Palestine: హమాస్ చర్యలు పాలస్తీనాను అద్దం పట్టవు: మహమూద్ అబ్బాస్
ఇజ్రాయెల్పై హమాస్ మిలిటెంట్ల దుశ్చర్యలు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. అయితే, హమాస్ చర్యలు పాలస్తీనాను అద్దం పట్టవని ఆదేశ అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ స్పష్టం చేశారు.
హెబ్రాన్: ఇజ్రాయెల్(Israel) పై పాలస్తీనా(Palestine) కు చెందిన ఉగ్రవాద సంస్థ హమాస్ (Hamas) దాడుల్ని అనేక దేశాలు ఖండిస్తున్నాయి. ఇజ్రాయెల్లోకి చొరబడిన హమాస్ మిలిటెంట్లు అక్కడి ప్రజలను అతి క్రూరంగా చంపేశారు. ఈ ఘటనలపై పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ (mahmoud abbas) స్పందించారు. హమాస్ చర్యలు పాలస్తీనాను అద్దం పట్టవని స్పష్టం చేశారు. హమాస్ చేసే దురాగతాలతో పాలస్తీనా ప్రభుత్వానికి సంబంధం లేదని తెలిపారు. కేవలం పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్(అధికార పార్టీ) విధివిధానాలే దేశాన్ని ప్రతిబింబిస్తాయని వెల్లడించారు. ఇజ్రాయెల్, హమాస్ పరస్పర దాడుల్ని, అమాయక ప్రజల ప్రాణాలు తీయడాన్ని ఖండించారు. ఇరు వర్గాలు బందీలుగా ఉన్న పౌరులు, ఖైదీలను విడుదల చేయాలని అబ్బాస్ కోరారు.
యుద్ధం వల్ల పౌరులు.. పిల్లలు మూల్యం చెల్లించుకుంటున్నారు: టెడ్రోస్ అథనామ్
ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతోన్న యుద్ధంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆందోళన వ్యక్తం చేసింది. డబ్ల్యూహెచ్వో డైరెక్టర్ టెడ్రోస్ అథనామ్ మాట్లాడుతూ.. హమాస్ దాడులు అతి క్రూరమైనవి. ప్రతి ఒక్కరూ ఈ దాడుల్ని ఖండించాల్సిందే. బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ ప్రజల్ని హమాస్ వెంటనే విడిచిపెట్టాలని కోరారు. అలాగే, ఇజ్రాయెల్ దాడుల వల్ల అమాయక పాలస్తీనా ప్రజలు, చిన్నారులు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని, లక్షల మంది ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంతో విధ్వంసం తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. ఉత్తర గాజా నుంచి లక్షలమంది దక్షిణ గాజాకి తరలివెళ్తున్నారని, ఈ క్రమంలో అనేక ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. గాజా స్ట్రిప్లో వెంటనే విద్యుత్, నీటి సరఫరాను పునరుద్ధరించాలని, ప్రజలకు ఆహారం, మందులు పంపిణీ చేసేందుకు అనుమతించాలని టెడ్రోస్ కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డీల్ కుదిరినా.. కుదరకపోయినా రఫాపై దండయాత్రే: నెతన్యాహు
Israel: హమాస్కు మిగిలి ఉన్న రఫా ప్రాంతంపై దండయాత్ర తప్పదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అన్నారు. కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా, కుదరకపోయినా ఇది జరుగుతుందన్నారు. -
కెనడాలో విదేశీ విద్యార్థులకు నిరాశ.. ఇక వారానికి గరిష్ఠంగా 24 గంటలే పని!
కెనడాకు వచ్చే అంతర్జాతీయ విద్యార్థులు ఇకపై వారానికి 24 గంటలు మాత్రమే పని చేసుకునే వీలుంటుంది. -
భార్య దారుణ హత్య.. భారతీయుడికి జీవిత ఖైదు
భారత్కు చెందిన ఓ వ్యక్తి తన భార్యను దారుణంగా హత్య చేశాడు. ఈ కేసులో లండన్ కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. -
కత్తితో విచక్షణారహిత దాడి..ఉలిక్కిపడిన లండన్
కత్తితో దూసుకొచ్చిన ఓ దుండగుడు ప్రజలపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. లండన్ (London)లో ఈ ఘటన జరిగింది. -
కరోనా జన్యు గుట్టువిప్పిన శాస్త్రవేత్తకు చైనా వేధింపులు..!
కరోనా వైరస్ (సార్స్కోవ్-2) జన్యు సీక్వెన్స్ను తొలిసారి ప్రచురించిన వైరాలజిస్ట్కు చైనా అధికారుల నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. -
భారత్ సూపర్ పవర్ కావాలని కలలుకంటుంటే.. మనం అడుక్కుంటున్నాం: పాక్ నేత
పాకిస్థాన్లోని అతివాద ఇస్లామిక్ నాయకుడు మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ సోమవారం జాతీయ అసెంబ్లీలో ప్రసంగిస్తూ భారత్ అభివృద్ధి చెందుతున్న తీరును కొనియాడారు. -
గురుపత్వంత్పై హత్యాయత్నం వెనుక ‘రా’!
సిక్కు వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూపై అమెరికాలో జరిగిన హత్యాయత్నంలో భారత్ గూఢచర్య సంస్థ ‘రా’ అధికారి ప్రమేయం ఉందని పేర్కొంటూ వాషింగ్టన్ పోస్ట్ పత్రిక సోమవారం ఒక కథనం ప్రచురించింది. -
కెన్యాలో భారీ వర్షాలు.. డ్యాం కూలి 45 మంది దుర్మరణం
ఆఫ్రికా దేశమైన కెన్యాలో కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. సోమవారం నీటి ఉద్ధృతి ఎక్కువ కావడంతో పశ్చిమ కెన్యాలోని మై మహియు ప్రాంతంలోని పురాతన కిజాబె డ్యాం కూలిపోయింది. -
పారిస్కూ పాకిన విద్యార్థుల ఆందోళనలు
గాజా యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో కొనసాగుతున్న ఆందోళనలు ఫ్రాన్స్ రాజధాని పారిస్నూ కుదిపేస్తున్నాయి. సోమవారం సర్బాన్ యూనివర్సిటీలో విద్యార్ధులు పాలస్తీనా అనుకూల ప్రదర్శనలు నిర్వహించారు. -
ఇజ్రాయెల్కు ఐసీసీ వారెంట్ల గుబులు!
కాల్పుల విరమణ చర్చలు కీలక దశకు చేరుకుంటున్న వేళ.. ఇజ్రాయెల్కు అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ఐసీసీ) గుబులు పట్టుకుంది. 2014 నాటి గాజా యుద్ధం కేసులో తమ సైనిక అధికారులు, నేతలపై ఐసీసీ అరెస్టు వారెంట్లు జారీ చేయొచ్చన్న వార్తలపై ఆందోళన నెలకొన్నట్లు తెలుస్తోంది. -
40 రోజుల కాల్పుల విరమణ!
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ కోసం అమెరికా, ఈజిప్టు, ఖతార్ దేశాలు తెర వెనక జరుపుతున్న ప్రయత్నాలు కీలక దశకు చేరాయి. ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదనను ఈ దేశాలు హమాస్కు పంపాయి!.
తాజా వార్తలు (Latest News)
-
‘ఆయుధాలు అప్పగించేదే లేదు..!’ ఆర్మీని అడ్డుకున్న మహిళలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
విడాకులు తీసుకున్న కుమార్తెను ఘనంగా ఇంటికి ఆహ్వానించిన తండ్రి
-
ఓటీటీలో సిద్ధార్థ్ రాయ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
వరుణుడి అడ్డంకి.. బంగ్లాదేశ్పై భారత్ విజయం
-
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. గెలాక్సీ ఎస్23పై ₹20వేలు డిస్కౌంట్