Benjamin Netanyahu: అప్పుడు మీరంతా ఎందుకు మౌనంగా ఉన్నారు?.. మానవ హక్కుల సంస్థలపై నెతన్యాహు ఆగ్రహం
గాజాలో ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేయడాన్ని ఖండిస్తున్న మానవ, మహిళా హక్కుల సంస్థలపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు తీవ్రంగా మండిపడ్డారు. ఇజ్రాయెల్ మహిళలపై దాడులు జరిగినప్పుడు మీరంతా ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.
టెల్ అవీవ్: హమాస్ ఉగ్రదాడికి ప్రతిగా గాజాలో ఇజ్రాయెల్ (Israel) చేస్తున్న దాడులను ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవ, మహిళా హక్కుల సంస్థలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా సంస్థలపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు (Benjamin Netanyahu) తీవ్రంగా మండిపడ్డారు. ఇజ్రాయెల్ మహిళలపై హమాస్ ఉగ్రవాదులు ఆత్యాచారాలకు పాల్పడినప్పుడు మీరంతా ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. తమ దేశంలో జరిగిన అమానవీయ ఘటనల గురించి ఐక్యరాజ్య సమితి (UN) ఎందుకు మౌనంగా ఉండిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఇజ్రాయెల్ ప్రధాని అధికారిక ఎక్స్ ఖాతాలో వీడియోను విడుదల చేశారు.
‘‘మహిళా హక్కుల సంస్థలు, మానవ హక్కుల సంస్థలకు నేను ఒక్కటే చెప్పదల్చుకున్నాను. ఇజ్రాయెల్ మహిళలు ఆత్యాచారానికి గురైనప్పుడు, వారిపై భౌతిక దాడులు జరిగినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? వాటి గురించి ఎందుకు మాట్లాడలేదు? ప్రపంచ దేశాల నాయకులు, ప్రభుత్వాలు ఈ దారుణాలకు వ్యతిరేకంగా మాట్లాడాలి. శారీరక వేధింపులతో ఇజ్రాయెల్ మహిళలు చేసిన ఆక్రందనలు, తల్లిదండ్రులను కోల్పోయి భయంతో బతుకున్న చిన్నారుల గురించి ఏ హక్కుల సంస్థలూ మాట్లాడలేదు. కానీ, గాజాపై ఇజ్రాయెల్ దారుణాలకు పాల్పడుతోందని, యుద్ధాన్ని త్వరగా ముగించాలని సూచిస్తున్నారు. మీరంతా యుద్ధం తర్వగా ముగియాలని కోరుకుంటే.. ఇజ్రాయెల్ పక్షాన నిలవండి. హమాస్ను అణచివేయడమే యుద్ధాన్ని ముగించేందుకు ఉన్న ఏకైక మార్గం’’ అని నెతన్యాహు తెలిపారు.
‘దేశాన్ని ఏడిపిస్తూ.. తాను ఏడుస్తూ’: కన్నీళ్లు పెట్టుకున్న కిమ్.. వీడియో వైరల్
మరోవైపు ఇజ్రాయెల్, హమాస్ మధ్య దీర్ఘకాల కాల్పుల విరమణపై అమెరికా, ఖతార్, ఈజిప్టు చర్చలు జరుపుతున్నాయి. అయితే.. మరోసారి తాత్కాలిక కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరే అవకాశముందని తెలుస్తోంది. శాశ్వత కాల్పుల విరమణకు అంగీకరిస్తేనే మిగిలిన బందీలను విడుదల చేస్తామని హమాస్ నిబంధన పెట్టింది. దీనిపైన చర్చలు సాగుతున్నాయి. అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ ఉగ్రవాదులు దాడి చేసి, సుమారు 240 మందిని గాజాకు బందీలుగా తీసుకెళ్లారు. ఇటీవల తాత్కాలిక కాల్పుల విరమణ సమయంలో కొంతమందిని విడిచిపెట్టారు. హమాస్ ఉగ్రవాదుల వద్ద ఇంకా 137 మంది బందీలుగా ఉన్నట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
Miss Universe Buenos Aires: 60 ఏళ్ల వయసులో అందాల తారగా కిరీటం దక్కించుకుందో మహిళ. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది మిస్ యూనివర్స్ పోటీల్లోనూ పాల్గొననుంది. -
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
అమెరికా(USA)లో ఓ నల్లజాతీయుడిపై పోలీసులు వ్యహరించిన తీరుతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. దాంతో తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. -
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
-
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం