Israel Strikes: సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
సిరియాలోని అతిపెద్ద నగరం అలెప్పోపై ఇజ్రాయెల్ చేపట్టిన గగనతల దాడుల్లో దాదాపు 42 మంది మృతి చెందారు.
ఇంటర్నెట్ డెస్క్: హమాస్తో యుద్ధం కొనసాగుతోన్న వేళ సిరియా (Syria)పై ఇజ్రాయెల్ (Israel) విరుచుకుపడింది. అక్కడి అతిపెద్ద నగరమైన అలెప్పోపై చేపట్టిన వైమానిక దాడుల్లో దాదాపు 42 మంది మృతి చెందారు. వీరిలో 36 మంది సిరియా సైనికులేనని ఓ యుద్ధ పర్యవేక్షణ సంస్థ వెల్లడించింది. ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం (Israel Hamas War) మొదలు ఆ దేశ సైన్యానికి ఈ స్థాయి ప్రాణనష్టం వాటిల్లడం ఇదే మొదటిసారి.
అలెప్పో విమానాశ్రయం సమీపంలోని హెజ్బొల్లాకు చెందిన రాకెట్ కేంద్రాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని బ్రిటన్ ఆధారిత ‘సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్’ తెలిపింది. ఇరాన్ అనుకూల గ్రూపులకు చెందిన రక్షణ కర్మాగారాలను కూడా టార్గెట్ చేసుకున్నట్లు వెల్లడించింది. ఈ ఘటనను సిరియా సైన్యం కూడా ధ్రువీకరించింది. ఇజ్రాయెల్తోపాటు స్థానిక తిరుగుబాటు దళాలు ఏకకాలంలో దాడులు చేశాయని పేర్కొంది. ఈ క్రమంలోనే సైనికులతోపాటు సాధారణ పౌరులూ మృతి చెందినట్లు ఆరోపించింది.
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
తాజా దాడులపై ఇజ్రాయెల్ నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. అంతకు కొన్ని గంటల ముందే సిరియా రాజధాని డమస్కస్ శివార్లలోనూ ఓ నివాస భవనం లక్ష్యంగా చేపట్టిన దాడిలో ఇద్దరు పౌరులు మృతి చెందారని స్థానిక మీడియా తెలిపింది. హెజ్బొల్లా సహా ఇరాన్ మద్దతుగల సాయుధ బృందాలకు కీలక స్థావరమైన సయిదా జైనాబ్ ప్రాంతంలో ఇది చోటుచేసుకున్నట్లు అబ్జర్వేటరీ వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కారు పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి
అమెరికా(USA)లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ మహిళలు ప్రాణాలు కోల్పోయారు. -
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
Miss Universe Buenos Aires: 60 ఏళ్ల వయసులో అందాల తారగా కిరీటం దక్కించుకుందో మహిళ. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది మిస్ యూనివర్స్ పోటీల్లోనూ పాల్గొననుంది. -
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
అమెరికా(USA)లో ఓ నల్లజాతీయుడిపై పోలీసులు వ్యహరించిన తీరుతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. దాంతో తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. -
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.
తాజా వార్తలు (Latest News)
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!