Houthis: భారత్-బ్రిటన్ సముద్రగర్భ కమ్యూనికేషన్ కేబుల్పై హూతీల దాడి..!
హూతీలు కీలకమైన సముద్రగర్భ కేబుల్స్ను ధ్వంసం చేసినట్లు కథనాలు వెలువడుతున్నాయి. వీటిల్లో భారత్ వినియోగించేవి కూడా ఉన్నట్లు చెబుతున్నారు.
ఇంటర్నెట్డెస్క్: ప్రపంచ కమ్యూనికేషన్ వ్యవస్థలకు జీవనాడి వంటి సముద్రగర్భ కేబుల్స్పై హూతీలు (Houthis) దాడులు మొదలుపెట్టినట్లు అనుమానాలు బలపడుతున్నాయి. తాజాగా భారత్-బ్రిటన్ మధ్య ఉన్న కమ్యూనికేషన్ లైన్ సహా నాలుగింటిపై దాడులు చేసినట్లు కథనాలు వెలుడుతున్నాయి. వీటిల్లో భారత్-ఐరోపా మధ్య సేవలు అందించేవి అధికంగా ఉన్నట్లు భావిస్తున్నారు. యెమన్ తీర జలాల అడుగు నుంచి పరిచిన నాలుగు కమ్యూనికేషన్ తీగలు ఈ దాడుల్లో దెబ్బతిన్నట్లు సమాచారం. వీటిల్లో ఒక దానిని నిర్వహించే సంస్థ ఇప్పటికే ఈ అంశాన్ని ధ్రువీకరించింది.
దెబ్బతిన్నవి ఏమిటీ..
మొత్తం నాలుగు సముద్ర గర్భ కమ్యూనికేషన్ లైన్లు దెబ్బతిన్నట్లు జెరూసలెంపోస్ట్, గ్లోబెక్స్ కథనాలు పేర్కొన్నాయి. డేటాసెంటర్ డైనమిక్స్ ఇదే రకమైన అనుమానాలు వ్యక్తం చేస్తోంది. దెబ్బతిన్న వాటిల్లో ఏఏఈ-1, సీకామ్, యూరప్-ఇండియా గేట్వే, టాటా గ్లోబల్ నెట్వర్క్ అట్లాంటిక్కు చెందినవి ఉన్నట్లు తెలుస్తోంది.
* ఏఏఈ-1 కేబుల్: ఇది తూర్పు ఆసియాను ఈజిప్ట్ మీదుగా ఐరోపాతో అనుసంధానిస్తుంది. అంతేకాదు.. చైనాను ఖతర్, పాకిస్థాన్ మీదుగా పశ్చిమ దేశాలతో కలుపుతుంది.
* యూరప్ ఇండియా గేట్వే (ఈఐజీ) కేబుల్: దక్షిణ ఐరోపా ప్రాంతం మీదుగా ఈజిప్ట్, సౌదీ, జిబూటి, యూఏఈ, భారత్కు కమ్యూనికేషన్ సేవలు అందిస్తుంది .
* సీకామ్ కేబుల్: ఐరోపా, ఆఫ్రికా, భారత్, దక్షిణాఫ్రికా దేశాలను అనుసంధానిస్తుంది. సీకామ్-టాటా కమ్యూనికేషన్స్ కలిసి పనిచేస్తాయి.
గతంలోనే హెచ్చరికలు..
ఎర్ర సముద్రంలో నౌకల రక్షణకు అమెరికా సంకీర్ణసేనలు సిద్ధమైన వేళ.. బాబ్-ఎల్-మండెప్ వద్ద నుంచి వెళ్లే సముద్ర గర్భ ఇంటర్నెట్ కేబుళ్లను ధ్వంసం చేస్తామని హూతీలు హెచ్చరించారు. ఈ మేరకు వారు టెలిగ్రామ్లో సందేశాలు ఉంచారు. కొన్ని అండర్సీ కేబుల్స్ చిత్రాలను కూడా పోస్టు చేశారు. అదే జరిగితే ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్, బ్యాంకింగ్ వంటి కీలక సేవలకు అంతరాయం ఏర్పడుతుందన్నారు.
ప్రపంచ ఇంటర్నెట్ ట్రాఫిక్లో 17శాతానికి సంబంధించిన కేబుల్స్ ఈజిప్ట్లోని సూయజ్, బాబ్-ఎల్-మండెప్ జలసంధుల మీదుగా ఐరోపా-ఆసియా ప్రాంతాలను కలుపుతున్నాయి. ముఖ్యంగా గేట్ ఆఫ్ టియర్స్గా పేరున్న యెమెన్-జిబూటీ, ఎరిత్రియా మధ్య సముద్రం వెడల్పు కేవలం దాదాపు 32 కిలోమీటర్లు మాత్రమే. ఇక్కడ కొన్ని వందల మీటర్ల లోతులో ఈ తీగలను పర్చారు. సాధారణ డైవర్లు ఇక్కడికి చేరడం దాదాపు అసాధ్యం. అమెరికా, రష్యా నౌకాదళాలకు మాత్రమే వీటిని కత్తిరించే సామర్థ్యం ఉంది. ప్రత్యేకమైన పరికరాలు, వాహనాలను దీనికోసం వాడాల్సి ఉంటుంది. హూతీలు డైవర్లు, నౌకలకు వాడే మైన్లను వినియోగించి వీటిని ధ్వంసం చేసే అవకాశాలుండొచ్చని అనుమానిస్తున్నారు.
మరమ్మతులకు కొన్ని వారాలు..?
వేర్వేరు మార్గాల్లో ప్రపంచంలోని ఇతర ప్రాంతాలను అనుసంధానించే నెట్వర్క్లు ఉండటంతో ఈ దాడి వల్ల పెద్దగా సమస్య ఉండకపోవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే ఇంటర్నెట్ పర్యవేక్షక సంస్థ నెట్బ్లాక్స్ మాత్రం జిబూటీలో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడినట్లు ఎక్స్లో ధ్రువీకరించింది. సీకామ్ సంస్థ కూడా నెట్వర్క్ సమస్యలు గుర్తించినా.. లోపాలను కచ్చితంగా చెప్పలేకపోతున్నట్లు పేర్కొంది. మరమ్మతులకు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. తాజాగా దెబ్బతిన్న కేబుల్స్ను సరి చేయడానికి కనీసం ఎనిమిది వారాల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు.
అసలేమిటీ అండర్సీ కేబుల్స్..
1858లో ప్రపంచంలోనే తొలిసారి సముద్రంలో టెలిగ్రాఫ్ కేబుల్స్ వేశారు. అట్లాంటిక్ టెలిగ్రాఫ్ కంపెనీ ఈ పనిచేసింది. అంతర్జాతీయ కమ్యూనికేషన్లు, ఆర్థిక వ్యవస్థకు ఇది కీలకంగా మారింది. ప్రస్తుతం సముద్ర గర్భంలో 300కు పైగా కీలక ఫైబర్ఆప్టిక్ లైన్లు ఉన్నాయి. ఫోన్కాల్స్, రోజువారీ జరిగే బిలియన్ డాలర్ల కొద్దీ అంతర్జాతీయ నగదు లావాదేవీలు, దౌత్య సందేశాలు వంటివి వీటి నుంచే జరుగుతుంటాయి. ప్రపంచ కమ్యూనికేషన్లలో 90శాతానికి ఇవే దిక్కు. భారత్కు వివిధ ప్రాంతాలతో జరిగే కమ్యూనికేషన్లలో 50శాతం, ఖతర్కు 60శాతం, ఒమన్కు 70శాతం, యూఏఈకి 80శాతం, కెన్యాకు 90శాతం ఈ మార్గం నుంచే వెళతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
జపాన్లోని పలు ప్రాంతాల్లో ప్రజలు ఆచరించే ఓ సంప్రదాయం గురించిన విషయాలు ప్రస్తుతం వైరల్గా మారుతున్నాయి. -
నెట్ఫ్లిక్స్కు నిరసన సెగ.. నెట్టింట్లో బాయ్కాట్ కాల్స్
నెటిఫ్లిక్స్ (Netflix) నిరసన సెగను ఎదుర్కొంటోంది. దానిని బాయ్కాట్ చేయాలంటూ పలువురు పోస్టులు పెడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
పెన్సిల్వేనియాలో ర్యాలీ నిర్వహిస్తానని ప్రకటించిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ -
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ.. అధికారికంగా ప్రకటించిన కమలా హారిస్
డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి కమలాహారిస్ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. -
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..