Kate Middleton: క్యాన్సర్ నిర్ధరణ.. పిల్లలకు కేట్ ఏం చెప్పారంటే..?
ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కేట్ మిడిల్టన్ (Kate Middleton) క్యాన్సర్కు చికిత్స తీసుకుంటున్నారు. ఈ సమయంలో తమ గోప్యతకు సహకరించాలని ఆమె కోరారు.
లండన్: బ్రిటన్ యువరాజు విలియం సతీమణి, ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కేట్ మిడిల్టన్(Kate Middleton) క్యాన్సర్(Cancer) బారినపడ్డారు. ఆమె తన ముగ్గురు పిల్లలకు ఆ విషయాన్ని ఎలా వెల్లడించారో చెప్పారు. ఈ మేరకు వీడియో సందేశం ద్వారా స్పందించారు.
కేట్ (Kate Middleton) శస్త్రచికిత్స చేయించుకున్నారని జనవరిలో ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కార్యాలయం వెల్లడించింది. ఆ తర్వాతే క్యాన్సర్ బయటపడిందని, కిమో థెరపీ చేయించుకుంటున్నానని ఆమె చెప్పారు. ‘‘క్యాన్సర్ గురించి తెలియగానే షాక్కు గురయ్యా. మా పిల్లల్ని దృష్టిలో ఉంచుకొని ఈ విషయంలో మేం జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాం. మాకు ఎదురైన పరిస్థితిని అర్థం చేసుకోవడానికి, దానిని చిన్నారులతో పంచుకోవడానికి సమయం పట్టింది. అప్పటికే శస్త్రచికిత్స చేయించుకోవడంతో కోలుకొని, కిమో థెరపీ ప్రారంభించాల్సి వచ్చింది. మరీ ముఖ్యంగా జార్జ్, చార్లట్, లూయిస్కు ప్రతిదీ సున్నితంగా వివరించాల్సి వచ్చింది. నేను క్షేమంగా ఉన్నానని, కోలుకుంటున్నానని వారికి భరోసా ఇచ్చాను. ఈ క్లిష్ట పరిస్థితుల్లో విలియం నుంచి అందుతోన్న మద్దతు మరువలేనిది. మీరంతా మా మీద చూపిన ప్రేమ మాకు ఎంతో విలువైంది. ఈ చికిత్స పూర్తయ్యేవరకు మా గోప్యతకు సహకరిస్తారని ఆశిస్తున్నాం’’ అని ఆమె పేర్కొన్నారు.
2011లో వివాహం చేసుకున్న విలియం, కేట్లకు ముగ్గురు సంతానం. ఇప్పటికే బ్రిటన్ రాజు, విలియం తండ్రి ఛార్లెస్-3 క్యాన్సర్కు చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. శస్త్రచికిత్స తర్వాత ఆమె బాహ్య ప్రపంచానికి కనిపించకపోవడంతో ఎన్నో వదంతులు వ్యాపించాయి. ఆమె కోమాలోకి వెళ్లి ఉండొచ్చని ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే స్పష్టత వచ్చింది.
స్పందించిన హ్యారీ, మేఘన్
క్యాన్సర్కు చికిత్స తీసుకుంటున్నానని కేట్ చేసిన ప్రకటనపై విలియం సోదరుడు హ్యారీ, ఆయన సతీమణి మేఘన్ మెర్కల్ స్పందించారు. ‘కేట్ ఈ పరిస్థితి నుంచి త్వరగా కోలుకోవాలి’ అని కోరుకున్నారు. బ్రిటన్ రాజకుటుంబ సభ్యులైన వీరు కొన్నేళ్ల క్రితం రాజరికపు విధుల నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. తర్వాత అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ.. అధికారికంగా ప్రకటించిన కమలా హారిస్
డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి కమలాహారిస్ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. -
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం