున దాడులు జరిగాయి. పరిసరాల నుంచి రాకెట్ గ్రనేడ్లు ప్రయోగించారు. దీంతో బలగాలను, బందీలను రక్షించేందుకు ప్రతిచర్యలు తీసుకున్నాం’’ అని వివరించారు. గత ఏడాది అక్టోబరులో హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్పై మెరుపుదాడి చేశారు. ఈ క్రమంలోనే దాదాపు 250 మందిని కిడ్నాప్ చేసి గాజాకు తరలించారు. నవంబరులో ఇరుపక్షాల నడుమ కాల్పుల విరమణ సమయంలో కొంతమందిని విడిచిపెట్టారు. ఇంకా 120 మంది హమాస్ చెరలో ఉన్నారని ఇజ్రాయెల్ చెబుతోంది. వారిని గాజాలోని జనసమ్మర్థ ప్రదేశాలు, సొరంగాల్లో ఉంచినట్లు సమాచారం. దీంతో.. వారిని కాపాడటం టెల్అవీవ్కు సవాల్గా మారుతోంది. ఫిబ్రవరిలోనూ ఇదే తరహా ఓ ఆపరేషన్ నిర్వహించి, ఇద్దరు బందీలను కాపాడగా.. ఈ క్రమంలో 74 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు.
శ్వేత సౌధాన్ని చుట్టుముట్టిన పాలస్తీనా మద్దతుదారులు
అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధ పరిసరాలు నిరసనలతో దద్దరిల్లాయి. గాజా-ఇజ్రాయెల్ యుద్ధం ముగించాలని, టెల్అవీవ్కు అగ్రరాజ్యం మద్దతు ఆపేయాలంటూ ఆందోళన జరిగింది. దాదాపు 35,000 మంది నిరసనకారులు ఇందులో పాల్గొన్నారు. పాలస్తీనాకు విముక్తి కలిగించాలని, ఇజ్రాయెల్కు అమెరికా సైనిక సాయం ఆపేయాలని నినాదాలు చేశారు.
బ్రిటన్ యుద్ధనౌకపై హూతీల దాడి
ఎర్రసముద్రంలో బ్రిటన్ విధ్వంసక యుద్ధనౌక హెచ్ఎమ్ఎస్ డైమండ్పై బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించినట్లు ఆదివారం యెమెన్లోని హూతీ తిరుగుబాటుదారులు పేర్కొన్నారు. తమ క్షిపణి.. లక్ష్యాన్ని కచ్చితంగా తాకినట్లు తెలిపింది. మరో రెండు వాణిజ్యనౌకలపైనా దాడి చేసినట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సోషల్ మీడియా వీడియోల పిచ్చి ముదిరి.. రైలును పట్టాలు తప్పించి..!
సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేయడం కోసం ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. అతడి చర్యల కారణంగా ఏకంగా రూ.2 కోట్లకుపైగా నష్టం వాటిల్లింది. -
చర్చకు సిద్ధమేనన్న కమలాహారిస్.. అప్పటివరకు వద్దన్న ట్రంప్
మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump)తో ముఖాముఖి చర్చకు తాను సిద్ధమేనని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహ్యారిస్(Kamala Harris) వెల్లడించారు. -
జోబైడెన్ మెదడు అద్భుతంగా పనిచేస్తోంది: శ్వేతసౌధం డాక్టర్ల సర్టిఫికెట్
జోబైడెన్ మానసిక ఆరోగ్యం అద్భుతంగా ఉందని శ్వేతసౌధం డాక్టర్లు చెబుతున్నారు. -
భారత్కు అండగా ఉందాం.. పాక్కు సాయం నిషేధిద్దాం: అమెరికా కాంగ్రెస్లో బిల్లు
US-India Defense Cooperation Act: భారత్ను అమెరికా మిత్రదేశాలైన జపాన్, ఇజ్రాయెల్, దక్షిణ కొరియా, నాటో కూటమితో సమానంగా చూడాల్సిన అవసరం ఉందంటూ అగ్రరాజ్య కాంగ్రెస్లో కీలక సెనేటర్ బిల్లు ప్రవేశపెట్టారు. -
గాజాలో సంక్షోభంపై మౌనంగా ఉండలేను.. నెతన్యాహుతో కమలా హారిస్
Harris - Netanyahu: హమాస్తో యుద్ధం ముగింపునకు సమయం వచ్చిందని కమలా హారిస్ అన్నారు. ఆ దిశగా ఒప్పందం చేసుకోవాలని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహుకు సూచించారు. -
69 రకాల పురుగుమందులతో రైతులకు.. ధూమపానం స్థాయిలో క్యాన్సర్ ముప్పు!
కొన్ని రకాల పురుగుమందుల వినియోగంతో రైతుల్లో క్యాన్సర్ ముప్పు గణనీయంగా పెరుగుతోందని తాజా అధ్యయనమొకటి తేల్చింది. -
దేశ భవిష్యత్తు కోసం పోరాడతా
‘అమెరికా ప్రజలుగా ఇప్పుడు మన ముందు రెండు అవకాశాలున్నాయని నేను భావిస్తున్నా. ఒకటి దేశాన్ని ముందుకు తీసుకెళ్లే మన విధానం.. రెండోది గతాన్ని తవ్వే ప్రత్యర్థుల అరాచకం.. ఈ రెండింటిలో మనం ఏదో ఒకటి ఎంచుకోవాల్సిన సమయం వచ్చింది. -
అధికారానికి కమలా హారిస్ అనర్హురాలు
అమెరికాను పాలించేందుకు ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్కు అర్హత లేదని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. -
మోదీ రష్యా పర్యటననిరాశ కలిగించింది
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల రష్యాలో పర్యటించడం తమను తీవ్రంగా నిరాశపరిచిందని అమెరికా తెలిపింది. -
సంక్షిప్త వార్తలు (5)
వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ)ను, సరిహద్దుకు సంబంధించి గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను పూర్తిస్థాయిలో గౌరవించాల్సిందేనని చైనాకు భారత్ మరోసారి నొక్కిచెప్పింది. -
బైడెన్, హారిస్తో నెతన్యాహు భేటీ
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్తో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గురువారం వాషింగ్టన్లో భేటీ అయ్యారు. -
కాలిఫోర్నియాలో విస్తరిస్తున్న కార్చిచ్చు
అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో విస్తరిస్తున్న కార్చిచ్చు వల్ల పలు ప్రాంతాల్లోని ప్రజలు తమ ఆవాసాలను ఖాళీ చేయాల్సి వస్తోంది. -
ప్రచారం కోసం డబ్బు వెదజల్లుతున్న రిపబ్లికన్లు
ట్రంప్ ప్రచారం కోసం డబ్బును రిపబ్లికన్లు వెదజల్లుతున్నారు. గత సోమవారం నుంచి ఆగస్టు దాకా టీవీ, రేడియోల్లో ప్రచారం కోసం ఆ పార్టీవారు 68 మిలియన్ డాలర్లను ఖర్చు చేయనున్నారు. -
పైలట్ను కాపాడిన కంటైనర్!
నేపాల్లోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం నుంచి పైలట్ మనీష్ శాక్య (37) ఒక్కరే వెంట్రుక వాసిలో ప్రాణాలతో బయటపడ్డారు. తీవ్రంగా గాయపడి ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. -
ఇమ్రాన్ ఎంపీలు 39 మందికి అధికారిక గుర్తింపు
పాక్ సుప్రీంకోర్టు జారీచేసిన మైలురాయి లాంటి మార్గదర్శకాలను అనుసరిస్తూ ఎన్నికల సంఘం (ఈసీ) ఇటీవలి ఎన్నికల్లో విజయం సాధించిన మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ పార్టీ పీటీఐకి చెందిన 39 మంది ఎంపీలను చట్టసభ సభ్యులుగా గుర్తిస్తున్నట్లు ప్రకటించింది. -
విమాన ప్రయాణికులపై లండన్ పోలీసుల కర్కశత్వం
నలుగురు విమాన ప్రయాణికులపై లండన్లోని మాంచెస్టర్ విమానాశ్రయంలో పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. వారిని నేలకేసి చితకబాదారు. -
జపాన్లో తగ్గిపోతున్న జనాభా
ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జపాన్లో వరుసగా 15వ ఏడాదీ జనాభా సంఖ్యలో క్షీణత నమోదైంది. జననాల కన్నా మరణాల సంఖ్య అధికంగా ఉంటోంది. -
ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసమే వైదొలిగా
డెమోక్రటిక్ పార్టీతోపాటు దేశాన్ని ఏకతాటిపై నిలపడం కోసమే తాను ఎన్నికల రేసు నుంచి వైదొలగినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. -
హమాస్.. ఇజ్రాయెల్ యుద్ధం.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
హమాస్తో యుద్ధానికి వీలైనంత త్వరగా ముగింపు పలకాలని అమెరికా అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కోరారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మీ దుర్మార్గపు కుట్రలు తిప్పికొడతాం.. కార్గిల్ నుంచి పాక్కు మోదీ హెచ్చరిక
-
వైకాపా హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేల డిమాండ్
-
విజయ్ సేతుపతి మూవీపై కత్రినాకైఫ్ రివ్యూ
-
సోషల్ మీడియా వీడియోల పిచ్చి ముదిరి.. రైలును పట్టాలు తప్పించి..!
-
ఆ ప్రాజెక్ట్కు ఓకే చెప్పినందుకు బాధపడ్డా: టబు
-
నాలుగు సంవత్సరాలు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా: నాగ్ అశ్విన్