Imran Khan: ‘పోలీసులు నా ఇంటిని చుట్టుముట్టారు.. అరెస్టుకు ముందు ఇదే నా చివరి ట్వీట్ కావొచ్చు!’
పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) మరోసారి అరెస్టు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారీ స్థాయిలో పోలీసులు తన ఇంటిని చుట్టుముట్టారన్న ఆయన.. తదుపరి అరెస్టుకు ముందు ఇదే చివరి ట్వీట్ కావొచ్చన్నారు.
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని, తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (PTI) పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) మరోసారి అరెస్టయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. తాజాగా తన ఇంటి చుట్టూ భారీగా పోలీసులు మోహరించారన్న ఆయన.. తన అరెస్టు చేసే అవకాశం ఉందని.. అరెస్టుకు ముందు బహుశా ఇదే తన చివరి ట్వీట్ కావొచ్చేమోనని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ.. ఇటీవల తన అరెస్టు అనంతరం చెలరేగిన హింసపై స్వతంత్ర్య దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. దేశంలో వివిధ ప్రాంతాలతోపాటు సైనిక స్థావరాలపై జరిగిన దాడులకు తనతోపాటు తన పార్టీకి ఎటువంటి సంబంధం లేదన్నారు.
విధ్వంసం దిశగా పాక్..
‘మిలటరీ చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తున్నారు. స్వతంత్ర్య దర్యాప్తు జరపకుండా ఇలా గతంలో ఎన్నడూ జరగలేదు. పీటీఐ పార్టీని ఉగ్రవాద సంస్థగా నిర్ణయించారు. ఇప్పటికే 7500 మంది పార్టీ కార్యకర్తలను అరెస్టు చేశారు. పార్టీకి, ఆర్మీకి మధ్య ఘర్షణ తెచ్చేందుకు అధికారంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది’ అని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ (తూర్పు పాకిస్థాన్) అవతరణను గుర్తుచేసుకున్న ఆయన.. పాకిస్థాన్ విధ్వంసం దిశగా పయనిస్తోందనే భయం ప్రస్తుతం కలుగుతోందన్నారు. ఇలా ఇమ్రాన్ ఖాన్ అరెస్టు తప్పదనే వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఆయన నివాసం జమాన్ పార్కువైపు వచ్చే రోడ్లన్నింటినీ పోలీసులు మూసివేసినట్టు స్థానిక వార్తా ఛానళ్లు వెల్లడించాయి. ఆయన ఇంటిచుట్టూ భారీస్థాయిలో పోలీసులు మోహరించిన వీడియోలు ప్రసారం చేశాయి.
ఇమ్రాన్ ఇంట్లో 40 మంది ఉగ్రవాదులు..
అంతకుముందు ఇదే విషయంపై మాట్లాడిన పంజాబ్ ఆపద్ధర్మ సమాచార మంత్రి ఆమిర్ మీర్ మాట్లాడుతూ.. లాహోర్లోని ఇమ్రాన్ ఖాన్ ఇంటిలో 30 నుంచి 40 మంది ఉగ్రవాదులు దాక్కున్నారన్నారు. దీనిపై తమకు నిఘా సంస్థల నుంచి సమాచారం ఉందన్న ఆయన.. వారందర్నీ 24 గంటల్లో తమకు అప్పగించాలని ఇమ్రాన్ ఖాన్కు అల్టిమేటం జారీచేశారు. అయితే, దీనిపై స్పందించిన ఇమ్రాన్ ఖాన్.. అలాంటి అనుమానమే ఉంటే సెర్చ్ వారెంట్ తీసుకువచ్చి సోదాలు చేసుకోవచ్చని స్పష్టం చేశారు.
ఇదిలాఉంటే, అల్ ఖదీర్ ట్రస్టుకు అక్రమంగా భూములను కేటాయించి రూ.5,000 కోట్లు దోచుకున్నారని ఆరోపిస్తూ దాఖలైన కేసులో ఇమ్రాన్ఖాన్ను అరెస్టు చేసేందుకు గత మార్చిలోనే ప్రయత్నించినప్పటికీ భారీ సంఖ్యలో ఖాన్ మద్దతుదారులు అక్కడికి చేరుకోవడంతో పోలీసులు విఫలమయ్యారు. అయితే, ఓ కేసులో ఇస్లామాబాద్ హైకోర్టు ప్రాంగణంలోకి వచ్చిన ఆయన్ను.. పారామిలిటరీ రేంజర్లు అరెస్టు చేశారు. దీంతో దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. పాక్ సుప్రీంకోర్టు కూడా ఇమ్రాన్ అరెస్టు అక్రమమని.. ఆయన్ను వెంటనే విడుదల చేయాలని ఆదేశించడంతో ఆయన బయటకు వచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
Anti-Israel Protests: గాజాలో పోరు సాగిస్తోన్న ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు తెలపడాన్ని పలువురు విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకు నిరసనగా ఆందోళనలు చేపట్టారు. -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?