ఎన్నికల ప్రక్రియపై ఐరాసలో వ్యాఖ్యలు.. దీటుగా బదులిచ్చిన భారత్
మన దేశ ఎన్నికల ప్రక్రియ(Electoral Process )పై ఐరాస మానవహక్కుల విభాగం అధిపతి వ్యక్తం చేసిన ఆందోళనలపై భారత్ గట్టిగా సమాధానం ఇచ్చింది.
దిల్లీ: కొద్దివారాల్లో మనదేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల ప్రక్రియ(Electoral Process)పై ఐరాస మానవహక్కుల విభాగం అధిపతి చేసిన వ్యాఖ్యలపై భారత్ దీటుగా బదులిచ్చింది. అది అసంబద్ధ ఆందోళన అని వ్యాఖ్యానించింది.
జెనీవాలో జరిగిన మానవ హక్కుల మండలి 55వ సమావేశంలో మానవ హక్కుల విభాగం అధిపతి వోకర్ టర్క్ మాట్లాడుతూ.. మైనార్టీలపై వివక్ష, మానవ హక్కుల పరిరక్షకులు, పాత్రికేయులపై పరిమితులు, విమర్శకుల లక్ష్యంగా దాడి ఘటనలు పెరుగుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై జెనీవాలోని ఐరాస కార్యాలయంలో శాశ్వత రాయబారి అరిందమ్ బాగ్చి స్పందించారు. ‘ఈ ఆందోళనలు అసంబద్ధమైనవి. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశ వాస్తవికతను ప్రతిబింబించడం లేదు. ప్రజాస్వామ్యంలో వాదనలు సహజమే. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు మా అనుభవాలనుంచి నేర్చుకోవాలని, అనుకరించాలని కోరుకుంటున్నాయి. భారత ప్రజలు తమ ఆకాంక్షలకు అనుగుణంగా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. గతంలో మాదిరిగానే ఈ ప్రక్రియ జరుగుతుందనడంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు’ అని బాగ్చి వెల్లడించారు.
పాక్కు భారత్ కౌంటర్..
ఇదే వేదికపై జమ్మూకశ్మీర్ అంశాన్ని పాకిస్థాన్ లేవనెత్తగా.. భారత్ గట్టిగా కౌంటర్ ఇచ్చింది. దాని భయానక మానవహక్కుల రికార్డును పాక్ ఆత్మపరిశీలన చేసుకోవాలని మండిపడింది. ‘గ్లోబల్ టెర్రరిస్ట్ ఫ్యాక్టరీ’ అనే పదం ఆ దేశానికి సరిగ్గా సరిపోతుందంటూ దుయ్యబట్టింది. సదరు ప్రతినిధి బృందం తమ దేశంపై చేసే నిరాధార వ్యాఖ్యలకు స్పందించడం ద్వారా మండలి సమయాన్ని వృథా చేయదల్చుకోలేదని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..
Elon Musk: గ్రహాంతర జీవులు ఉన్నారా అనే అంశంపై ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ స్పందించారు. -
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి..
అగ్రరాజ్యం అమెరికాలో పోలీసుల కర్కశత్వానికి ఫ్రాంక్ టైసన్ (53) అనే ఆఫ్రో-అమెరికన్ ప్రాణాలు కోల్పోయాడు. -
జీవ వైవిధ్యానికి గొడ్డలిపెట్టు కానున్న వాతావరణ మార్పులు
ఈ శతాబ్దం మధ్యనాటికి జీవవైవిధ్యంలో క్షీణతకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమవుతాయని తాజా అధ్యయనం పేర్కొంది. -
కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదన
రఫాపై దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతుందన్న వార్తల నేపథ్యంలో కాల్పుల విరమణ చర్చలు ఊపందుకుంటున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ తమకు ఓ ప్రతిపాదన పంపినట్లు హమాస్ తెలిపింది. -
బ్రెజిల్లోని హోటల్లో అగ్నిప్రమాదం
దక్షిణ బ్రెజిల్లోని పాటో అలెగ్రి నగరంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించేందుకు స్థానిక ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న ఓ హోటల్లో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. -
చిత్రవార్త
-
అమెరికా డ్రోన్ను కూల్చిన హూతీలు
ఎర్రసముద్రం మళ్లీ వేడెక్కింది. హూతీ వేర్పాటువాదులు దూకుడు పెంచారు. బాలిస్టిక్ క్షిపణులతో బాబ్ ఎల్ మండేబ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలను భయపెడుతున్నారు. -
అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే ఓ రేడియో ఇంటర్వ్యూలో తెలిపారు. -
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం
అమెరికాలోని సౌత్ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంతో ప్రయాణిస్తున్న ఎస్యూవీ అదుపు తప్పి పల్టీలు కొట్టిన ఈ దుర్ఘటనలో భారత సంతతికి చెందిన ముగ్గురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. -
కంబోడియా సైనిక స్థావరంలో పేలుడు
కంబోడియాలో ఓ సైనిక స్థావరంలో పేలుడు సంభవించి 20 మంది సైనికులు మృతి చెందారు. చాలా మందికి గాయాలయ్యాయి. -
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఒక దశలో ఒంటరితనాన్ని అనుభవించారట. చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
పదేళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు అమలు చేశారు?: బండి సంజయ్కు పొన్నం కౌంటర్
-
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
-
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..
-
భారత్ను వదిలి వెళ్లిన దేవెగౌడ మనవడు..!