Dharma Guardian: భారత్-జపాన్ సేనల ‘ధర్మ గార్డియన్’ విన్యాసాలు షురూ
భారత్ (India), జపాన్ (Japan) మధ్య రక్షణ సహకారం మరింతగా బలోపేతం దిశగా కీలక ముందడుగు పడింది.
జైపుర్: భారత్ (India), జపాన్ (Japan) మధ్య రక్షణ సహకారం మరింతగా బలోపేతం దిశగా కీలక ముందడుగు పడింది. ‘ధర్మ గార్డియన్’ పేరిట ఇరుదేశాల సైనిక బృందాల సంయుక్త విన్యాసాలు ( joint Air Exercise) ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 25న మొదలైన ఈ విన్యాసాలు రాజస్థాన్లోని మహజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో మార్చి 9 వరకు కొనసాగనున్నాయి. ‘ధర్మ గార్డియన్’ అనేది వార్షిక విన్యాస ప్రక్రియ. భారత్, జపాన్లలో ప్రత్యామ్నాయంగా నిర్వహిస్తుంటారు. ఇరుదేశాల నుంచి 40 మంది చొప్పున సిబ్బంది పాల్గొంటారు. జపనీస్ బృందానికి 34వ ఇన్ఫాంట్రీ రెజిమెంట్కు చెందిన సైనికులు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. భారత్ తరఫున రాజ్పుతానా రైఫిల్స్కు చెందిన బెటాలియన్ పాల్గొంది. ఇరుదేశాల మధ్య సైనిక సహకారాన్ని పెంపొందించడం, సెమీ-అర్బన్ వాతావరణంలో ఉమ్మడి కార్యకలాపాలను అమలు చేసేందుకు సంయుక్తంగా సామర్థ్యాలను మెరుగుపరుచుకోవడమే ఈ విన్యాసాల లక్ష్యం. శారీరక దృఢత్వంతో పాటు ఉమ్మడి ప్రణాళిక, వ్యూహాత్మక కసరత్తులు, ప్రత్యేక ఆయుధ నైపుణ్యాలు వంటి ప్రాథమిక అంశాలపై దృష్టిపెట్టనున్నాయి.
ఈ విన్యాసాల సమయంలో సాధన చేయాల్సిన వ్యూహాత్మక కసరత్తుల్లో తాత్కాలిక ఆపరేటింగ్ బేస్ ఏర్పాటు, ఇంటెలిజెన్స్, నిఘా (ISR) గ్రిడ్ ఏర్పాటు చేయడం, మొబైల్ వెహికల్ చెక్ పోస్ట్ ఏర్పాటు, శత్రువుల కదలికల్ని పసిగట్టి వారిని మట్టుబెట్టేందుకు నిరంతరం సోదాలు జరపడం వంటి అనేకం ఉన్నాయి. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా భారత్లో పెరుగుతున్న రక్షణ పారిశ్రామిక సామర్థ్యాన్ని ప్రదర్శించే ఆయుధ సామగ్రిని సైతం ప్రదర్శించనున్నారు. జపాన్ గ్రౌండ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ కమాండింగ్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్ తోగాషి యుచి మార్చి 3న ఈ విన్యాసాలను తిలకించేందుకు రాబోతున్నట్లు కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ‘ధర్మ గార్డియన్’ విన్యాసాలు ఇరు దేశాల సైనిక వ్యూహాలు, సాంకేతికత, వ్యూహాత్మక విధానాల్లో ఉత్తమ అభ్యాసాలను పంచుకొనేందుకు ఇరు పక్షాలకు వీలు కల్పిస్తుందని పేర్కొంది. దీంతో పాటు రెండు స్నేహపూర్వక దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా పెంపొందించడంతో పాటు రక్షణ సహకార స్థాయిని మెరుగు పరుస్తుందని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అతడి హత్యకు పుతిన్ ఆదేశించి ఉండకపోవచ్చు: అమెరికా
రష్యా ఉద్యమకారుడు, ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీని హత్య చేయమని ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఆదేశాలు జారీ చేసి ఉండకపోవచ్చని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ మేరకు ఇటీవల వాల్స్ట్రీట్ పత్రిక ఓ కథనం ప్రచురించింది. -
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పాలస్తీనా జెండా కలకలం
గాజా (Gaza) పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా జో బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా జరుగుతోన్న నిరసనలతో అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాలు దద్దరిల్లుతున్నాయి. -
రంగంలోకి బైడెన్.. గాజాలోకి మరింత సాయానికి ఇజ్రాయెల్ అనుమతి
Israel-Hamas Conflict: గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. దీంతో అక్కడ అనేక మంది ఆకలితో అలమటిస్తున్నారు. వారికి సాయం అందించేలా సరిహద్దుల్లో మరిన్ని దారులు తెరుస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. -
చిత్ర వార్త
గాజాలోని ఖాన్యూనియన్లో తాత్కాలిక శిబిరంలో ఏర్పాటు చేసిన ఓ పాఠశాలలో చదువుకుంటున్న పాలస్తీనా చిన్నారులు -
ఆరేళ్ల పిల్లాడితో పోటీ పడుతున్నా: జో బైడెన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వయసు పెద్ద చర్చనే రేపుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్కు 81 ఏళ్లు. దీంతో ఆయన రేసులో నిలబడటంపై విమర్శలు చెలరేగుతున్నాయి. -
గుండెజబ్బుల ముప్పును పెంచే వాహన ధ్వనులు
వాహనాల రణగొణ ధ్వనులు గుండె జబ్బుల ముప్పును పెంచుతాయని అంతర్జాతీయ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఇందులో గుండెపోటు ముప్పు కూడా ఉందని వెల్లడైంది. -
టిబెట్పై చైనా అణచివేతను ప్రపంచానికి చాటుతా: నామ్కీ
టిబెట్ గుర్తింపును దెబ్బతీసేందుకు చైనా ప్రయత్నిస్తోందని, టిబెట్ వాసులు నానాటికీ పెరుగుతున్న భయం, అణచివేతల నడుమ బతుకుతున్నట్లు నామ్కీ (24) తెలిపారు. -
దుబాయ్లో అతిపెద్ద విమానాశ్రయం!
ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్ దారుణహత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. బాగ్దాద్లోని ఆమె ఇంటి వద్దే గుర్తుతెలియని వ్యక్తి కాల్చిచంపారు. -
దక్షిణ చైనాలో టోర్నడో విధ్వంసం
దక్షిణ చైనాలోని గ్వాంగ్ఝౌ నగరంలో శనివారం ఓ భారీ టోర్నడో విధ్వంసం సృష్టించింది. దీని తాకిడికి అయిదుగురు మరణించగా, 33 మంది గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. -
అమెరికాలో ‘గాజా’ సెగలు.. ఆగని విద్యార్థుల ఆందోళనలు
గాజాపై దాడులకు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో గత పది రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. -
హూతీల దాడికి గురైన నౌకకు భారత్ అండ
ఎర్రసముద్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో మళ్లీ భారత నౌకాదళం తన సత్తా చూపింది. హూతీ వేర్పాటువాదుల క్షిపణి దాడికి గురైన ఎంవీ ఆండ్రోమేడా స్టార్ నౌకకు అండగా నిలిచింది. -
తీవ్రంగా వేడెక్కనున్న హిందూ మహాసముద్రం
హిందూ మహాసముద్రం తీవ్రస్థాయిలో వేడెక్కే అవకాశం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. 2020 నుంచి 2100 మధ్య ఈ మహాసాగర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలు 1.4 డిగ్రీల నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకూ పెరగొచ్చని స్పష్టంచేస్తోంది. -
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ దార్
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇశాక్ దార్ అనూహ్య రీతిలో ఉప ప్రధానిగా నియమితులయ్యారు. ఆదివారం ఈ నిర్ణయం వెలువడింది. -
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో 35 బిలియన్ డాలర్ల (రూ.2.9లక్షల కోట్లు)తో కొత్త టెర్మినల్ నిర్మించనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అతడి హత్యకు పుతిన్ ఆదేశించి ఉండకపోవచ్చు: అమెరికా
-
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పాలస్తీనా జెండా కలకలం
-
జైల్లో కేజ్రీవాల్ను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ..!
-
రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా నకిలీ వీడియో.. దిల్లీలో కేసు నమోదు
-
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
-
వైవిధ్య చిత్రాలు వచ్చేస్తున్నాయ్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!