కాల్పుల విరమణ ప్రతిపాదనలకు అంగీకరించండి
పరస్పర దాడులు చేసుకుంటున్న ఇజ్రాయెల్, హమాస్లకు పోప్ ఫ్రాన్సిస్ కీలక సూచనలు చేశారు. మానవతా సాయాన్ని గాజాలోని పౌరులకు అందేలా సహకరించాలని ఇజ్రాయెల్ను ఆయన కోరారు.
హమాస్, ఇజ్రాయెల్లకు పోప్ సూచన
వాటికన్ సిటీ: పరస్పర దాడులు చేసుకుంటున్న ఇజ్రాయెల్, హమాస్లకు పోప్ ఫ్రాన్సిస్ కీలక సూచనలు చేశారు. మానవతా సాయాన్ని గాజాలోని పౌరులకు అందేలా సహకరించాలని ఇజ్రాయెల్ను ఆయన కోరారు. అలాగే కాల్పుల విరమణ ప్రతిపాదనలకు అంగీకరించి బందీలను విడిచిపెట్టేందుకు ఒప్పుకోవాలని హమాస్కు విజ్ఞప్తి చేశారు. ఆదివారం ప్రార్థనల్లో ఆయన ఈ మేరకు అభిలషించారు. మానవతా సహాయ నిధిపై అంతర్జాతీయ సదస్సును నిర్వహించనున్నందుకు జోర్డాన్కు పోప్ కృతజ్ఞతలు తెలిపారు. తాను గతంలో ప్రారంభించిన పీస్ ప్రేయర్ కార్యక్రమానికి శనివారంతో 10 ఏళ్లు పూర్తయినట్లు పోప్ వెల్లడించారు. అదే కార్యక్రమానికి అప్పటి ఇజ్రాయెల్ అధ్యక్షుడు షిమోన్ పెరెస్, పాలస్తీనా నాయకుడు మొహమ్మద్ అబ్బాస్ వచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ‘చేతులు కలపడం సాధ్యమే. అయితే దానికి యుద్ధం చేయడానికన్నా ఎక్కువ ధైర్యం ఉండాలి’ అని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
పాకిస్థాన్లో ఐదో పోలియో కేసు గుర్తింపు
ఇస్లామాబాద్: పాకిస్థాన్లో 17 రోజుల క్రితం మరణించిన రెండేళ్ల చిన్నారికి పోలియో వ్యాధి ఉన్నట్లు ఆ దేశం నిర్ధారించింది. ఇలాంటి కేసును గుర్తించడం ఈ ఏడాదిలో ఐదోది. బలూచిస్థాన్లోని క్వెట్టాకు చెందిన సదరు చిన్నారి ఏప్రిల్ 22న పక్షవాతానికి గురి కాగా ఆరు వారాల తర్వాత వ్యాధిని నిర్ధారించారని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్) రీజినల్ రిఫరెన్స్ ల్యాబొరేటరీ అధికారి తెలిపారు. చిన్నారి బాలుడికి పోలియో టీకా వేయకపోగా.. మొత్తం ఐదు డోసులు వేసినట్లు రికార్డుల్లో ఉన్నాయని పేర్కొన్నారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఆ అధికారి చెప్పారు. ఈ వ్యాధి చిన్నారి కుటుంబసభ్యులకూ సోకిందని నిర్ధారించారు. మరోవైపు, పోలియో ఉన్న దేశాలుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ పాకిస్థాన్, అఫ్గానిస్థాన్లను గుర్తించిన సంగతి తెలిసిందే.
ఉక్రెయిన్ డ్రోన్ దాడిలో రష్యా ఎస్యూ-57 ధ్వంసం
కీవ్: తాము ఇచ్చిన ఆయుధాలను రష్యా భూభాగంలోనూ వాడొచ్చంటూ ఉక్రెయిన్కు పశ్చిమ దేశాలు సంకేతాలిస్తున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆదివారం దక్షిణ రష్యాలో ఆస్ట్రాఖాన్ ప్రాంతంలోని వైమానిక స్థావరంలో నిలిపి ఉంచిన అత్యాధునిక ఎస్యూ-57 యుద్ధ విమానాన్ని ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. రష్యా అమ్ములపొదిలో ఇది కీలక యుద్ధ విమానం. 2020లో ఇది సైన్యంలో చేరింది. యుద్ధం తీరును ఈ దాడి మలుపు తిప్పుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమ దేశాల ఆయుధాలను తమపైకి ఉక్రెయిన్ ప్రయోగిస్తే.. తాము కూడా అమెరికా దాని మిత్ర పక్షాల శత్రువులకు ఆయుధాలు అందిస్తామని ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. డ్రోన్తోనే ఈ యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఉపగ్రహచిత్రాలను కూడా ఉక్రెయిన్ నిఘా విభాగం విడుదల చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జాస్పర్ నగరం సగం భస్మీపటలం..!
కెనడాలో కార్చిచ్చు తాజాగా సగం జాస్పర్ నగరాన్ని కాల్చి బూడిదగా మార్చేశాయి. దీంతో వేల మంది ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోయారు. -
జేడీ వాన్స్ వ్యాఖ్యలు వైరల్.. తీవ్రంగా ఖండించిన ప్రముఖ నటి
రిపబ్లికన్ పార్టీ తరఫున ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఉన్న జేడీ వాన్స్(JD Vance) గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్గా మారాయి. -
మెక్సికన్ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్
ప్రపంచవ్యాప్తంగా హింసాత్మకమైన డ్రగ్ ట్రాఫికింగ్ సంస్థల్లో ఒకటిగా పేరుపొందిన ‘సినాలోవా కార్టెల్’ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్ -
26 మంది హత్య.. మృతదేహాలను నదిలోకి ఈడ్చుకెళ్లిన మొసళ్లు..!
పపువా న్యూగినియాలో దారుణం చోటుచేసుకొంది. 26 మందిని ఓ గ్యాంగ్ దారుణంగా హత్య చేసింది. వారి మృతదేహాలను మొసళ్లు నదిలోకి ఈడ్చుకెళ్లాయి. -
సోషల్ మీడియా వీడియోల పిచ్చి ముదిరి.. రైలును పట్టాలు తప్పించి..!
సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేయడం కోసం ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. అతడి చర్యల కారణంగా ఏకంగా రూ.2 కోట్లకుపైగా నష్టం వాటిల్లింది. -
చర్చకు సిద్ధమేనన్న కమలాహారిస్.. అప్పటివరకు వద్దన్న ట్రంప్
మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump)తో ముఖాముఖి చర్చకు తాను సిద్ధమేనని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహ్యారిస్(Kamala Harris) వెల్లడించారు. -
జోబైడెన్ మెదడు అద్భుతంగా పనిచేస్తోంది: శ్వేతసౌధం డాక్టర్ల సర్టిఫికెట్
జోబైడెన్ మానసిక ఆరోగ్యం అద్భుతంగా ఉందని శ్వేతసౌధం డాక్టర్లు చెబుతున్నారు. -
భారత్కు అండగా ఉందాం.. పాక్కు సాయం నిషేధిద్దాం: అమెరికా కాంగ్రెస్లో బిల్లు
US-India Defense Cooperation Act: భారత్ను అమెరికా మిత్రదేశాలైన జపాన్, ఇజ్రాయెల్, దక్షిణ కొరియా, నాటో కూటమితో సమానంగా చూడాల్సిన అవసరం ఉందంటూ అగ్రరాజ్య కాంగ్రెస్లో కీలక సెనేటర్ బిల్లు ప్రవేశపెట్టారు. -
గాజాలో సంక్షోభంపై మౌనంగా ఉండలేను.. నెతన్యాహుతో కమలా హారిస్
Harris - Netanyahu: హమాస్తో యుద్ధం ముగింపునకు సమయం వచ్చిందని కమలా హారిస్ అన్నారు. ఆ దిశగా ఒప్పందం చేసుకోవాలని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహుకు సూచించారు. -
69 రకాల పురుగుమందులతో రైతులకు.. ధూమపానం స్థాయిలో క్యాన్సర్ ముప్పు!
కొన్ని రకాల పురుగుమందుల వినియోగంతో రైతుల్లో క్యాన్సర్ ముప్పు గణనీయంగా పెరుగుతోందని తాజా అధ్యయనమొకటి తేల్చింది. -
దేశ భవిష్యత్తు కోసం పోరాడతా
‘అమెరికా ప్రజలుగా ఇప్పుడు మన ముందు రెండు అవకాశాలున్నాయని నేను భావిస్తున్నా. ఒకటి దేశాన్ని ముందుకు తీసుకెళ్లే మన విధానం.. రెండోది గతాన్ని తవ్వే ప్రత్యర్థుల అరాచకం.. ఈ రెండింటిలో మనం ఏదో ఒకటి ఎంచుకోవాల్సిన సమయం వచ్చింది. -
అధికారానికి కమలా హారిస్ అనర్హురాలు
అమెరికాను పాలించేందుకు ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్కు అర్హత లేదని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. -
మోదీ రష్యా పర్యటననిరాశ కలిగించింది
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల రష్యాలో పర్యటించడం తమను తీవ్రంగా నిరాశపరిచిందని అమెరికా తెలిపింది. -
సంక్షిప్త వార్తలు (5)
వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ)ను, సరిహద్దుకు సంబంధించి గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను పూర్తిస్థాయిలో గౌరవించాల్సిందేనని చైనాకు భారత్ మరోసారి నొక్కిచెప్పింది. -
బైడెన్, హారిస్తో నెతన్యాహు భేటీ
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్తో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గురువారం వాషింగ్టన్లో భేటీ అయ్యారు. -
కాలిఫోర్నియాలో విస్తరిస్తున్న కార్చిచ్చు
అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో విస్తరిస్తున్న కార్చిచ్చు వల్ల పలు ప్రాంతాల్లోని ప్రజలు తమ ఆవాసాలను ఖాళీ చేయాల్సి వస్తోంది. -
ప్రచారం కోసం డబ్బు వెదజల్లుతున్న రిపబ్లికన్లు
ట్రంప్ ప్రచారం కోసం డబ్బును రిపబ్లికన్లు వెదజల్లుతున్నారు. గత సోమవారం నుంచి ఆగస్టు దాకా టీవీ, రేడియోల్లో ప్రచారం కోసం ఆ పార్టీవారు 68 మిలియన్ డాలర్లను ఖర్చు చేయనున్నారు. -
పైలట్ను కాపాడిన కంటైనర్!
నేపాల్లోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం నుంచి పైలట్ మనీష్ శాక్య (37) ఒక్కరే వెంట్రుక వాసిలో ప్రాణాలతో బయటపడ్డారు. తీవ్రంగా గాయపడి ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. -
ఇమ్రాన్ ఎంపీలు 39 మందికి అధికారిక గుర్తింపు
పాక్ సుప్రీంకోర్టు జారీచేసిన మైలురాయి లాంటి మార్గదర్శకాలను అనుసరిస్తూ ఎన్నికల సంఘం (ఈసీ) ఇటీవలి ఎన్నికల్లో విజయం సాధించిన మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ పార్టీ పీటీఐకి చెందిన 39 మంది ఎంపీలను చట్టసభ సభ్యులుగా గుర్తిస్తున్నట్లు ప్రకటించింది. -
విమాన ప్రయాణికులపై లండన్ పోలీసుల కర్కశత్వం
నలుగురు విమాన ప్రయాణికులపై లండన్లోని మాంచెస్టర్ విమానాశ్రయంలో పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. వారిని నేలకేసి చితకబాదారు. -
జపాన్లో తగ్గిపోతున్న జనాభా
ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జపాన్లో వరుసగా 15వ ఏడాదీ జనాభా సంఖ్యలో క్షీణత నమోదైంది. జననాల కన్నా మరణాల సంఖ్య అధికంగా ఉంటోంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
-
కేరళ, బెంగాల్ గవర్నర్ కార్యాలయాలకు సుప్రీం నోటీసులు
-
జాస్పర్ నగరం సగం భస్మీపటలం..!
-
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి
-
అంత డబ్బు నా వద్ద లేదు: జాన్వీకపూర్
-
జేడీ వాన్స్ వ్యాఖ్యలు వైరల్.. తీవ్రంగా ఖండించిన ప్రముఖ నటి