ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగోలో భారీ రామాలయ నిర్మాణం!

Eenadu icon
By International News Desk Published : 28 Oct 2025 05:30 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌: కరేబియన్‌ దేశమైన ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో రాజధాని పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌లో భారీ రామాలయ నిర్మాణానికి కసరత్తు జరుగుతోంది. ఆ దేశ జనాభా 14 లక్షలు కాగా అందులో 42శాతం మందికి భారతీయ మూలాలున్నాయి. వీరిలో 2లక్షల మందికి పైగా హిందువులు. 19వ శతాబ్దంలో ఒప్పంద కార్మికులుగా పెద్ద సంఖ్యలో ఉత్తర్‌ప్రదేశ్, బిహార్‌ ప్రాంతాల నుంచి వెళ్లిన వారు కాలక్రమంలో అక్కడే స్థిరపడ్డారు. ఆ దేశ ప్రధాన మంత్రి కమలా ప్రసాద్‌ బిసెసర్‌ కూడా భారతీయ మూలాలున్న వ్యక్తే. కరీబియన్‌ ప్రాంతంలో హిందూ ఆధ్యాత్మిక కేంద్రంగా, సాంస్కృతిక నిలయంగా దేశాన్ని తీర్చిదిద్దాలనే ప్రణాళికలో భాగంగా రామాలయం నిర్మాణానికి అక్కడి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ ఏడాది మే నెలలో అయోధ్య రామాలయంలోని బాల రాముడి ప్రతిమను పోలిన విగ్రహాన్ని ట్రినిడాడ్‌లో ప్రతిష్ఠించారు. ఆ దేశంలో అయోధ్య నగరిని నిర్మించాలనే ప్రతిపాదనను అమెరికా నివాసి ప్రేమ్‌ భండారీ ట్రినిడాడ్‌ ప్రభుత్వం ముందుంచారు. ఆయన న్యూయార్క్‌లోని ‘ఓవర్సీస్‌ ఫ్రెండ్స్‌ ఆఫ్‌ రామమందిర్‌’ వ్యవస్థాపకులు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యకు రాలేని ఉత్తర అమెరికా వాసులకు ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగోలో నిర్మించే రామాలయం అందుబాటులో ఉంటుందని వారి అభిప్రాయం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని