Israel: యూఎన్ ఏజెన్సీ హెడ్క్వార్టర్స్ కింద భారీ సొరంగాన్ని గుర్తించిన ఇజ్రాయెల్ ఆర్మీ
గాజాలోని యూఎన్ ఏజెన్సీ హెడ్క్వార్టర్స్ భవనం కింద భారీ సొరంగం గుర్తించినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది.
గాజా: గాజా (Gaza)లో పాలస్తీనా శరణార్థుల కోసం ఏర్పాటు చేసిన ఐక్యరాజ్యసమితి (United Nations) ఏజెన్సీ ‘యూఎన్ఆర్డబ్ల్యూఏ’ హెడ్క్వార్టర్స్ భవనాల కింద ఉన్న భారీ సొరంగాన్ని ఇజ్రాయెల్ మిలిటరీ (IDF) గుర్తించింది. దీనికి సంబంధించి ఎక్స్ (ట్విటర్) వేదికగా వీడియోను పోస్టు చేసింది. తమ కార్యకలాపాల కోసం హమాస్ (Hamas) ఈ సొరంగం నిర్మించి దీనికి విద్యుత్ సదుపాయం ఏర్పాట్లు చేసుకున్నట్లు ఐడీఎఫ్ తెలిపింది. దీంతో అక్టోబర్ 7న హమాస్ మారణకాండకు సంబంధించి సదరు ఏజెన్సీకి చెందిన ఉద్యోగుల పాత్రపై ఇజ్రాయెల్ చేస్తున్న ఆరోపణలకు ఈ ఘటన మరింత బలం చేకూర్చినట్లైంది.
అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ సాగించిన మారణకాండలో ‘యూఎన్ఆర్డబ్ల్యూఏ’ ఉద్యోగుల పాత్ర ఉన్నట్లు ఇజ్రాయెల్ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ ఏజెన్సీ కమిషనర్ జనరల్ ఫిలిప్ లజారి దాడికి సంబంధించి పాత్ర ఉన్నట్లు అనుమానిస్తున్న 12 మంది సిబ్బందిని తొలగించారు. వారిపై విచారణ చేపడతామని ప్రకటించారు. దీంతో ఇజ్రాయెల్ ఏజెన్సీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసింది. సరుకుల సరఫరాను అడ్డుకోవడంతోపాటు దాని పన్ను ప్రయోజనాలను రద్దు చేసింది. ఈ ఆరోపణల నేపథ్యంలో ఏజెన్సీకి నిధుల మంజూరును నిలిపివేస్తున్నట్లు అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా ప్రకటించాయి. దీంతో ఈ సంస్థ తీవ్ర ఆర్థిక కష్టాల్లోకి జారుకుంది.
సొరంగంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ..
మొత్తం 700 మీటర్ల పొడవు గల ఈ టన్నెల్ను 18 మీటర్ల లోతులో నిర్మించారు. విద్యుత్ సరఫరా కావడానికి ఏర్పాట్లు చేశారు. సొరంగంలో బ్యాటరీలు, విద్యుత్ పరికరాలు, ఆయుధాలు, సామగ్రి, గ్రనేడ్లు, ఏజెన్సీ సర్వర్ రూమ్తో అనుసంధానం అయిన హమాస్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ గుర్తించినట్లు ఐడీఎఫ్ పేర్కొంది. తాజాగా ఘటనపై యూఎన్ఆర్డబ్ల్యూఏ స్పందించింది. తమ కార్యాలయం కింద సొరంగం ఉందని, విద్యుత్ సరఫరా సాగినట్లు తమకు తెలియదని పేర్కొంది. దీనికి సంబంధించి స్వతంత్ర విచారణ చేపడతామని పేర్కొంది. యుద్ధం కొససాగుతుండడం వల్ల దీనిపై దృష్టి సారించలేదంది.
అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్పై మెరుపుదాడి చేయడంతో ఆ దేశానికి చెందిన సుమారు 1200 మంది చనిపోయారు. సుమారు 250 మందిని హమాస్ బందీలుగా చేసుకుంది. దీంతో ఇజ్రాయెల్ అప్పటినుంచి గాజాపై వైమానిక, భూతల దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో ఇప్పటివరకు 27,000కు పైగా మంది చనిపోయినట్లు పాలస్తీనా ఆరోగ్యశాఖ పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సోషల్ మీడియా వీడియోల పిచ్చి ముదిరి.. రైలును పట్టాలు తప్పించి..!
సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేయడం కోసం ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. అతడి చర్యల కారణంగా ఏకంగా రూ.2 కోట్లకుపైగా నష్టం వాటిల్లింది. -
చర్చకు సిద్ధమేనన్న కమలాహారిస్.. అప్పటివరకు వద్దన్న ట్రంప్
మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump)తో ముఖాముఖి చర్చకు తాను సిద్ధమేనని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహ్యారిస్(Kamala Harris) వెల్లడించారు. -
జోబైడెన్ మెదడు అద్భుతంగా పనిచేస్తోంది: శ్వేతసౌధం డాక్టర్ల సర్టిఫికెట్
జోబైడెన్ మానసిక ఆరోగ్యం అద్భుతంగా ఉందని శ్వేతసౌధం డాక్టర్లు చెబుతున్నారు. -
భారత్కు అండగా ఉందాం.. పాక్కు సాయం నిషేధిద్దాం: అమెరికా కాంగ్రెస్లో బిల్లు
US-India Defense Cooperation Act: భారత్ను అమెరికా మిత్రదేశాలైన జపాన్, ఇజ్రాయెల్, దక్షిణ కొరియా, నాటో కూటమితో సమానంగా చూడాల్సిన అవసరం ఉందంటూ అగ్రరాజ్య కాంగ్రెస్లో కీలక సెనేటర్ బిల్లు ప్రవేశపెట్టారు. -
గాజాలో సంక్షోభంపై మౌనంగా ఉండలేను.. నెతన్యాహుతో కమలా హారిస్
Harris - Netanyahu: హమాస్తో యుద్ధం ముగింపునకు సమయం వచ్చిందని కమలా హారిస్ అన్నారు. ఆ దిశగా ఒప్పందం చేసుకోవాలని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహుకు సూచించారు. -
69 రకాల పురుగుమందులతో రైతులకు.. ధూమపానం స్థాయిలో క్యాన్సర్ ముప్పు!
కొన్ని రకాల పురుగుమందుల వినియోగంతో రైతుల్లో క్యాన్సర్ ముప్పు గణనీయంగా పెరుగుతోందని తాజా అధ్యయనమొకటి తేల్చింది. -
దేశ భవిష్యత్తు కోసం పోరాడతా
‘అమెరికా ప్రజలుగా ఇప్పుడు మన ముందు రెండు అవకాశాలున్నాయని నేను భావిస్తున్నా. ఒకటి దేశాన్ని ముందుకు తీసుకెళ్లే మన విధానం.. రెండోది గతాన్ని తవ్వే ప్రత్యర్థుల అరాచకం.. ఈ రెండింటిలో మనం ఏదో ఒకటి ఎంచుకోవాల్సిన సమయం వచ్చింది. -
అధికారానికి కమలా హారిస్ అనర్హురాలు
అమెరికాను పాలించేందుకు ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్కు అర్హత లేదని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. -
మోదీ రష్యా పర్యటననిరాశ కలిగించింది
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల రష్యాలో పర్యటించడం తమను తీవ్రంగా నిరాశపరిచిందని అమెరికా తెలిపింది. -
సంక్షిప్త వార్తలు (5)
వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ)ను, సరిహద్దుకు సంబంధించి గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను పూర్తిస్థాయిలో గౌరవించాల్సిందేనని చైనాకు భారత్ మరోసారి నొక్కిచెప్పింది. -
బైడెన్, హారిస్తో నెతన్యాహు భేటీ
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్తో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గురువారం వాషింగ్టన్లో భేటీ అయ్యారు. -
కాలిఫోర్నియాలో విస్తరిస్తున్న కార్చిచ్చు
అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో విస్తరిస్తున్న కార్చిచ్చు వల్ల పలు ప్రాంతాల్లోని ప్రజలు తమ ఆవాసాలను ఖాళీ చేయాల్సి వస్తోంది. -
ప్రచారం కోసం డబ్బు వెదజల్లుతున్న రిపబ్లికన్లు
ట్రంప్ ప్రచారం కోసం డబ్బును రిపబ్లికన్లు వెదజల్లుతున్నారు. గత సోమవారం నుంచి ఆగస్టు దాకా టీవీ, రేడియోల్లో ప్రచారం కోసం ఆ పార్టీవారు 68 మిలియన్ డాలర్లను ఖర్చు చేయనున్నారు. -
పైలట్ను కాపాడిన కంటైనర్!
నేపాల్లోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం నుంచి పైలట్ మనీష్ శాక్య (37) ఒక్కరే వెంట్రుక వాసిలో ప్రాణాలతో బయటపడ్డారు. తీవ్రంగా గాయపడి ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. -
ఇమ్రాన్ ఎంపీలు 39 మందికి అధికారిక గుర్తింపు
పాక్ సుప్రీంకోర్టు జారీచేసిన మైలురాయి లాంటి మార్గదర్శకాలను అనుసరిస్తూ ఎన్నికల సంఘం (ఈసీ) ఇటీవలి ఎన్నికల్లో విజయం సాధించిన మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ పార్టీ పీటీఐకి చెందిన 39 మంది ఎంపీలను చట్టసభ సభ్యులుగా గుర్తిస్తున్నట్లు ప్రకటించింది. -
విమాన ప్రయాణికులపై లండన్ పోలీసుల కర్కశత్వం
నలుగురు విమాన ప్రయాణికులపై లండన్లోని మాంచెస్టర్ విమానాశ్రయంలో పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. వారిని నేలకేసి చితకబాదారు. -
జపాన్లో తగ్గిపోతున్న జనాభా
ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జపాన్లో వరుసగా 15వ ఏడాదీ జనాభా సంఖ్యలో క్షీణత నమోదైంది. జననాల కన్నా మరణాల సంఖ్య అధికంగా ఉంటోంది. -
ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసమే వైదొలిగా
డెమోక్రటిక్ పార్టీతోపాటు దేశాన్ని ఏకతాటిపై నిలపడం కోసమే తాను ఎన్నికల రేసు నుంచి వైదొలగినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. -
హమాస్.. ఇజ్రాయెల్ యుద్ధం.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
హమాస్తో యుద్ధానికి వీలైనంత త్వరగా ముగింపు పలకాలని అమెరికా అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
సోషల్ మీడియా వీడియోల పిచ్చి ముదిరి.. రైలును పట్టాలు తప్పించి..!
-
ఆ ప్రాజెక్ట్కు ఓకే చెప్పినందుకు బాధపడ్డా: టబు
-
నాలుగు సంవత్సరాలు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా: నాగ్ అశ్విన్
-
చర్చకు సిద్ధమేనన్న కమలాహారిస్.. అప్పటివరకు వద్దన్న ట్రంప్
-
కార్గిల్ 25వ విజయ్ దివస్.. యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళులు
-
జోబైడెన్ మెదడు అద్భుతంగా పనిచేస్తోంది: శ్వేతసౌధం డాక్టర్ల సర్టిఫికెట్