Israel: యూఎన్ ఏజెన్సీ హెడ్క్వార్టర్స్ కింద భారీ సొరంగాన్ని గుర్తించిన ఇజ్రాయెల్ ఆర్మీ
గాజాలోని యూఎన్ ఏజెన్సీ హెడ్క్వార్టర్స్ భవనం కింద భారీ సొరంగం గుర్తించినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది.
గాజా: గాజా (Gaza)లో పాలస్తీనా శరణార్థుల కోసం ఏర్పాటు చేసిన ఐక్యరాజ్యసమితి (United Nations) ఏజెన్సీ ‘యూఎన్ఆర్డబ్ల్యూఏ’ హెడ్క్వార్టర్స్ భవనాల కింద ఉన్న భారీ సొరంగాన్ని ఇజ్రాయెల్ మిలిటరీ (IDF) గుర్తించింది. దీనికి సంబంధించి ఎక్స్ (ట్విటర్) వేదికగా వీడియోను పోస్టు చేసింది. తమ కార్యకలాపాల కోసం హమాస్ (Hamas) ఈ సొరంగం నిర్మించి దీనికి విద్యుత్ సదుపాయం ఏర్పాట్లు చేసుకున్నట్లు ఐడీఎఫ్ తెలిపింది. దీంతో అక్టోబర్ 7న హమాస్ మారణకాండకు సంబంధించి సదరు ఏజెన్సీకి చెందిన ఉద్యోగుల పాత్రపై ఇజ్రాయెల్ చేస్తున్న ఆరోపణలకు ఈ ఘటన మరింత బలం చేకూర్చినట్లైంది.
అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ సాగించిన మారణకాండలో ‘యూఎన్ఆర్డబ్ల్యూఏ’ ఉద్యోగుల పాత్ర ఉన్నట్లు ఇజ్రాయెల్ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ ఏజెన్సీ కమిషనర్ జనరల్ ఫిలిప్ లజారి దాడికి సంబంధించి పాత్ర ఉన్నట్లు అనుమానిస్తున్న 12 మంది సిబ్బందిని తొలగించారు. వారిపై విచారణ చేపడతామని ప్రకటించారు. దీంతో ఇజ్రాయెల్ ఏజెన్సీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసింది. సరుకుల సరఫరాను అడ్డుకోవడంతోపాటు దాని పన్ను ప్రయోజనాలను రద్దు చేసింది. ఈ ఆరోపణల నేపథ్యంలో ఏజెన్సీకి నిధుల మంజూరును నిలిపివేస్తున్నట్లు అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా ప్రకటించాయి. దీంతో ఈ సంస్థ తీవ్ర ఆర్థిక కష్టాల్లోకి జారుకుంది.
సొరంగంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ..
మొత్తం 700 మీటర్ల పొడవు గల ఈ టన్నెల్ను 18 మీటర్ల లోతులో నిర్మించారు. విద్యుత్ సరఫరా కావడానికి ఏర్పాట్లు చేశారు. సొరంగంలో బ్యాటరీలు, విద్యుత్ పరికరాలు, ఆయుధాలు, సామగ్రి, గ్రనేడ్లు, ఏజెన్సీ సర్వర్ రూమ్తో అనుసంధానం అయిన హమాస్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ గుర్తించినట్లు ఐడీఎఫ్ పేర్కొంది. తాజాగా ఘటనపై యూఎన్ఆర్డబ్ల్యూఏ స్పందించింది. తమ కార్యాలయం కింద సొరంగం ఉందని, విద్యుత్ సరఫరా సాగినట్లు తమకు తెలియదని పేర్కొంది. దీనికి సంబంధించి స్వతంత్ర విచారణ చేపడతామని పేర్కొంది. యుద్ధం కొససాగుతుండడం వల్ల దీనిపై దృష్టి సారించలేదంది.
అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్పై మెరుపుదాడి చేయడంతో ఆ దేశానికి చెందిన సుమారు 1200 మంది చనిపోయారు. సుమారు 250 మందిని హమాస్ బందీలుగా చేసుకుంది. దీంతో ఇజ్రాయెల్ అప్పటినుంచి గాజాపై వైమానిక, భూతల దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో ఇప్పటివరకు 27,000కు పైగా మంది చనిపోయినట్లు పాలస్తీనా ఆరోగ్యశాఖ పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
WWE మాజీ మహిళా రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈఓ
WWE మాజీ మహిళా రెజ్లర్ ఎరికా హమ్మండ్ను బిల్ట్ రివార్డ్స్ సీఈఓ అంకుర్ జైన్ వివాహం చేసుకున్నారు. వీరికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. -
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..
Elon Musk: గ్రహాంతర జీవులు ఉన్నారా అనే అంశంపై ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ స్పందించారు. -
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి..
అగ్రరాజ్యం అమెరికాలో పోలీసుల కర్కశత్వానికి ఫ్రాంక్ టైసన్ (53) అనే ఆఫ్రో-అమెరికన్ ప్రాణాలు కోల్పోయాడు. -
జీవ వైవిధ్యానికి గొడ్డలిపెట్టు కానున్న వాతావరణ మార్పులు
ఈ శతాబ్దం మధ్యనాటికి జీవవైవిధ్యంలో క్షీణతకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమవుతాయని తాజా అధ్యయనం పేర్కొంది. -
కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదన
రఫాపై దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతుందన్న వార్తల నేపథ్యంలో కాల్పుల విరమణ చర్చలు ఊపందుకుంటున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ తమకు ఓ ప్రతిపాదన పంపినట్లు హమాస్ తెలిపింది. -
బ్రెజిల్లోని హోటల్లో అగ్నిప్రమాదం
దక్షిణ బ్రెజిల్లోని పాటో అలెగ్రి నగరంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించేందుకు స్థానిక ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న ఓ హోటల్లో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. -
చిత్రవార్త
-
అమెరికా డ్రోన్ను కూల్చిన హూతీలు
ఎర్రసముద్రం మళ్లీ వేడెక్కింది. హూతీ వేర్పాటువాదులు దూకుడు పెంచారు. బాలిస్టిక్ క్షిపణులతో బాబ్ ఎల్ మండేబ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలను భయపెడుతున్నారు. -
అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే ఓ రేడియో ఇంటర్వ్యూలో తెలిపారు. -
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం
అమెరికాలోని సౌత్ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంతో ప్రయాణిస్తున్న ఎస్యూవీ అదుపు తప్పి పల్టీలు కొట్టిన ఈ దుర్ఘటనలో భారత సంతతికి చెందిన ముగ్గురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. -
కంబోడియా సైనిక స్థావరంలో పేలుడు
కంబోడియాలో ఓ సైనిక స్థావరంలో పేలుడు సంభవించి 20 మంది సైనికులు మృతి చెందారు. చాలా మందికి గాయాలయ్యాయి. -
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఒక దశలో ఒంటరితనాన్ని అనుభవించారట. చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీని వెనకేసుకొచ్చిన గంభీర్.. మీడియాకు చురకలు..!
-
WWE మాజీ మహిళా రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈఓ
-
‘బంగారం’లాంటి కబురు చెప్పిన సమంత.. అభిమానుల ఆనందం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి
-
పాలు ఎప్పుడు తాగాలి? ఎందుకు తాగాలి? పూర్తి సమాచారం ఇదిగో!