Ebrahim Raisi: ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణం
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63) హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆదివారం తూర్పు అజర్ బైజాన్ ప్రావిన్సులోని దట్టమైన అటవీ ప్రాంతంలో కుప్పకూలిన సంగతి తెలిసిందే. తక్షణం రంగంలోకి దిగిన ‘ఇరాన్ రెడ్ క్రిసెంట్ సొసైటీ’ ఘటన జరిగిన ప్రాంతాన్ని సోమవారం ఉదయం గుర్తించింది.
విదేశాంగమంత్రి సహా మరో ఆరుగురూ..
అటవీ ప్రాంతంలో కూలిన హెలికాప్టర్
మోదీ, పలు దేశాల నేతల దిగ్భ్రాంతి
తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్బర్
టెహ్రాన్: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63) హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆదివారం తూర్పు అజర్ బైజాన్ ప్రావిన్సులోని దట్టమైన అటవీ ప్రాంతంలో కుప్పకూలిన సంగతి తెలిసిందే. తక్షణం రంగంలోకి దిగిన ‘ఇరాన్ రెడ్ క్రిసెంట్ సొసైటీ’ ఘటన జరిగిన ప్రాంతాన్ని సోమవారం ఉదయం గుర్తించింది. ఈ దుర్ఘటనలో రైసీ ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక వార్తాసంస్థ ‘ఐఆర్ఎన్ఏ’ ధ్రువీకరించింది. ఆయనతో పాటు విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీర్ అబ్దొల్లాహియన్(60), తూర్పు అజర్బైజాన్ ప్రావిన్సు గవర్నర్ మలేక్ రహ్మతీ, మరో ఐదుగురు అధికారులు మృతి చెందినట్లు ప్రకటించింది. రైసీ అంత్యక్రియలు మంగళవారం జరగనున్నాయి. ఇరాన్ ప్రభుత్వం ఐదు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. ఇజ్రాయెల్-హమాస్ పోరుతో పశ్చిమాసియా సంక్షోభంలో చిక్కుకున్న వేళ ఈ మరణాలు ఇరాన్కు ఎదురుదెబ్బగానే భావించొచ్చు. పాలస్తీనియన్లకు మద్దతుగా ఇజ్రాయెల్పై ఇరాన్ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ అంశంలో ఇరాన్ సుప్రీం అధినేత అయతుల్లా అలీ ఖమేనీకి.. ఇటు ఇబ్రహీం రైసీ.. అటు హొస్సేన్ అమీర్ అబ్దొల్లాహియన్ రెండు కళ్లల్లా వ్యవహరిస్తున్నారు. వీరి మరణం.. దేశీయంగానూ, అంతర్జాతీయంగానూ ఇరాన్పై ప్రభావం చూపే అవకాశం ఉంది.
రైసీ సన్నిహితుడికే పగ్గాలు
రైసీ స్థానంలో తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్బర్ (68)ను అయతుల్లా అలీ ఖమేనీ నియమించారు. మొఖ్బర్.. ప్రస్తుతం దేశ తొలి ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఇరాన్ రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు అకస్మాత్తుగా మరణిస్తే సుప్రీం అధినేత ఆమోదంతో తొలి ఉపాధ్యక్షుడు ఆ పదవిని చేపడతారు. అనంతరం 50 రోజుల్లోపు కొత్త అధ్యక్షుడి కోసం ఎన్నికలు జరుగుతాయి. రైసీకి అత్యంత సన్నిహితుడిగా మొఖ్బర్కు పేరుంది. ఇరాన్ ఉప విదేశాంగమంత్రిగా ఉన్న అలీ బఘేరీ ఇక నుంచి పూర్తిస్థాయిలో విదేశాంగ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తారు.
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిన వర్జాఘన్ ప్రాంతంలో సైనికుల సహాయ చర్యలు
మోదీ.. ఇతర దేశాల అధినేతల విచారం
రైసీ మృతిపై చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్ సహా పలుదేశాల అధినేతలు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. భారత ప్రధాని నరేంద్రమోదీ ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘‘ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణవార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. భారత్-ఇరాన్ సంబంధాల బలోపేతానికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆయన కుటుంబ సభ్యులకు, ఇరాన్ ప్రజలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని ప్రధాని ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ఈ విషాద సమయంలో ఇరాన్ ప్రజలకు వెన్నంటి ఉంటామని విదేశీవ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ పేర్కొన్నారు. భారత్ మంగళవారం సంతాపదినంగా ప్రకటించింది.
గుర్తించిన తుర్కియే డ్రోన్
ప్రమాదం ఆదివారమే జరిగినా ప్రతికూల వాతావరణం, పొగమంచు, దట్టమైన అడవుల కారణంగా ఘటనా స్థలాన్ని ఇరాన్ గుర్తించలేకపోయింది. దీంతో ఇరాన్.. తుర్కియే సాయం కోరింది. తక్షణమే స్పందించిన అంకారా.. అకిన్సి డ్రోన్ను పంపింది. ఇది రంగంలోకి దిగి కొద్ది గంటల్లోనే కుప్పకూలిన హెలికాప్టర్ నుంచి వెలువడుతున్న మంటల ఉష్ణం ఆధారంగా ఆచూకీని కనుగొంది. దాని నుంచి సమాచారం అందుకొన్న తక్షణమే ఇరాన్ దళాలు ఆ ప్రాంతానికి చేరుకొని అధ్యక్షుడు రైసీ మరణించినట్లు గుర్తించాయి.
ఇరాన్ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీర్ అబ్దొల్లాహియన్
ఇజ్రాయెల్ ప్రమేయం ఉందా?
ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం వేళ హెలికాప్టర్ ప్రమాదంలో రైసీ మరణించడం పలు అనుమానాలకు తావిస్తోంది. సిరియాలో ఇరాన్కు చెందిన జనరల్ను ఇటీవల ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసి మట్టుపెట్టడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఇందుకు దీటుగా స్పందిస్తామని హెచ్చరించిన ఇరాన్.. వందలాది డ్రోన్లతో ఇజ్రాయెల్పై విరుచుకుపడింది. వాటిని టెల్ అవీవ్ నిలువరించినప్పటికీ.. ఈ పరిణామాలతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపథ్యంలో రైసీ దుర్మరణం వెనక చిరకాల శత్రువుగా ఉన్న ఇజ్రాయెల్ పాత్రను తోసిపుచ్చలేమనే కథనాలు వెలువడుతున్నాయి. అయితే రైసీ హెలికాప్టర్ ప్రమాదం ప్రతికూల వాతావరణం కారణంగానే జరిగిందని ఇరాన్ బలంగా నమ్ముతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
జపాన్లోని పలు ప్రాంతాల్లో ప్రజలు ఆచరించే ఓ సంప్రదాయం గురించిన విషయాలు ప్రస్తుతం వైరల్గా మారుతున్నాయి. -
నెట్ఫ్లిక్స్కు నిరసన సెగ.. నెట్టింట్లో బాయ్కాట్ కాల్స్
నెటిఫ్లిక్స్ (Netflix) నిరసన సెగను ఎదుర్కొంటోంది. దానిని బాయ్కాట్ చేయాలంటూ పలువురు పోస్టులు పెడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
పెన్సిల్వేనియాలో ర్యాలీ నిర్వహిస్తానని ప్రకటించిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ -
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ.. అధికారికంగా ప్రకటించిన కమలా హారిస్
డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి కమలాహారిస్ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. -
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి