Elon Musk: అప్పుడు చనిపోతానేమో అనుకున్నా: ఎలాన్ మస్క్
కొవిడ్ రెండో బూస్టర్ డోసు వేయించుకున్న తర్వాత చనిపోవాలన్నంత బాధ అనిపించిందని టెస్లా అధినేత ఎలాన్మస్క్ అన్నారు. ఈ మేరకు తాను అనుభవించిన పరిస్థితిని ట్విటర్లో రాసుకొచ్చారు.
ఇంటర్నెట్డెస్క్: టెస్లా అధినేత ఎలాన్మస్క్ (Elon Musk) సామాజిక మాధ్యమాల్లో ఇటీవల హాట్ టాపిక్ అవుతున్నారు. ట్విటర్ (Twitter)ను కొనుగోలు చేసిన తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాలు, వాటిపై యూజర్ల కామెంట్లు, రీ ట్వీట్లతో ‘మస్క్’ పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. కొవిడ్ వ్యాక్సిన్ (Covid Vaccine) వల్ల దుష్ప్రభావాలు ఎదురవుతున్నాయని ఈ మధ్య కాలంలో వార్తలు గుప్పుమంటున్న నేపథ్యంలో ఆయన చేసిన పోస్టు దుమారం రేపుతోంది. ‘కొవిడ్ రెండో బూస్టరు డోసు వేసుకున్న తర్వాత చనిపోతానేమోనని పించింది’ అంటూ వ్యాక్సినేషన్ (Vaccination) అనంతరం తాను ఎలాంటి పరిస్థితిని అనుభవించారో ట్విటర్లో రాసుకొచ్చారు. ‘కొవిడ్ బూస్టర్ డోసు వేయించుకున్న తర్వాత చనిపోతానేమో అన్నంత బాధనిపించింది. మొదటి డోసుతో అంతగా ఇబ్బంది అనిపించలేదు. కానీ, రెండో డోసు తర్వాత చాలా ఇబ్బంది పడ్డాను. దీని ప్రభావం చాలా రోజుల వరకు ఉంది. అయితే, క్రమంగా తగ్గింది’’ అని మస్క్ ట్విటర్లో పోస్టు చేశారు.
జర్మనీలోని టెస్లా గిగాఫ్యాక్టరీకి సందర్శనకు వెళ్తున్న నేపథ్యంలో రెండో డోసు వేసుకోవాల్సి వచ్చిందని మస్క్ చెప్పారు. వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత తీవ్రమైన కండరాల నొప్పులు, ఒళ్లు మంటలతో బాధపడ్డానని చెప్పారు. ఈ పరిస్థితి తనొక్కడికే కాదని బంధువైన మరో యువకుడికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైందని, ఆగమేఘాల మీద ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చిందని మస్క్ చెప్పుకొచ్చారు. ‘‘ ఇంతకు ముందు చిన్నపాటి జలుబు చేసినట్లనిపించింది. తగ్గిన తర్వాత వ్యాక్సిన్ వేసుకున్నాను. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వలేదు. అరచేతిలో కొంచెం దురదపెట్టి తగ్గిపోయింది. తాజాగా ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ వేసుకున్నాను. ఇది మాత్రం నన్ను తీవ్ర ఇబ్బందికి గురి చేసింది’’ అని మస్క్ రాసుకొచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్
Iran-Israel: తమ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ తీవ్ర నిర్ణయాలు తీసుకుంటే ప్రతిస్పందన చాలా కఠినంగా ఉంటుందని ఇరాన్ హెచ్చరించింది. ఈ సందర్భంగా టెల్ అవీవ్పై వ్యంగ్యాస్త్రాలు గుప్పించింది. -
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
సైబర్ యుద్ధాలను దీటుగా ఎదుర్కొనేందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ శుక్రవారం చైనా సైన్యంలో.. ఇన్ఫర్మేషన్ సపోర్ట్ ఫోర్స్ (ఐఎస్ఎఫ్) పేరుతో ఓ కొత్త విభాగాన్ని ప్రారంభించారు. -
ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడి!
పశ్చిమాసియా మళ్లీ వేడెక్కింది. ప్రతీకారం తప్పదని గత కొన్ని రోజులుగా హెచ్చరికలు జారీచేస్తున్న ఇజ్రాయెల్.. శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్పై దాడి చేసింది. -
సిరియాలో ఐఎస్ ఉగ్రవాదుల దాడి
సిరియాలో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదుల ముఠా మరోసారి రెచ్చిపోయింది. గురువారం రాత్రి బస్సుపై దాడి చేసి 22 మందిని హతమార్చింది. -
పాలస్తీనాకు వ్యతిరేకంగా అమెరికా ఓటు
ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాకు పూర్తి స్థాయి సభ్యత్వాన్ని కల్పించాలంటూ భద్రతామండలిలో ప్రవేశపెట్టిన ఓ తీర్మానానికి వ్యతిరేకంగా అమెరికా ఓటేసింది. -
కూలిన రష్యా సూపర్ సోనిక్ బాంబర్ విమానం
రష్యా అమ్ములపొదిలో వ్యూహాత్మక సూపర్ సోనిక్ బాంబర్ విమానం టీయూ-22ఎం3ని కూల్చివేసినట్లు ఉక్రెయిన్ శుక్రవారం ప్రకటించింది. -
ట్రంప్ విచారణ జరిగే కోర్టు వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం!
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్నకు సంబంధించిన కేసు విచారణ జరుగుతున్న న్యూయార్క్లోని మాన్హటన్ కోర్టు వెలుపల ఒక వ్యక్తి అగ్నికీలల్లో చిక్కుకోవడం కలకలం సృష్టించింది. -
కలరా టీకాలో కొత్త వెర్షన్కు డబ్ల్యూహెచ్వో ఆమోదం
విస్తృతంగా వినియోగంలో ఉన్న కలరా టీకాకు సంబంధించిన ఒక కొత్త వెర్షన్కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఆమోదం తెలిపింది. -
పారిస్లోని ఇరాన్ దౌత్య కార్యాలయం వద్ద వ్యక్తి అరెస్టు
ఆయుధాలతో సంచరిస్తున్నాడన్న అనుమానంతో పారిస్లోని ఇరాన్ దౌత్య కార్యాలయం వద్ద ఓ వ్యక్తిని స్థానిక పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. -
జపాన్ పౌరుల వాహనమే లక్ష్యంగా పాక్లో ఆత్మాహుతి దాడి యత్నం
పాకిస్థాన్లో జపాన్ దేశీయులు ప్రయాణిస్తున్న వాహనమే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి యత్నం జరిగింది. -
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
ఇరాన్పై డ్రోన్ దాడి విషయంలో ఇజ్రాయెల్ నుంచి తమకు చివరి క్షణంలో సమాచారం అందిందని అమెరికా చెప్పినట్లు ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో టజానీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్
-
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా
-
యాక్టర్ జగన్.. ఎన్నికల లబ్ధికి ఉత్తుత్తి శిబిరాలు
-
కేరళలో ఒక్క ఓటరు కోసం.. అడవిలో 18 కి.మీ. ప్రయాణం