sudan: సూడాన్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్ ఆక్రమణ.. డబ్ల్యూహెచ్వో హెచ్చరిక
సూడాన్లోని (Sudan) పబ్లిక్ హెల్త్ ల్యాబ్ (Public Health Lab)ను సాయుధ బలగాలు ఆక్రమించుకోవడంపై డబ్ల్యూహెచ్వో ఆందోళన వ్యక్తం చేసింది. అనుకోనిదేదైనా జరిగి ల్యాబ్లోని వ్యాధికారక జీవాలు బయటకి వస్తే.. చాలా ప్రమాదమని హెచ్చరించింది.
జెనీవా: సూడాన్లో (Sudan) చోటు చేసుకుంటున్న పరిణామాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆందోళన వ్యక్తం చేసింది. అక్కడి సాయుధ బలగాలు సెంట్రల్ పబ్లిక్ ల్యాబ్ను (Public Central Lab) ఆక్రమించుకోవడాన్ని తప్పుబట్టింది. ఇందులో పోలియో, మీజిల్స్ సహా రకరకాల వ్యాధులకు సంబంధించిన నమూనాలు ఉన్నాయని, ఒక వేళ ప్రమాదవశాత్తు అవి బయటకి వస్తే జీవ వినాశనానికి దారిస్తాయని హెచ్చరించింది. ఈ చర్య ‘మానవాళికి ఇది చాలా చాలా ప్రమాదకరం’ అని సూడాన్లో డబ్ల్యూహెచ్వో ప్రతినిధి సయీద్ అబిద్ తెలిపారు. వీలైనంత త్వరగా బలగాలు అక్కడి నుంచి నిష్క్రమించాలని కోరారు. ‘‘ సాయుధ బలగాల్లోని ఓ వర్గం సెంట్రల్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్ను ఆక్రమించింది. దీంతో జీవసంబంధమైన ప్రమాదం పొంచి ఉంది.’’ అని సయీద్ అబిద్ తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన విలేకరులతో మాట్లాడారు.
దాదాపు ప్రతి దేశంలోనూ ఓ సెంట్రల్ పబ్లిక్ ల్యాబ్ ఉంటుంది. దేశంలో గతంలో విజృంభించిన వివిధ వ్యాధులకు సంబంధించిన వైరస్లను, నమూనాలను ఇక్కడ భద్రపరుస్తారు. భవిష్యత్లో మళ్లీ వ్యాధులు చెలరేగితే వాటిపై పరిశోధనలు చేసేందుకు ఈ నమూనాలు ఉపయోగపడతాయి. ఈ ల్యాబ్ మొత్తం కేంద్ర ఆరోగ్యశాఖ పర్యవేక్షణలో జాతీయ వ్యాధుల నియంత్రణ విభాగం అధీనంలో ఉంటుంది. ఒకవేళ ఏదైనా వైరస్ ఈ ల్యాబ్ నుంచి బయటకి వచ్చిందంటే.. రోజుల వ్యవధిలోనే దేశవ్యాప్తంగా విజృంభించే అవకాశం ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను ముప్పుతిప్పలు పెట్టిన కరోనా వైరస్సే ఇందుకు ఉదాహరణ. ఆ వైరస్ చైనాలోని వూహాన్ ల్యాబ్ నుంచే బయటకి వచ్చి ఉంటుందని పలువురు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్న సంగతి తెలిసిందే. ఇంతటి కీలకమైన పబ్లిక్ హెల్త్ ల్యాబ్ను సాయుధ బలగాలు స్వాధీనం చేసుకోవడంపై డబ్ల్యూహెచ్వో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. అనుకోనిదేదైనా జరిగి అక్కడి వైరస్లుగానీ, వ్యాధికారక జీవాలుగానీ బయటకి వస్తే భారీ జీవసంబంధ ప్రమాదం చోటుచేసుకునే అవకాశం ఉందని హెచ్చరించింది.
సూడాన్పై పట్టు కోసం ఆర్మీ, ఆర్ఎస్ఎఫ్ బలగాల మధ్య గత 10 రోజులుగా భీకర పోరు సాగుతున్న విషయం తెలిసిందే. 2021 అక్టోబరులో సైనిక తిరుగుబాటుతో సూడాన్లో తాత్కాలిక ప్రభుత్వం కుప్పకూలింది. ఆ తర్వాత పారామిలిటరీ గ్రూపు ఆర్ఎస్ఎఫ్తో సైన్యానికి విభేదాలు పెరిగాయి. ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ను సైన్యంలో విలీనం చేసేందుకు సూడాన్ ఆర్మీ రూపొందించిన ప్రతిపాదన.. ఆర్మీ- పారా మిలిటరీ బలగాల మధ్య ఘర్షణలకు దారితీసింది. ఈ విషయమై సైన్యాధినేత అబ్దెల్ ఫతా అల్ బుర్హాన్, పారా మిలటరీ కమాండర్ మహ్మద్ హందాన్ డగ్లో మధ్య కొన్ని వారాలుగా నెలకొన్న విభేదాలు తారస్థాయికి చేరాయి. ఈ క్రమంలోనే ఆర్మీ, పారామిలటరీ బలగాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ.. అధికారికంగా ప్రకటించిన కమలా హారిస్
డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి కమలాహారిస్ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. -
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం