Israel: లెబనాన్కు క్షమాపణలు చెప్పిన ఇజ్రాయెల్ సైన్యం..!
ఇజ్రాయెల్ పొరపాటున జరిపిన దాడిలో లెబనాన్ సైనికుడు మృతి చెందాడు. దీనికి ఐడీఎఫ్ క్షమాపణ చెప్పింది.
ఇంటర్నెట్డెస్క్: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో ఓ ఘటనకు సంబంధించి లెబనాన్కు ఐడీఎఫ్ క్షమాపణలు చెప్పింది. హెజ్బొల్లా సాయుధ గ్రూపును లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడిలో పొరపాటున లెబనాన్ సైనికుడు మృతి చెందాడు. తొలుత ఇజ్రాయెల్ సైన్యం అడెస్సే ప్రాంతంలో జరిపిన బాంబు దాడిలో తమ సైనికుడు మృతి చెందినట్లు లెబనాన్ ఆర్మీ ప్రకటించింది. దీనిపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) స్పందిస్తూ.. తాము హెజ్బొల్లా లాంచ్, అబ్జర్వేషన్ పోస్టును లక్ష్యంగా చేసుకొని దాడి చేశామని వివరణ ఇచ్చింది. కానీ, ఈ దాడిలో అనుకోకుండా పలువురు లెబనాన్ సైనికులు గాయపడినట్లు తమకు తెలిసిందని పేర్కొంది. వాస్తవానికి ఆ దాడిలో లెబనాన్ సైన్యం తమ లక్ష్యం కాదని వెల్లడించింది. ‘‘ఈ ఘటనకు ఐడీఎఫ్ క్షమాపణలు చెబుతోంది. దీనిపై దర్యాప్తు చేపట్టనుంది’’ అని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. మరోవైపు ఐరాస శాంతి పరిరక్షక దళం దీనిపై స్పందిస్తూ.. ప్రస్తుత యుద్ధంలో లెబనాన్ సైనికదళాలు పాల్గొనడం లేదని పేర్కొంది.
ఐడీఎఫ్ మాత్రమే గాజాను నిరాయుధీకరణ చేయగలదు: నెతన్యాహు
ప్రస్తుత యుద్ధం తర్వాత గాజాను నిరాయుధీకరించాల్సి ఉందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. మంగళవారం అర్ధరాత్రి ఆయన ప్రస్తంగిస్తూ.. ఐడీఎఫ్ (ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్) మాత్రమే అది చేయగలదన్నారు. ఏ అంతర్జాతీయ దళానికి ఈ బాధ్యతలు అప్పగించబోమని తేల్చిచెప్పారు. గతంలో కూడా అంతర్జాతీయ దళాలు గాజాలో అంతగా ప్రభావం చూపించలేకపోయాయని గుర్తు చేశారు. అందుకే అటువంటి ఏర్పాట్లను తాము అంగీకరించమని వెల్లడించారు.
‘దేశాన్ని ఏడిపిస్తూ.. తాను ఏడుస్తూ’: కన్నీళ్లు పెట్టుకున్న కిమ్.. వీడియో వైరల్
ప్రస్తుతం గాజాలో చేపట్టిన ఆపరేషన్లో తమ సైన్యం పైచేయి సాధించిందని నెతన్యాహు పేర్కొన్నారు. హమాస్ సంస్థలోని సగానికిపైగా బెటాలియన్ కమాండర్లను ఇప్పటికే ఇజ్రాయెల్ దళాలు హతమార్చాయని ఆయన వెల్లడించారు. తమ దళాలు గాజాలోని ఖాన్యూనిస్, జబల్య పట్టణాలను చుట్టుముట్టాయని పేర్కొన్నారు.
హమాస్ అత్యాచారాలను ఖండించిన బైడెన్..
అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్లోని మహిళలపై హమాస్ దళాలు జరిపిన అత్యాచారాలను అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఖండించారు. ‘‘ఈ దాడిలో బాధితులు భయంకరమైన వివరాలను వెల్లడించారు. ‘హమాస్ ఉగ్రవాదులు జరిపిన లైంగిక హింసను నిస్సందేహంగా అందరూ బలంగా ఖండించాల్సిందే’’ అని బైడెన్ పేర్కొన్నారు. హమాస్ చర్యలపై డెమొక్రటిక్ పార్టీ ప్రతినిధి ప్రమీలా జైపాల్ సరైన విధంగా స్పందించలేదన్న విమర్శలు రావడంతో బైడెన్ స్వయంగా ప్రకటన చేయాల్సి వచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
జపాన్లోని పలు ప్రాంతాల్లో ప్రజలు ఆచరించే ఓ సంప్రదాయం గురించిన విషయాలు ప్రస్తుతం వైరల్గా మారుతున్నాయి. -
నెట్ఫ్లిక్స్కు నిరసన సెగ.. నెట్టింట్లో బాయ్కాట్ కాల్స్
నెటిఫ్లిక్స్ (Netflix) నిరసన సెగను ఎదుర్కొంటోంది. దానిని బాయ్కాట్ చేయాలంటూ పలువురు పోస్టులు పెడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
పెన్సిల్వేనియాలో ర్యాలీ నిర్వహిస్తానని ప్రకటించిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ -
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ.. అధికారికంగా ప్రకటించిన కమలా హారిస్
డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి కమలాహారిస్ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. -
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..