Imran Khan: ‘పోలీసులు నా ఇంటిని చుట్టుముట్టారు.. అరెస్టుకు ముందు ఇదే నా చివరి ట్వీట్ కావొచ్చు!’
పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) మరోసారి అరెస్టు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారీ స్థాయిలో పోలీసులు తన ఇంటిని చుట్టుముట్టారన్న ఆయన.. తదుపరి అరెస్టుకు ముందు ఇదే చివరి ట్వీట్ కావొచ్చన్నారు.
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని, తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (PTI) పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) మరోసారి అరెస్టయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. తాజాగా తన ఇంటి చుట్టూ భారీగా పోలీసులు మోహరించారన్న ఆయన.. తన అరెస్టు చేసే అవకాశం ఉందని.. అరెస్టుకు ముందు బహుశా ఇదే తన చివరి ట్వీట్ కావొచ్చేమోనని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ.. ఇటీవల తన అరెస్టు అనంతరం చెలరేగిన హింసపై స్వతంత్ర్య దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. దేశంలో వివిధ ప్రాంతాలతోపాటు సైనిక స్థావరాలపై జరిగిన దాడులకు తనతోపాటు తన పార్టీకి ఎటువంటి సంబంధం లేదన్నారు.
విధ్వంసం దిశగా పాక్..
‘మిలటరీ చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తున్నారు. స్వతంత్ర్య దర్యాప్తు జరపకుండా ఇలా గతంలో ఎన్నడూ జరగలేదు. పీటీఐ పార్టీని ఉగ్రవాద సంస్థగా నిర్ణయించారు. ఇప్పటికే 7500 మంది పార్టీ కార్యకర్తలను అరెస్టు చేశారు. పార్టీకి, ఆర్మీకి మధ్య ఘర్షణ తెచ్చేందుకు అధికారంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది’ అని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ (తూర్పు పాకిస్థాన్) అవతరణను గుర్తుచేసుకున్న ఆయన.. పాకిస్థాన్ విధ్వంసం దిశగా పయనిస్తోందనే భయం ప్రస్తుతం కలుగుతోందన్నారు. ఇలా ఇమ్రాన్ ఖాన్ అరెస్టు తప్పదనే వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఆయన నివాసం జమాన్ పార్కువైపు వచ్చే రోడ్లన్నింటినీ పోలీసులు మూసివేసినట్టు స్థానిక వార్తా ఛానళ్లు వెల్లడించాయి. ఆయన ఇంటిచుట్టూ భారీస్థాయిలో పోలీసులు మోహరించిన వీడియోలు ప్రసారం చేశాయి.
ఇమ్రాన్ ఇంట్లో 40 మంది ఉగ్రవాదులు..
అంతకుముందు ఇదే విషయంపై మాట్లాడిన పంజాబ్ ఆపద్ధర్మ సమాచార మంత్రి ఆమిర్ మీర్ మాట్లాడుతూ.. లాహోర్లోని ఇమ్రాన్ ఖాన్ ఇంటిలో 30 నుంచి 40 మంది ఉగ్రవాదులు దాక్కున్నారన్నారు. దీనిపై తమకు నిఘా సంస్థల నుంచి సమాచారం ఉందన్న ఆయన.. వారందర్నీ 24 గంటల్లో తమకు అప్పగించాలని ఇమ్రాన్ ఖాన్కు అల్టిమేటం జారీచేశారు. అయితే, దీనిపై స్పందించిన ఇమ్రాన్ ఖాన్.. అలాంటి అనుమానమే ఉంటే సెర్చ్ వారెంట్ తీసుకువచ్చి సోదాలు చేసుకోవచ్చని స్పష్టం చేశారు.
ఇదిలాఉంటే, అల్ ఖదీర్ ట్రస్టుకు అక్రమంగా భూములను కేటాయించి రూ.5,000 కోట్లు దోచుకున్నారని ఆరోపిస్తూ దాఖలైన కేసులో ఇమ్రాన్ఖాన్ను అరెస్టు చేసేందుకు గత మార్చిలోనే ప్రయత్నించినప్పటికీ భారీ సంఖ్యలో ఖాన్ మద్దతుదారులు అక్కడికి చేరుకోవడంతో పోలీసులు విఫలమయ్యారు. అయితే, ఓ కేసులో ఇస్లామాబాద్ హైకోర్టు ప్రాంగణంలోకి వచ్చిన ఆయన్ను.. పారామిలిటరీ రేంజర్లు అరెస్టు చేశారు. దీంతో దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. పాక్ సుప్రీంకోర్టు కూడా ఇమ్రాన్ అరెస్టు అక్రమమని.. ఆయన్ను వెంటనే విడుదల చేయాలని ఆదేశించడంతో ఆయన బయటకు వచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ.. అధికారికంగా ప్రకటించిన కమలా హారిస్
డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి కమలాహారిస్ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. -
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం