తూర్పు పసిఫిక్‌ మహాసముద్రంలో డ్రగ్స్‌ పడవలపై అమెరికా దాడులు

Eenadu icon
By International News Desk Published : 29 Oct 2025 04:07 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

14 మంది మృతి

వాషింగ్టన్‌: మాదకద్రవ్యాలను తరలిస్తున్నారన్న అనుమానంతో తూర్పు పసిఫిక్‌ మహా సముద్రంలో పడవలపై మూడు దాడులు జరిపినట్లు అమెరికా వెల్లడించింది. సోమవారం జరిపిన ఈ దాడుల్లో 14 మంది మృతిచెందారని, ఒకరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారని తెలిపింది. మంగళవారం ఈ విషయాన్ని రక్షణ మంత్రి పీట్‌ హెగ్సెత్‌ సామాజిక మాధ్యమం వేదికగా ప్రకటించారు. ప్రాణాలతో బయటపడిన వ్యక్తిని మెక్సికో అధికారులు రక్షించారని, అతడిని అమెరికాకు అప్పగిస్తారా లేదా అన్న విషయంపై స్పష్టత లేదని చెప్పారు. తాజా దాడుల వీడియో దృశ్యాలను ఆయన సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని