Israel Hamas Conflict: పశ్చిమాసియాలో పరిస్థితులపై మోదీ ఆరా.. ఈజిప్టు అధ్యక్షుడితో చర్చలు
Israel Hamas Conflict: ఇజ్రాయెల్ హమాస్ ఉద్రిక్తతలపై ఉన్న ఆందోళనలను ఈజిప్టు అధ్యక్షుడితో ప్రధానమంత్రి మోదీ పంచుకున్నారు. వీలైనంత త్వరగా శాంతియుత వాతావరణాన్ని పునరుద్ధరించాలని ఇరువురు నేతలు పిలుపునిచ్చారు.
Israel Hamas Conflict | దిల్లీ: పశ్చిమాసియాలో రోజురోజుకీ దిగజారుతున్న పరిస్థితులు, మానవతా సంక్షోభంపై ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్-సిసితో ఫోన్లో చర్చించినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Modi) తెలిపారు. ఈ ప్రాంతంలో పెరుగుతున్న ఉగ్రవాదం, హింస, సామాన్య పౌరుల మరణాలపై ఇరువురు నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం (Israel Hamas Conflict) నేపథ్యంలోనే వారు ఈ మేరకు శుక్రవారం చర్చలు జరిపారు.
పశ్చిమాసియాలో వెంటనే శాంతియుత వాతావరణాన్ని పునరుద్ధరించి స్థిరత్వాన్ని సాధించాల్సిన అవసరం ఉందని మోదీ (Modi), ఎల్-సిసి పిలుపునిచ్చారు. తాజా ఉద్రిక్తతల (Israel Hamas Conflict) వల్ల ప్రభావితమైన బాధితులకు మానవతా సాయం అందించాల్సిన అవసరం ఉందన్నారు. గాజాలో ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాలపైనా ఇరువురు నేతలు చర్చించినట్లు ఈజిప్టు అధ్యక్ష కార్యాలయ అధికార ప్రతినిధి తెలిపారు. పరిస్థితులు మరింత దిగజారితే వచ్చే ముప్పుపైనా చర్చ జరిగినట్లు పేర్కొన్నారు. సామాన్య పౌరుల జీవితాలు, ప్రాంతీయ భద్రతపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండనుందో చర్చించినట్లు తెలిపారు.
అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ ఆకస్మికంగా దాడి (Israel Hamas Conflict) చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 1,400 మంది మరణించారు. వీరిలో సామాన్యులే అధికమని ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు ప్రతీకారంగా ఇజ్రాయెల్ సైన్యం సైతం హమాస్ నియంత్రణలో ఉన్న గాజాపై దాడి చేస్తోంది. ఇటీవలి వరకు వైమానిక దాడులు చేసిన ఇజ్రాయెల్.. తాజాగా భూతల దాడులనూ ప్రారంభించింది. దీంతో నగర వీధుల్లో ఇరు పక్షాలు ప్రత్యక్షంగా పోరాటం చేస్తున్నాయి. అయితే, ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల్లో తమ పౌరులు వేలాది మంది మరణించినట్లు హమాస్ చెబుతోంది.
మరోవైపు గాజాకు మానవతా సాయంపై ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టిన తీర్మానంపై జరిగిన ఓటింగ్కు భారత్ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. తీర్మానంలో హమాస్ దాడిని ఖండిస్తూ ఎలాంటి ప్రస్తావన లేదని.. అందుకే ఓటింగ్కు గైర్హాజరయ్యామని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గాజాలో మరణాలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయని పేర్కొన్నాయి. ప్రత్యేకించి పిల్లలు, మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారని విచారం వ్యక్తం చేశాయి. మానవతా సంక్షోభాన్ని తప్పనిసరిగా పరిష్కరించాలని పిలుపునిచ్చాయి. మానవతా సాయం కోసం, ఘర్షణలను తగ్గించేందుకు అంతర్జాతీయ సమాజం చేస్తున్న కృషిని స్వాగతిస్తున్నామని స్పష్టం చేశాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికాలో చైనా ‘సైన్యం’.. ట్రంప్ ప్రచారంపై రచ్చ!
చైనా నుంచి అమెరికాకు వలసలు భారీగా పెరిగాయని.. వాటివల్ల భవిష్యత్తులో ముప్పు పొంచివుందని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆందోళన వ్యక్తంచేశారు. -
చైనాకు చెక్ పెట్టేందుకు ‘గ్రేట్షార్క్’, ‘మాంట రే’ సిద్ధం..!
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా సముద్ర ఆదిపత్యానికి చెక్ పెట్టేందుకు అమెరికా, ఆస్ట్రేలియా వేగంగా అడుగులు వేస్తున్నాయి. దీనిలోభాగంగా రెండు ఆయుధాలను అభివృద్ధి చేస్తున్నాయి. -
వైట్హౌస్లో ‘సారే జహాసె అచ్ఛా..’ ‘పానీపూరీ’ల విందు
వైట్ హౌస్లో ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమానికి హాజరైన అతిథులకు పానీపూరీ వడ్డించారు. భారత్కు చెందిన ‘సారే జహాసె అచ్ఛా’ గీతాన్ని ఆలపించడం విశేషం. -
పాక్ ప్రభుత్వ కంపెనీలన్నీంటిని ప్రైవేటీకరిస్తాం: ప్రధాని షెహబాజ్
పాకిస్థాన్లో ఆర్థిక సంస్కరణలకు సర్కారు తెరతీసింది. ప్రభుత్వ రంగంలోని కంపెనీలను మొత్తం ప్రైవేటీకరిస్తామని ప్రకటించింది. -
సైన్యంపై ఎదురు తిరిగిన పౌరులు..పాక్ ఆక్రమిత కశ్మీర్లో అసలేం జరుగుతోంది..?
ద్రవ్యోల్బణం, ఇస్లామాబాద్ దోపిడీపై పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఆగ్రహ జ్వాలలు ఎగసి పడుతున్నాయి. ప్రజలు పోలీసులపై దాడి చేసి చితకబాదుతున్నారు. -
అవసరమైతే బైడెన్ను చంపాలనుకున్నా.. వైట్హౌస్పై దాడి కేసులో నేరాన్ని అంగీకరించిన సాయి వర్షిత్
వైట్ హౌస్ (White House) పరిసరాల్లోకి ట్రక్కుతో దూసుకొచ్చి దాడి చేసిన కేసులో తెలుగు సంతతి కుర్రాడు సాయివర్షిత్ కందుల నేరాన్ని అంగీకరించాడు. తన లక్ష్యం కోసం అవసరమైతే బైడెన్ను చంపాలనుకున్నానని విచారణలో చెప్పాడు. -
ఐరోపా మోస్ట్వాంటెడ్ ‘ది స్కార్పియన్’ అరెస్టు..!
అక్రమ వలసలతో ఐరోపాకు కంటిమీద కునుకు లేకుండా చేసిన ఓ స్మగ్లర్ను యూకే పోలీసులు అరెస్టు చేశారు. కొన్ని వేల మందిని ఇతడి గ్యాంగ్ ఐరోపా, యూకేలోకి తరలించినట్లు ఆరోపణలున్నాయి. -
ఇరాన్తో డీల్.. భారత్కు అమెరికా వార్నింగ్..!
India-US: ఇరాన్తో వ్యాపార లావాదేవీలు జరిపే ఏ దేశానికైనా ఆంక్షల ముప్పు తప్పదని అమెరికా హెచ్చరించింది. చాబహార్ పోర్ట్పై భారత్, టెహ్రాన్ మధ్య ఒప్పందం కుదిరిన వేళ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
ఐరాస వాహనంపై దాడి.. గాజాలో భారతీయుడి మృతి
Indian killed in Gaza: గాజాలో సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఓ భారతీయుడు మృతిచెందాడు. ఐరాసలోని భద్రత, రక్షణ విభాగంలో ఆయన పనిచేస్తున్నారు. -
మాల్దీవులకు భారత్ మళ్లీ సాయం
మాల్దీవులకు మళ్లీ భారత్ సాయం చేసింది. రూ.417.45 కోట్ల రుణాన్ని తీర్చేందుకు మరో ఏడాది పొడిగింపు ఇచ్చింది. -
వనమూలికతో చికిత్స చేసుకున్న ఒరాంగుటాన్
ఒక వన్యప్రాణి తన శరీరంపైనున్న గాయాలకు ఔషధ మొక్కలతో చికిత్స చేసుకోవడాన్ని శాస్త్రవేత్తలు తొలిసారిగా గుర్తించారు. -
ఉత్తర కొరియాలో ఎరుపురంగు లిప్స్టిక్పై నిషేధం
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ పేరు చెప్పగానే కఠిన చట్టాలు గుర్తుకువస్తాయి. చాలా విచిత్రమైన నిబంధనలతో అక్కడి ప్రజల వ్యక్తిగత అభిరుచులను సైతం ఆయన శాసిస్తుంటారు. -
గేట్స్ ఫౌండేషన్ నుంచి వైదొలగిన మెలిందా
ప్రపంచ ప్రసిద్ధి చెందిన ‘బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్’ కో-ఛైర్ పదవికి మెలిందా ఫ్రెంచ్ గేట్స్ రాజీనామా చేశారు. -
పీవోకేకు రూ.2,300 కోట్లు విడుదలకు షెహబాజ్ హమీ
పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజల ఆందోళనలకు పాకిస్థాన్ భయపడింది. గత కొన్ని రోజులుగా అధిక ధరలకు, పెరిగిన విద్యుత్తు బిల్లులకు వ్యతిరేకంగా పీవోకేలోని ముజఫరాబాద్, మీర్పూర్ ప్రాంతాల్లో వ్యాపారులు, సాధారణ ప్రజలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. -
వాళ్లో.. మేమో.. తేల్చుకుంటాం.. వెనక్కి తగ్గేదే లేదు
హమాస్ మిలిటెంట్లను రాక్షసులుగా అభివర్ణించారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. సోమవారం ఆయన హమాస్ దాడిలో అక్టోబరు 7న మృతి చెందిన ఇజ్రాయెలీల స్మారకార్థం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. -
రష్యాలో భవనం కూలిన ఘటనలో 13కు పెరిగిన మృతుల సంఖ్య
రష్యాలోని సరిహద్దు నగరం బెల్గొరోడ్లో పదంతస్తుల ఓ నివాస భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 13కు పెరిగింది. -
నేపాల్ అధ్యక్షుడి సలహాదారు రాజీనామా
నేపాల్ అధ్యక్షుడు రామ్చంద్ర పౌడెల్ ఆర్థిక సలహాదారు చిరంజీవి నేపాల్ తన పదవికి రాజీనామా చేశారు. దానికి అధ్యక్షుడు ఆదివారం ఆమోదం తెలిపారు. -
ప్రపంచంలో అతడొక్కడే.. హిరోషిమా, నాగసాకి అణుదాడులకు గురై జీవించిన వ్యక్తి..!
ఒక్క అణు బాంబు పేలుడు చూసే బతకడం కష్టం.. అలాంటిది జపాన్కు చెందిన ఓ వ్యక్తి మానవ చరిత్రలో చోటు చేసుకొన్న రెండు అణుబాంబుల పేలుళ్లను స్వయంగా చూసి మృత్యువు నుంచి త్రుటిలో బయటపడ్డాడు. -
కిమ్ రాజ్యంలో రెడ్ లిప్స్టిక్పై నిషేధం.. ఎందుకంటే?
North Korea Bans Red Lipstick: ఉత్తర కొరియాలో రెడ్ లిప్స్టిక్పై నిషేధం విధించారు. ఎందుకు? ఉల్లంఘిస్తే ఎలాంటి శిక్షలు విధిస్తారో చూద్దాం..!
తాజా వార్తలు (Latest News)
-
బికినీలో అనన్య పాండే.. కాబోయే భర్తతో వరలక్ష్మి ఫొటో
-
అమెరికాలో చైనా ‘సైన్యం’.. ట్రంప్ ప్రచారంపై రచ్చ!
-
ఆ వీడియోల లీక్ వెనక ‘భారీ తిమింగలం’ - కుమారస్వామి ఆరోపణ
-
టీ20 ప్రపంచకప్ 2024.. బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ జట్లు ఇవే...
-
హోర్డింగ్ కుప్పకూలిన ఘటన.. వెలుగులోకి పలు కీలక విషయాలు
-
వెజ్ థాలీ ధర పెరిగింది.. నాన్ వెజ్ తగ్గింది.. ఎందుకిలా?