Imran Khan: నా భార్యకు ఏదైనా జరిగితే.. పాక్ ఆర్మీ చీఫ్కు ఇమ్రాన్ఖాన్ వార్నింగ్
Imran Khan: తన భార్య అవినీతి కేసులో అరెస్టు కావడం, దోషిగా తేలి శిక్ష అనుభవించడానికి పాక్ ఆర్మీ చీఫే కారణమని ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు.
ఇస్లామాబాద్: పాకిస్థాన్ (Pakistan) ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్పై ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) బుధవారం తీవ్ర ఆరోపణలు చేశారు. తన భార్య బుష్రా బీబీ అరెస్టుకు మునీరే కారణమని ఆరోపించారు. ఆమె ప్రస్తుతం ఓ అవినీతి కేసులో శిక్ష అనుభవిస్తున్నారు. ఇస్లామాబాద్ శివారులోని నివాసంలో గృహనిర్బంధంలో ఉన్నారు.
బుష్రా బీబీకి శిక్ష విధించిన న్యాయమూర్తే తనతో మాట్లాడినట్లు ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) తెలిపారు. తీర్పు విషయంలో తనపై ఒత్తిడి ఉండేదని చెప్పినట్లు వెల్లడించారు. ఒకవేళ తన భార్యకు ఏదైనా జరిగితే సహించేది లేదని ఇమ్రాన్ హెచ్చరించారు. తాను బతికున్నంత వరకు మునీర్ను వదిలిపెట్టేది లేదని వార్నింగ్ ఇచ్చారు. మునీర్ తీసుకుంటున్న రాజ్యాంగ విరుద్ధ, అక్రమ నిర్ణయాలను బహిర్గతం చేస్తానని వ్యాఖ్యానించారు.
‘‘దేశంలో ఆటవిక రాజ్యం నడుస్తోంది. ఆ అడవికి రాజే అన్నీ నిర్ణయిస్తాడు. ఆయన కోరుకుంటే నవాజ్ షరీఫ్ నేరాలన్నింటినీ క్షమించేస్తారు. అలాగే మాకు ఐదు రోజుల్లో మూడు కేసుల్లో శిక్ష విధిస్తారు’’ అని పరోక్షంగా మునీర్ను ఉద్దేశించి ఇమ్రాన్ (Imran Khan) ఆరోపించారు. దేశ ఆర్థిక వ్యవస్థ ఐఎంఎఫ్ రుణాల ద్వారా గాడినపడదని అన్నారు. పెట్టుబడుల ద్వారా మాత్రమే ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వం వస్తుందని సూచించారు. దేశంలో చట్టం పటిష్ఠంగా అమలైనప్పుడే పెట్టుబడులు వస్తాయని.. ఆటవిక రాజ్యం అమల్లో ఉన్నంత కాలం అది సాధ్యం కాదన్నారు. ఇమ్రాన్ చేసిన ఈ ఆరోపణలపై ఇప్పటి వరకు పాక్ ఆర్మీ స్పందించలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కత్తితో విచక్షణారహిత దాడి..ఉలిక్కిపడిన లండన్
కత్తితో దూసుకొచ్చిన ఓ దుండగుడు ప్రజలపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. లండన్ (London)లో ఈ ఘటన జరిగింది. -
కరోనా జన్యు గుట్టువిప్పిన శాస్త్రవేత్తకు చైనా వేధింపులు..!
కరోనా వైరస్ (సార్స్కోవ్-2) జన్యు సీక్వెన్స్ను తొలిసారి ప్రచురించిన వైరాలజిస్ట్కు చైనా అధికారుల నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. -
భారత్ సూపర్ పవర్ కావాలని కలలుకంటుంటే.. మనం అడుక్కుంటున్నాం: పాక్ నేత
పాకిస్థాన్లోని అతివాద ఇస్లామిక్ నాయకుడు మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ సోమవారం జాతీయ అసెంబ్లీలో ప్రసంగిస్తూ భారత్ అభివృద్ధి చెందుతున్న తీరును కొనియాడారు. -
గురుపత్వంత్పై హత్యాయత్నం వెనుక ‘రా’!
సిక్కు వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూపై అమెరికాలో జరిగిన హత్యాయత్నంలో భారత్ గూఢచర్య సంస్థ ‘రా’ అధికారి ప్రమేయం ఉందని పేర్కొంటూ వాషింగ్టన్ పోస్ట్ పత్రిక సోమవారం ఒక కథనం ప్రచురించింది. -
కెన్యాలో భారీ వర్షాలు.. డ్యాం కూలి 45 మంది దుర్మరణం
ఆఫ్రికా దేశమైన కెన్యాలో కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. సోమవారం నీటి ఉద్ధృతి ఎక్కువ కావడంతో పశ్చిమ కెన్యాలోని మై మహియు ప్రాంతంలోని పురాతన కిజాబె డ్యాం కూలిపోయింది. -
పారిస్కూ పాకిన విద్యార్థుల ఆందోళనలు
గాజా యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో కొనసాగుతున్న ఆందోళనలు ఫ్రాన్స్ రాజధాని పారిస్నూ కుదిపేస్తున్నాయి. సోమవారం సర్బాన్ యూనివర్సిటీలో విద్యార్ధులు పాలస్తీనా అనుకూల ప్రదర్శనలు నిర్వహించారు. -
ఇజ్రాయెల్కు ఐసీసీ వారెంట్ల గుబులు!
కాల్పుల విరమణ చర్చలు కీలక దశకు చేరుకుంటున్న వేళ.. ఇజ్రాయెల్కు అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ఐసీసీ) గుబులు పట్టుకుంది. 2014 నాటి గాజా యుద్ధం కేసులో తమ సైనిక అధికారులు, నేతలపై ఐసీసీ అరెస్టు వారెంట్లు జారీ చేయొచ్చన్న వార్తలపై ఆందోళన నెలకొన్నట్లు తెలుస్తోంది. -
40 రోజుల కాల్పుల విరమణ!
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ కోసం అమెరికా, ఈజిప్టు, ఖతార్ దేశాలు తెర వెనక జరుపుతున్న ప్రయత్నాలు కీలక దశకు చేరాయి. ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదనను ఈ దేశాలు హమాస్కు పంపాయి!.