farmgate scandal: దేశాధ్యక్షుడి అక్రమాలనే పట్టించిన దొంగతనం..!
దేశాధ్యక్షుడి ఫామ్హౌస్లో జరిగిన ఓ దొంగతనం అతడి అక్రమాలను వెలుగులోకి తెచ్చింది. దొంగతనం విషయం బయటకు రాకుండా చేయాలనుకున్న అతడి ప్లాన్ బెడిసికొట్టింది.
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
‘డబ్బుపోయే శనిపట్టే’ అన్నట్లుంది దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా పరిస్థితి. అక్రమంగా ఫామ్హౌస్లో దాచుకొన్న డబ్బు పోయింది.. ‘తేలుకుట్టిన దొంగలా’ ఉందామని ఆయన యత్నించినా.. ఆ విషయం బయటకు వచ్చి పదవి కూడా ఊడే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా రాజకీయాలను ఫలాఫలా ‘ఫామ్గేట్’ కుంభకోణం కుదిపేస్తోంది. అవినీతిని నిర్మూలిస్తానంటూ ఎన్నికల్లో ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన రామ ఫోసా అక్రమ సొమ్ము కూడబెట్టారనే అపవాదును మోస్తున్నారు. పోయిన డబ్బేదో పోయింది.. దొంగల నోరు మూయించడానికి ఎదురు చెల్లింపులు చేశారంటే ఆయన పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అధ్యక్షుడు సిరిల్ రామఫోసాపై ఆరోపణలు చేసింది ఎవరో సాధారణ వ్యక్తికాదు. సౌతాఫ్రికన్ స్టేట్ సెక్యూరిటీ ఏజెన్సీ మాజీ అధిపతి ఆర్థర్ ఫ్రాసెర్.
అధ్యక్షుడి సొమ్ము దొంగలపాలు..
2020 ఫిబ్రవరి9న దక్షిణాఫ్రికాలోని లింపూపూ ప్రావిన్స్లోని రామఫోసాకు ఫలాఫలా వైల్డ్లైఫ్ ఫామ్ ఉంది. అక్కడి ఫర్నీచర్లో లక్షల డాలర్లను దాచిపెట్టారు. అక్కడి హౌస్కీపర్ ఈ విషయాన్ని గుర్తించి తన సోదరుడికి చెప్పింది. అతడికి తెలిసిన ఓ క్రిమినల్ గ్యాంగ్ రంగంలోకి దిగింది. ఆరుగురు సభ్యుల ఈ గ్యాంగ్లో నలుగురు నమీబియా వాసులు ఉన్నారు. వీరు ఫామ్హౌస్లోకి రావడానికి హౌస్కీపర్ సహకరించింది. ఆ గ్యాంగ్ అక్కడి సొమ్మును దోచుకొంది. ఆ సమయంలో అధ్యక్షుడు రామఫోసా విదేశీ పర్యటనలో ఉన్నారు. దొంగతనం విషయం తెలియగానే ప్రెసిడెన్షియల్ ప్రొటెక్షన్ పోలీస్ యూనిట్ను నిందితులను పట్టుకోవాలని పురమాయించారు. అంతేగానీ, సంబంధిత శాఖ వద్ద ఎటువంటి కేసు పెట్టలేదు. ప్రెసిడెన్షియల్ ప్రొటెక్షన్ పోలీస్ యూనిట్ అధిపతి మేజర్ జనరల్ వాలీ రుడ్ మాత్రం రిటైర్డ్ పోలీసులు, క్రైం ఇంటెలిజెన్స్ యూనిట్లోని పోలీసులతో కలిపి బృందాన్ని ఏర్పాటు చేశాడు. వారు హౌస్ కీపర్, అతడికి సహకరించిన వారిని పట్టుకొని కొంత సొమ్ము రికవరీ చేశారు. నిందితులు ఈ విషయాలు ఎక్కడా చెప్పకుండా ఉండటానికి ఎదురు డబ్బు చెల్లించారు.
ఎలా బయటకు వచ్చింది..
2022 జూన్ 1న దేశాధ్యక్షుడు రామఫోసాపై కిడ్నాప్, లంచాలు, మనీలాండరింగ్, సుమారు 4 మిలియన్ డాలర్లకు సంబంధించి నేరాలను దాచడం వంటి ఆరోపణలు చేస్తూ జొహన్నెస్బర్గ్ పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు అందింది. సౌతాఫ్రికన్ స్టేట్ సెక్యూరిటి ఏజెన్సీ మాజీ అధిపతి ఆర్థర్ ఫ్రాసెర్ ఆ ఫిర్యాదుదారు. దీనికి సంబంధించిన కీలక ఆధారాలు కూడా సమర్పించాడు. ఆ దేశంలోని ప్రివెన్షన్ అండ్ కాంబాట్ కరెప్ట్ యాక్టివిటీస్ చట్టం కింద ఈ ఆరోపణలు నమోదయ్యాయి. ఈ చట్టం కింద వచ్చే నేరాలపై ఫిర్యాదు చేయకపోవడం కూడా నేరమే అవుతుంది. దొంగతనంలో పోయిన సొమ్ము అక్రమ సంపాదనగా ఆరోపణలు వెల్లువెత్తాయి. ‘ఫామ్గేట్’ కుంభకోణంగా ఇది పాపులర్ అయింది. దీంతో అధ్యక్షుడు ప్రతినిధి జూన్2వ తేదీన ఫలాఫలా ఫామ్లో దొంగతనం జరిగిందని అంగీకరించాడు. ప్రెసిడెన్షియల్ ప్రొటెక్షన్ యూనిట్కు ఫిర్యాదు చేసిన విషయాన్ని కూడా ధ్రువీకరించారు. ఈ నేపథ్యంలో రామఫోసాపై దర్యాప్తు మొదలైంది. మరోవైపు రామఫోసా ఆ డబ్బు ఎలా వచ్చిందో చాలా కాలం నోరు మెదపలేదు. దర్యాప్తు సంస్థ విచారణలో మాత్రం ‘పశువుల విక్రయాలతో సంపాదించిన సొమ్ము’ అని పేర్కొన్నాడు.
తాజాగా ఏం జరుగుతోంది..
ఆ దేశ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ శాండిల్ నగ్కోబో ఆధ్వర్యంలోని దర్యాప్తు ప్యానెల్ బుధవారం తన నివేదికను నేషనల్ అసెంబ్లీ స్పీకర్కు అందజేసింది. అందులో రామఫోసాను తప్పుబట్టింది. ఆయనను అభిశంసించడానికి అది మార్గం సుగమం చేసింది. దక్షిణాఫ్రికాలో ఎటువంటి అనుమతి లేకుండా భారీ మొత్తంలో విదేశీ మారక ద్రవ్యాన్ని వ్యక్తుల వద్ద నిల్వచేయడం నేరం. దీంతో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేస్తున్నాయి. కాకపోతే ఆయన్ను పదవి నుంచి తొలగించే బలం ప్రతిపక్షాలకు లేదు.
ఆర్థర్ ఫ్రాసెర్ దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమాకు నమ్మినబంటుగా పేరుంది. జాకబ్ జుమాపై అవినీతి ఆరోపణలు రావడంతో రామఫోసాకు దేశాధ్యక్ష పగ్గాలు అందాయి. ఆ తర్వాత అవినీతిని నిర్మూలిస్తానంటూ రామఫోసా ఎన్నికలకు వెళ్లి విజయం సాధించారు. రాజకీయ వైరం కారణంగా ఆర్థర్ ఫ్రాసెర్ ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. 2024లో జరిగే ఎన్నికల్లో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ తరపున అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకోవడానికి దాదాపు నెలరోజుల ముందు ఈ కుంభకోణం సౌతాఫ్రికాను కుదిపేస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
పెన్సిల్వేనియాలో ర్యాలీ నిర్వహిస్తానని ప్రకటించిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ -
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ.. అధికారికంగా ప్రకటించిన కమలా హారిస్
డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి కమలాహారిస్ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. -
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం