Israel: ఇజ్రాయెల్పై హమాస్ దాడులు అందుకే..: నెతన్యాహు
తాము మిడిల్ఈస్ట్ దేశాల్లో శాంతిని విస్తరింపజేసేందుకు యత్నిస్తుంటే.. హమాస్ శాంతికి విఘాతం కలిగించేందుకు దాడులకు పాల్పడిందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వ్యాఖ్యానించారు.
జెరూసలెం: మిడిల్ఈస్ట్ దేశాల్లో శాంతికి విఘాతం కలిగించడమే లక్ష్యంగా హమాస్ (Hamas) దాడికి పాల్పడిందని ఇజ్రాయెల్ (Israel) ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు (Netanyahu) వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న వేళ బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్ (Rishi Sunak) ఇజ్రాయెల్లో పర్యటించారు. ఈక్రమంలోనే నెతన్యాహు, రిషి సునాక్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నెతన్యాహు మాట్లాడుతూ.. తాము మిడిల్ఈస్ట్ దేశాల్లో శాంతిని విస్తరింపజేస్తుంటే.. దాన్ని మిలిటెంట్ గ్రూప్ హమాస్ నాశనం చేసేందుకు యత్నిస్తోందని.. అందుకే, ఈ చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని ప్రతిదాడులను ఉద్దేశించి చెప్పారు.
గాజా నుంచి పాలస్తీనాకు చెందిన ఉగ్రవాద సంస్థ హమాస్ చేసిన దాడుల్లో 1,400 మంది ఇజ్రాయెలీ ప్రజలు మృతి చెందారని రిషి సునాక్కు నెతన్యాహు వివరించారు. ఇదో సుదీర్ఘమైన యుద్ధమని.. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న తమకి మద్దతు కొనసాగించాలని ఈ సందర్భంగా రిషి సునాక్ను నెతన్యాహు కోరారు. దీనిపై స్పందించిన రిషి సునాక్.. ఇజ్రాయెల్కు బ్రిటన్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇజ్రాయెల్ పర్యటన ముగిసిన వెంటనే రిషి సునాక్ సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లారు.
మరోవైపు అక్టోబర్ 7 నుంచి ఇప్పటి వరకు ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 3,785 మంది పాలస్తీనా ప్రజలు మరణించారని, 12,493 మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. మృతుల్లో 1,524 మంది చిన్నారులు.. వెయ్యి మంది మహిళలు ఉన్నట్లు పేర్కొంది. ఆస్పత్రుల్లో మందుల కొరత ఉందని, అంతర్జాతీయ సంస్థలు సత్వరమే సాయం చేయాలని కోరుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి..
అగ్రరాజ్యం అమెరికాలో పోలీసుల కర్కశత్వానికి ఫ్రాంక్ టైసన్ (53) అనే ఆఫ్రో-అమెరికన్ ప్రాణాలు కోల్పోయాడు. -
జీవ వైవిధ్యానికి గొడ్డలిపెట్టు కానున్న వాతావరణ మార్పులు
ఈ శతాబ్దం మధ్యనాటికి జీవవైవిధ్యంలో క్షీణతకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమవుతాయని తాజా అధ్యయనం పేర్కొంది. -
కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదన
రఫాపై దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతుందన్న వార్తల నేపథ్యంలో కాల్పుల విరమణ చర్చలు ఊపందుకుంటున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ తమకు ఓ ప్రతిపాదన పంపినట్లు హమాస్ తెలిపింది. -
బ్రెజిల్లోని హోటల్లో అగ్నిప్రమాదం
దక్షిణ బ్రెజిల్లోని పాటో అలెగ్రి నగరంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించేందుకు స్థానిక ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న ఓ హోటల్లో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. -
చిత్రవార్త
-
అమెరికా డ్రోన్ను కూల్చిన హూతీలు
ఎర్రసముద్రం మళ్లీ వేడెక్కింది. హూతీ వేర్పాటువాదులు దూకుడు పెంచారు. బాలిస్టిక్ క్షిపణులతో బాబ్ ఎల్ మండేబ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలను భయపెడుతున్నారు. -
అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే ఓ రేడియో ఇంటర్వ్యూలో తెలిపారు. -
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం
అమెరికాలోని సౌత్ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంతో ప్రయాణిస్తున్న ఎస్యూవీ అదుపు తప్పి పల్టీలు కొట్టిన ఈ దుర్ఘటనలో భారత సంతతికి చెందిన ముగ్గురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. -
కంబోడియా సైనిక స్థావరంలో పేలుడు
కంబోడియాలో ఓ సైనిక స్థావరంలో పేలుడు సంభవించి 20 మంది సైనికులు మృతి చెందారు. చాలా మందికి గాయాలయ్యాయి. -
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఒక దశలో ఒంటరితనాన్ని అనుభవించారట. చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
నా ముఖం కాదు.. మార్కులు చూడండి: ట్రోలర్లకు యూపీ టాపర్ దీటైన జవాబు
-
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
-
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే సోదరుడి హల్చల్.. తెదేపా సానుభూతిపరులపై దాడి
-
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్
-
ఆదుకుంటానన్నావ్.. పీల్చి పిప్పి చేశావ్!!
-
బుమ్రా బౌలింగ్ ఫుటేజీలను విపరీతంగా చూశా: జేక్ ఫ్రేజర్