USA: ‘హైపోథెర్మియా’తోనే అమెరికాలో భారత సంతతి విద్యార్థి మృతి!
USA: అమెరికాలో జనవరి 20న అకుల్ ధావన్ మృతికి గల కారణాన్ని ఇల్లినాయిస్ ఛాంపెయిన్ కౌంటీ కార్నర్స్ ఆఫీస్ ప్రకటించింది.
వాషింగ్టన్: అమెరికాలో భారత సంతతి విద్యార్థి అకుల్ ధావన్ మృతికి గల కారణాన్ని ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయం వెల్లడించింది. ఆల్కహాల్ను అధిక మోతాదులో తీసుకోవడం, గడ్డకట్టే చలిలో ఎక్కవసేపు ఉండడం వల్ల తలెత్తిన హైపోథెర్మియాతోనే (Hypothermia) అతడు మృతి చెందినట్లు ఇల్లినాయిస్ ఛాంపెయిన్ కౌంటీ కార్నర్స్ ఆఫీస్ ప్రాథమికంగా ధ్రువీకరించింది. దీనిపై లోతైన విచారణ జరుపుతున్నట్లు తెలిపింది.
జనవరి 20న అకుల్ తన మిత్రులతో కలిసి క్యాంపస్కు సమీపంలోనే ఉన్న కెనోపి క్లబ్కు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. కానీ, అక్కడి సిబ్బంది అతడి ప్రవేశాన్ని నిరాకరించారని పేర్కొన్నారు. అనేకసార్లు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ.. వారు అనుమతించలేదని చెప్పారు. క్యాబ్లు బుక్ చేసినా.. అక్కడి నుంచి వెళ్లడానికి అకుల్ నిరాకరించినట్లు పేర్కొన్నారు. సాధారణంగా ఇల్లినాయిస్లో జనవరిలో ఉష్ణోగ్రతలు -30 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోతుంటాయి.
సిబ్బంది నిరాకరించటంతో అకుల్ క్లబ్ దగ్గరి నుంచి వెళ్లిపోయాడని పోలీసులు చెప్పారు. తర్వాత మిత్రులు అతణ్ని సంప్రదించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని తెలిపారు. దీంతో వారిలో ఒకరు తమకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. వెంటనే గాలింపు చేపట్టగా.. కొన్ని గంటల వ్యవధిలోనే మృతదేహాన్ని గుర్తించినట్లు చెప్పారు. అతడిలో హైపోథెర్మియా లక్షణాలు కనిపించినట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు