Taiwan: తైవాన్ చైనాలో భాగమే.. హోండురాస్ ప్రకటన..!
తైవాన్ గుర్తింపును మరో దేశం తొలగించింది. మధ్య అమెరికా దేశమైన హోండురాస్ చైనా పంచన చేరింది.
ఇంటర్నెట్డెస్క్: మధ్య అమెరికా దేశమైన హోండురాస్(Honduras ) ద్వీపదేశం తైవాన్(Taiwan)కు షాక్ ఇచ్చింది. చైనా(China )తో దౌత్య సంబంధాలు పెట్టుకొని ఇప్పటికే తైవాన్తో దశాబ్దాలుగా ఉన్న బంధాన్ని తెంచుకొంది. తమ దేశంతో దౌత్యబంధం కొనసాగించేందుకు హోండురాస్ భారీ మొత్తం సొమ్మును డిమాండ్ చేసిందని తైవాన్ విదేశాంగమంత్రి ఆరోపించడం విశేషం. గత వారం హోండురాస్ విదేశాంగ మంత్రి చైనాలో పర్యటించిన సమయంలోనే తైవాన్తో సంబంధాలు తెంచుకోనుందనే ప్రచారం జరిగింది. మరోవైపు హోండురాస్ అధ్యక్షురాలు షిమోరా కాస్ట్రో మాట్లాడుతూ తామ ప్రభుత్వం చైనాతో సంబంధాలను మొదలుపెట్టిందని ప్రకటించారు.
చైనా విదేశాంగ మంత్రి క్విన్ జాంగ్, హోండురాస్ విదేశాంగ మంత్రి ఎడ్వర్డో ఎన్రిక్ రియాన దౌత్య గుర్తింపు డీల్పై బీజింగ్లో సంతకలు చేశారు. దీంతో 1940 ముందు నుంచి తైవాన్తో ఉన్న సంబంధాలకు ముగింపు పలికినట్లైంది. శనివారం రాత్రి హోండురాస్ విదేశాంగ మంత్రి మాట్లాడుతూ.. తాము పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాను గుర్తిస్తున్నట్లు ప్రకటించారు. దీనిప్రకారం చైనానే చైనీస్ ప్రజలు, తైవాన్ ప్రజలకు అసలైన ప్రతినిధిగా అంగీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. తైవాన్ను చైనా నుంచి విడదీయలేని భాగంగా అంగీకరిస్తున్నట్లు తెలిపారు.
చైనా ఇప్పటి వరకు తైవాన్ను తమ దేశంలోని స్వయం ప్రతిపత్తి ఉన్న ప్రాంతంగా వాదిస్తోంది. మరో దేశం నేరుగా తైవాన్తో దౌత్య సంబంధాలు పెట్టుకోవడాన్ని అంగీకరించమని చెబుతోంది.
ఈ పరిణామాలపై ఆదివారం తైవాన్ స్పందించింది. ఆ దేశ విదేశాంగ మంత్రి జోసఫ్ వూ మాట్లాడుతూ హోండురాస్లో కాస్ట్రో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చైనా గురించి కలలు కనడం మొదలుపెట్టిందని పేర్కొన్నారు. ఈ విషయం అర్థమై తాము వారితో చర్చించామన్నారు. ఆ సమయంలో కాస్ట్రో ప్రభుత్వం బిలియన్ల డాలర్ల ఆర్థిక సాయం కోరిందని తెలిపారు.మార్చి 13వ తేదీన హోండురాస్ మంత్రి లేఖ రాసి 2.45 బిలియన్ డాలర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారన్నారు. వీటితో ఆసుపత్రి, ఆనకట్ట నిర్మిస్తామని.. అప్పును మాఫీ చేయమని కోరినట్లు వెల్లడించారు. వాస్తవానికి వారు ఆసుపత్రి పేరు అడ్డుపెట్టుకొని డబ్బు అడుగుతున్నట్లే అనిపించిందని తైవాన్ మంత్రి పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు