Houthis: భారత్-బ్రిటన్ సముద్రగర్భ కమ్యూనికేషన్ కేబుల్పై హూతీల దాడి..!
హూతీలు కీలకమైన సముద్రగర్భ కేబుల్స్ను ధ్వంసం చేసినట్లు కథనాలు వెలువడుతున్నాయి. వీటిల్లో భారత్ వినియోగించేవి కూడా ఉన్నట్లు చెబుతున్నారు.
ఇంటర్నెట్డెస్క్: ప్రపంచ కమ్యూనికేషన్ వ్యవస్థలకు జీవనాడి వంటి సముద్రగర్భ కేబుల్స్పై హూతీలు (Houthis) దాడులు మొదలుపెట్టినట్లు అనుమానాలు బలపడుతున్నాయి. తాజాగా భారత్-బ్రిటన్ మధ్య ఉన్న కమ్యూనికేషన్ లైన్ సహా నాలుగింటిపై దాడులు చేసినట్లు కథనాలు వెలుడుతున్నాయి. వీటిల్లో భారత్-ఐరోపా మధ్య సేవలు అందించేవి అధికంగా ఉన్నట్లు భావిస్తున్నారు. యెమన్ తీర జలాల అడుగు నుంచి పరిచిన నాలుగు కమ్యూనికేషన్ తీగలు ఈ దాడుల్లో దెబ్బతిన్నట్లు సమాచారం. వీటిల్లో ఒక దానిని నిర్వహించే సంస్థ ఇప్పటికే ఈ అంశాన్ని ధ్రువీకరించింది.
దెబ్బతిన్నవి ఏమిటీ..
మొత్తం నాలుగు సముద్ర గర్భ కమ్యూనికేషన్ లైన్లు దెబ్బతిన్నట్లు జెరూసలెంపోస్ట్, గ్లోబెక్స్ కథనాలు పేర్కొన్నాయి. డేటాసెంటర్ డైనమిక్స్ ఇదే రకమైన అనుమానాలు వ్యక్తం చేస్తోంది. దెబ్బతిన్న వాటిల్లో ఏఏఈ-1, సీకామ్, యూరప్-ఇండియా గేట్వే, టాటా గ్లోబల్ నెట్వర్క్ అట్లాంటిక్కు చెందినవి ఉన్నట్లు తెలుస్తోంది.
* ఏఏఈ-1 కేబుల్: ఇది తూర్పు ఆసియాను ఈజిప్ట్ మీదుగా ఐరోపాతో అనుసంధానిస్తుంది. అంతేకాదు.. చైనాను ఖతర్, పాకిస్థాన్ మీదుగా పశ్చిమ దేశాలతో కలుపుతుంది.
* యూరప్ ఇండియా గేట్వే (ఈఐజీ) కేబుల్: దక్షిణ ఐరోపా ప్రాంతం మీదుగా ఈజిప్ట్, సౌదీ, జిబూటి, యూఏఈ, భారత్కు కమ్యూనికేషన్ సేవలు అందిస్తుంది .
* సీకామ్ కేబుల్: ఐరోపా, ఆఫ్రికా, భారత్, దక్షిణాఫ్రికా దేశాలను అనుసంధానిస్తుంది. సీకామ్-టాటా కమ్యూనికేషన్స్ కలిసి పనిచేస్తాయి.
గతంలోనే హెచ్చరికలు..
ఎర్ర సముద్రంలో నౌకల రక్షణకు అమెరికా సంకీర్ణసేనలు సిద్ధమైన వేళ.. బాబ్-ఎల్-మండెప్ వద్ద నుంచి వెళ్లే సముద్ర గర్భ ఇంటర్నెట్ కేబుళ్లను ధ్వంసం చేస్తామని హూతీలు హెచ్చరించారు. ఈ మేరకు వారు టెలిగ్రామ్లో సందేశాలు ఉంచారు. కొన్ని అండర్సీ కేబుల్స్ చిత్రాలను కూడా పోస్టు చేశారు. అదే జరిగితే ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్, బ్యాంకింగ్ వంటి కీలక సేవలకు అంతరాయం ఏర్పడుతుందన్నారు.
ప్రపంచ ఇంటర్నెట్ ట్రాఫిక్లో 17శాతానికి సంబంధించిన కేబుల్స్ ఈజిప్ట్లోని సూయజ్, బాబ్-ఎల్-మండెప్ జలసంధుల మీదుగా ఐరోపా-ఆసియా ప్రాంతాలను కలుపుతున్నాయి. ముఖ్యంగా గేట్ ఆఫ్ టియర్స్గా పేరున్న యెమెన్-జిబూటీ, ఎరిత్రియా మధ్య సముద్రం వెడల్పు కేవలం దాదాపు 32 కిలోమీటర్లు మాత్రమే. ఇక్కడ కొన్ని వందల మీటర్ల లోతులో ఈ తీగలను పర్చారు. సాధారణ డైవర్లు ఇక్కడికి చేరడం దాదాపు అసాధ్యం. అమెరికా, రష్యా నౌకాదళాలకు మాత్రమే వీటిని కత్తిరించే సామర్థ్యం ఉంది. ప్రత్యేకమైన పరికరాలు, వాహనాలను దీనికోసం వాడాల్సి ఉంటుంది. హూతీలు డైవర్లు, నౌకలకు వాడే మైన్లను వినియోగించి వీటిని ధ్వంసం చేసే అవకాశాలుండొచ్చని అనుమానిస్తున్నారు.
మరమ్మతులకు కొన్ని వారాలు..?
వేర్వేరు మార్గాల్లో ప్రపంచంలోని ఇతర ప్రాంతాలను అనుసంధానించే నెట్వర్క్లు ఉండటంతో ఈ దాడి వల్ల పెద్దగా సమస్య ఉండకపోవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే ఇంటర్నెట్ పర్యవేక్షక సంస్థ నెట్బ్లాక్స్ మాత్రం జిబూటీలో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడినట్లు ఎక్స్లో ధ్రువీకరించింది. సీకామ్ సంస్థ కూడా నెట్వర్క్ సమస్యలు గుర్తించినా.. లోపాలను కచ్చితంగా చెప్పలేకపోతున్నట్లు పేర్కొంది. మరమ్మతులకు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. తాజాగా దెబ్బతిన్న కేబుల్స్ను సరి చేయడానికి కనీసం ఎనిమిది వారాల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు.
అసలేమిటీ అండర్సీ కేబుల్స్..
1858లో ప్రపంచంలోనే తొలిసారి సముద్రంలో టెలిగ్రాఫ్ కేబుల్స్ వేశారు. అట్లాంటిక్ టెలిగ్రాఫ్ కంపెనీ ఈ పనిచేసింది. అంతర్జాతీయ కమ్యూనికేషన్లు, ఆర్థిక వ్యవస్థకు ఇది కీలకంగా మారింది. ప్రస్తుతం సముద్ర గర్భంలో 300కు పైగా కీలక ఫైబర్ఆప్టిక్ లైన్లు ఉన్నాయి. ఫోన్కాల్స్, రోజువారీ జరిగే బిలియన్ డాలర్ల కొద్దీ అంతర్జాతీయ నగదు లావాదేవీలు, దౌత్య సందేశాలు వంటివి వీటి నుంచే జరుగుతుంటాయి. ప్రపంచ కమ్యూనికేషన్లలో 90శాతానికి ఇవే దిక్కు. భారత్కు వివిధ ప్రాంతాలతో జరిగే కమ్యూనికేషన్లలో 50శాతం, ఖతర్కు 60శాతం, ఒమన్కు 70శాతం, యూఏఈకి 80శాతం, కెన్యాకు 90శాతం ఈ మార్గం నుంచే వెళతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఒక దశలో ఒంటరితనాన్ని అనుభవించారట. చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన చెప్పారు. -
కారు పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి
అమెరికా(USA)లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ మహిళలు ప్రాణాలు కోల్పోయారు. -
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
Miss Universe Buenos Aires: 60 ఏళ్ల వయసులో అందాల తారగా కిరీటం దక్కించుకుందో మహిళ. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది మిస్ యూనివర్స్ పోటీల్లోనూ పాల్గొననుంది. -
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
అమెరికా(USA)లో ఓ నల్లజాతీయుడిపై పోలీసులు వ్యహరించిన తీరుతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. దాంతో తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. -
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.
తాజా వార్తలు (Latest News)
-
డ్రగ్ తయారీ మాఫియా గుట్టురట్టు.. 300 కేజీలు స్వాధీనం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం
-
టాప్లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట
-
లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి బలి
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..