బ్రెజిల్‌లో భారీ ఆపరేషన్‌.. 60 మంది డ్రగ్స్‌ ముఠా సభ్యుల మృతి

Eenadu icon
By International News Desk Published : 30 Oct 2025 04:14 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

రియో డి జనీరో: బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో మాదకద్రవ్యాల ముఠాలే లక్ష్యంగా బ్రెజిల్‌ పోలీసులు చేపట్టిన భారీ ఆపరేషన్‌లో 60 మంది ప్రాణాలు కోల్పోయారు. 81 మంది అరెస్టయ్యారు. నలుగురు పోలీసులు కూడా మరణించారు. మాదకద్రవ్యాల రవాణా ముఠా ‘రెడ్‌ కమాండ్‌’ లక్ష్యంగా అలెమావో, పెన్హా జిల్లాల్లో మంగళవారం ఉదయం ఆపరేషన్‌ను చేపట్టినట్లు బ్రెజిల్‌ తెలిపింది. ఇందులో దాదాపు 2,500 మంది పోలీసులు, భద్రతా సిబ్బంది పాల్గొన్నట్లు వెల్లడించింది. పోలీసులు రంగంలోకి దిగగానే ప్రతిగా రెడ్‌ కమాండ్‌ కాల్పులు ప్రారంభించిందని, బ్యారికేడ్లు తగలబెట్టి.. డ్రోన్లను ఉపయోగించి బాంబుల వర్షం కురిపించిందని తెలిపింది. ఎదురు కాల్పుల్లో సుమారు 60 మంది నేరస్థులు హతమైనట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆపరేషన్‌ అనంతరం 75 రైఫిల్స్‌తో పాటు 200కిలోల మాదకద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌ను ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంస్థ తీవ్రంగా ఖండించింది. దీనిపై స్వతంత్ర దర్యాప్తునకు పిలుపునిచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని