Ebrahim Raisi: అదే డేంజర్ బెల్!
ఒకటి కాదు.. రెండు కాదు.. నాలుగున్నర దశాబ్దాల నాటి హెలికాప్టర్. మరమ్మతులు, నిర్వహణకు సరైన విడిభాగాలు లేవు. ఇదేదో సరకు రవాణాకు ఉపయోగించే లోహవిహంగం కాదు.. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ పయనిస్తున్న హెలికాప్టర్.
పురాతన హెలికాప్టరే రైసీని బలితీసుకుందా?
ఒకటి కాదు.. రెండు కాదు.. నాలుగున్నర దశాబ్దాల నాటి హెలికాప్టర్. మరమ్మతులు, నిర్వహణకు సరైన విడిభాగాలు లేవు. ఇదేదో సరకు రవాణాకు ఉపయోగించే లోహవిహంగం కాదు.. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ పయనిస్తున్న హెలికాప్టర్. ఈ బలహీన ‘పక్షి’కి ప్రతికూల వాతావరణం ఎదురుకావడంతో చిగురుటాకులా వణికిపోయింది. రెక్కలు తెగి కుప్పకూలింది. రైసీ సహా 8 మందిని బలితీసుకుంది.
ఏమిటీ హెలికాప్టర్?
- రైసీ ప్రయాణించిన హెలికాప్టర్ను బెల్-212గా నిపుణులు గుర్తించారు. దీన్ని అమెరికాకు చెందిన బెల్ హెలికాప్టర్ (ప్రస్తుతం బెల్ టెక్స్ట్రాన్) కంపెనీ తయారు చేసింది.
- 1956లో రూపొందించిన బెల్ 205 నమూనా ఆధారంగా బెల్-212 తయారైంది. కెనడా బలగాల కోసం సీయూహెచ్-1ఎన్గా తొలుత దీన్ని అభివృద్ధి చేశారు. ఇందులో రెండు టర్బోషాఫ్ట్ ఇంజిన్లను కంపెనీ ఏర్పాటు చేసింది.
- 1971 మే నాటికి 50 హెలికాప్టర్లను కెనడా సైన్యం తీసుకుంది. యూహెచ్-1ఎన్ పేరుతో వీటిని అమెరికాకూ బెల్ సంస్థ సరఫరా చేసింది. ఈ లోహవిహంగాలను వియత్నాం యుద్ధంలో ఉపయోగించారు.
- ఈ హెలికాప్టర్లో మార్పులు చేసి.. వాణిజ్య అవసరాల కోసం ‘బెల్ 212’ను సంస్థ అభివృద్ధి చేసింది. ఈ బహుళ ప్రయోజన మధ్యశ్రేణి లోహవిహంగాలను ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలు విరివిగా ఉపయోగిస్తున్నాయి. ఇది సిబ్బంది సహా 15 మందిని మోసుకెళ్లగలదు.
భాగాలుగా విడగొట్టి..
ఇరాన్ వాయు రవాణా భద్రత చరిత్ర చాలా పేలవంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. దీనికి అమెరికా ఆంక్షలు కొంతవరకు కారణమని నిపుణులు చెబుతున్నారు. రైసీ ప్రయాణించిన హెలికాప్టర్ను 1979కు ముందు కొనుగోలు చేసినట్లు భావిస్తున్నారు. తర్వాత అమెరికా ఆంక్షల కారణంగా కొత్త విమానాలు, హెలికాప్టర్ల కొనుగోలు, పాత వాటికి విడిభాగాల సేకరణ కష్టమైంది.
- ఇరాన్ విమానయాన, హెలికాప్టర్ సంస్థలు.. తమ వద్ద ఉన్న లోహవిహంగాల్లో కొన్నింటిని భాగాలుగా విడగొట్టి, మిగతావాటికి అమరుస్తున్నాయి. రివర్స్ ఇంజినీరింగ్ పద్ధతిలో కొన్ని భాగాలను ఇరాన్ తయారుచేస్తోంది. వాటి నాణ్యత ప్రశ్నార్థకం.
- ఇరాన్లోని అగ్రశ్రేణి విమానయాన సంస్థలు వాడుతున్న విమానాల సగటు వయసు 20 ఏళ్లు. కొన్ని లోహవిహంగాలైతే 30 ఏళ్ల కిందటివి కావడం గమనార్హం.
గతంలోనూ ప్రమాదాలు..
ఈ హెలికాప్టర్ గతంలోనూ ఘోర ప్రమాదాలకు గురైన సందర్భాలు ఉన్నాయి.
- 1997లో పెట్రోలియం హెలికాప్టర్స్కు చెందిన బెల్-212.. లూసియానా తీరంలో కుప్పకూలి ఎనిమిది మంది దుర్మరణం చెందారు.
- 2009లో కెనడాలోని న్యూఫౌండ్ లాండ్లో జరిగిన ప్రమాదంలో 17 మంది మృతిచెందారు. కెనడా చరిత్రలోనే అతిపెద్ద హెలికాప్టర్ ప్రమాదంగా ఇది నిలిచింది.
ఫలితమిదీ..
విమానాలు, హెలికాప్టర్ల నిర్వహణలో లోపాల కారణంగా 1979 నుంచి ఇరాన్లో జరిగిన విమాన ప్రమాదాల్లో దాదాపు 2వేల మంది ప్రాణాలు కోల్పోయారు.
2000 నుంచి ఇరాన్లో 22 విమాన ప్రమాదాలు జరిగాయి. 2003లో.. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ సిబ్బందితో వెళుతున్న ఐఎల్-76ఎండీ విమానం కెర్మాన్ నగరం వద్ద పర్వతంపై కూలిపోయింది. ఇందులో 275 మంది దుర్మరణం పాలయ్యారు.
విమాన, హెలికాప్టర్ ప్రమాదాల్లో
ఇరాన్ రక్షణ, రవాణా శాఖ మంత్రులు సహా పలువురు కమాండర్లు మరణించిన ఘటనలూ ఉన్నాయి.
రాజుగారి హెలికాప్టర్ !
ఆదివారం కూలిన బెల్ 212 హెలికాప్టర్ ను 1979 నాటి ఇస్లామిక్ విప్లవానికి ముందు ఇరాన్ చివరి రాజు షా మహ్మద్ రెజా పహ్లావీ హయాంలో సమకూర్చుకొని ఉండొచ్చని విశ్లేషిస్తున్నారు. దృశ్య స్పష్టత ఉన్నప్పుడే విహరించేలా దీన్ని రూపొందించారు. అంటే.. తన సీటు నుంచి పరిసరాలను చూడగలిగే సామర్థ్యంపైన ఆధారపడి మాత్రమే పైలట్ ఈ హెలికాప్టర్ ను నడపగలుగుతారన్నమాట. ఆదివారం నాటి ప్రమాద ఘటనా స్థలిలో దట్టమైన పొగమంచు కారణంగా దృశ్య స్పష్టత చాలా తక్కువగా ఉంది.
స్వయాన పైలట్ అయిన రాజు షా మహ్మద్ .. అప్పట్లో వాయుసేన బలోపేతం కోసం పెద్ద సంఖ్యలో విమానాలు, హెలికాప్టర్లను కొనుగోలు చేశారు. వాటిలో అమెరికా నుంచి సమకూర్చుకున్న ఎఫ్-14 ఫైటర్ జెట్లు, ఏహెచ్ -1 సూపర్ కోబ్రా, చినూక్ వంటి హెలికాప్టర్లూ ఉన్నాయి. ఆంక్షల కారణంగా వాటిలో చాలావరకూ మూలనపడ్డాయి.
ఈనాడు, ప్రత్యేక విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
Kamala Harris: జూమ్ కాల్లో కమలాహారిస్ రికార్డు సృష్టించారు. ఆమెకు మద్దతుగా విరాళాల సేకరణ కోసం చేపట్టిన ఈ కాల్లో ఏకంగా 1.64 లక్షల మంది పాల్గొన్నారు. -
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఇథియోపియాలో మట్టిచరియలు విరిగిపడిన ఘటన వందల కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. -
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
Barack And Michelle Obama: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న కమలాహారిస్కు ఒబామా దంపతులు మద్దతు తెలిపారు. -
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సుకు బైడెన్ హాజరవుతారు: శ్వేత సౌధం
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కట్టుబడి ఉన్నారని శ్వేతసౌధం ప్రకటించింది. దేశ విదేశాంగ విధానం, జాతీయ భద్రతను అధ్యక్షుడు ముందుకుతీసుకెళ్లేందుకు యత్నిస్తున్నారని పేర్కొంది. -
జాస్పర్ నగరం సగం భస్మీపటలం..!
కెనడాలో కార్చిచ్చు తాజాగా సగం జాస్పర్ నగరాన్ని కాల్చి బూడిదగా మార్చేశాయి. దీంతో వేల మంది ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోయారు. -
జేడీ వాన్స్ వ్యాఖ్యలు వైరల్.. తీవ్రంగా ఖండించిన ప్రముఖ నటి
రిపబ్లికన్ పార్టీ తరఫున ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఉన్న జేడీ వాన్స్(JD Vance) గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్గా మారాయి. -
మెక్సికన్ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్
ప్రపంచవ్యాప్తంగా హింసాత్మకమైన డ్రగ్ ట్రాఫికింగ్ సంస్థల్లో ఒకటిగా పేరుపొందిన ‘సినాలోవా కార్టెల్’ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్ -
26 మంది హత్య.. మృతదేహాలను నదిలోకి ఈడ్చుకెళ్లిన మొసళ్లు..!
పపువా న్యూగినియాలో దారుణం చోటుచేసుకొంది. 26 మందిని ఓ గ్యాంగ్ దారుణంగా హత్య చేసింది. వారి మృతదేహాలను మొసళ్లు నదిలోకి ఈడ్చుకెళ్లాయి. -
సోషల్ మీడియా వీడియోల పిచ్చి ముదిరి.. రైలును పట్టాలు తప్పించి..!
సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేయడం కోసం ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. అతడి చర్యల కారణంగా ఏకంగా రూ.2 కోట్లకుపైగా నష్టం వాటిల్లింది. -
చర్చకు సిద్ధమేనన్న కమలాహారిస్.. అప్పటివరకు వద్దన్న ట్రంప్
మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump)తో ముఖాముఖి చర్చకు తాను సిద్ధమేనని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహ్యారిస్(Kamala Harris) వెల్లడించారు. -
జోబైడెన్ మెదడు అద్భుతంగా పనిచేస్తోంది: శ్వేతసౌధం డాక్టర్ల సర్టిఫికెట్
జోబైడెన్ మానసిక ఆరోగ్యం అద్భుతంగా ఉందని శ్వేతసౌధం డాక్టర్లు చెబుతున్నారు. -
భారత్కు అండగా ఉందాం.. పాక్కు సాయం నిషేధిద్దాం: అమెరికా కాంగ్రెస్లో బిల్లు
US-India Defense Cooperation Act: భారత్ను అమెరికా మిత్రదేశాలైన జపాన్, ఇజ్రాయెల్, దక్షిణ కొరియా, నాటో కూటమితో సమానంగా చూడాల్సిన అవసరం ఉందంటూ అగ్రరాజ్య కాంగ్రెస్లో కీలక సెనేటర్ బిల్లు ప్రవేశపెట్టారు. -
గాజాలో సంక్షోభంపై మౌనంగా ఉండలేను.. నెతన్యాహుతో కమలా హారిస్
Harris - Netanyahu: హమాస్తో యుద్ధం ముగింపునకు సమయం వచ్చిందని కమలా హారిస్ అన్నారు. ఆ దిశగా ఒప్పందం చేసుకోవాలని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహుకు సూచించారు. -
69 రకాల పురుగుమందులతో రైతులకు.. ధూమపానం స్థాయిలో క్యాన్సర్ ముప్పు!
కొన్ని రకాల పురుగుమందుల వినియోగంతో రైతుల్లో క్యాన్సర్ ముప్పు గణనీయంగా పెరుగుతోందని తాజా అధ్యయనమొకటి తేల్చింది. -
దేశ భవిష్యత్తు కోసం పోరాడతా
‘అమెరికా ప్రజలుగా ఇప్పుడు మన ముందు రెండు అవకాశాలున్నాయని నేను భావిస్తున్నా. ఒకటి దేశాన్ని ముందుకు తీసుకెళ్లే మన విధానం.. రెండోది గతాన్ని తవ్వే ప్రత్యర్థుల అరాచకం.. ఈ రెండింటిలో మనం ఏదో ఒకటి ఎంచుకోవాల్సిన సమయం వచ్చింది. -
అధికారానికి కమలా హారిస్ అనర్హురాలు
అమెరికాను పాలించేందుకు ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్కు అర్హత లేదని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. -
మోదీ రష్యా పర్యటననిరాశ కలిగించింది
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల రష్యాలో పర్యటించడం తమను తీవ్రంగా నిరాశపరిచిందని అమెరికా తెలిపింది. -
సంక్షిప్త వార్తలు (5)
వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ)ను, సరిహద్దుకు సంబంధించి గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను పూర్తిస్థాయిలో గౌరవించాల్సిందేనని చైనాకు భారత్ మరోసారి నొక్కిచెప్పింది. -
బైడెన్, హారిస్తో నెతన్యాహు భేటీ
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్తో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గురువారం వాషింగ్టన్లో భేటీ అయ్యారు. -
కాలిఫోర్నియాలో విస్తరిస్తున్న కార్చిచ్చు
అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో విస్తరిస్తున్న కార్చిచ్చు వల్ల పలు ప్రాంతాల్లోని ప్రజలు తమ ఆవాసాలను ఖాళీ చేయాల్సి వస్తోంది. -
ప్రచారం కోసం డబ్బు వెదజల్లుతున్న రిపబ్లికన్లు
ట్రంప్ ప్రచారం కోసం డబ్బును రిపబ్లికన్లు వెదజల్లుతున్నారు. గత సోమవారం నుంచి ఆగస్టు దాకా టీవీ, రేడియోల్లో ప్రచారం కోసం ఆ పార్టీవారు 68 మిలియన్ డాలర్లను ఖర్చు చేయనున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారు: ఉత్తమ్
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన