కొండచరియలు విరిగిపడి 21 మంది మృతి

Eenadu icon
By International News Desk Published : 01 Nov 2025 04:24 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

పపువా న్యూగినియాలో ఘటన

మెల్‌బోర్న్‌: పపువా న్యూగినియాలో విషాదం చోటుచేసుకుంది. కొండచరియలు విరిగిపడటంతో కనీసం 21 మంది మృతిచెందినట్లు ఆస్ట్రేలియా మీడియా పేర్కొంది. ఇంగా ప్రావిన్స్‌లో గురువారం రాత్రి 2 గంటల సమయంలో ప్రజలు గాఢనిద్రలో ఉండగా ఈ ఘటన చోటుచేసుకుంది. 30 మంది చనిపోయారని, 18 మృతదేహాలను వెలికితీసినట్లు స్థానిక గవర్నర్‌ పేర్కొనగా, 21 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు