Netanyahu Jr: భీకర యుద్ధం వేళ.. ప్రధాని కుమారుడు ఎక్కడ..?
యావత్ దేశం యుద్ధం క్షేత్రంలో అడుగుపెడుతున్న వేళ.. ప్రధానమంత్రి నెతన్యహూ (Benjamin Netanyahu) కుమారుడు అమెరికాలో ఉన్నారన్న విషయం చర్చనీయాంశమయ్యింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇజ్రాయెల్-హమాస్ల (Israel Hamas conflict) మధ్య రెండు వారాలుగా కొనసాగుతోన్న భీకర యుద్ధం మరింత ఉద్ధృతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో గాజాపై భూతల దాడులకు ఉపక్రమించిన ఇజ్రాయెల్.. రిజర్వు ఆర్మీని కూడా రంగంలోకి దింపింది. దాదాపు 3లక్షలకు పైగా రిజర్వు సైనికులు ఇప్పటికే కదనరంగంలోకి దిగారు. ఇలా యావత్ దేశం యుద్ధం క్షేత్రంలో అడుగుపెడుతున్న వేళ.. ప్రధానమంత్రి నెతన్యహూ (Benjamin Netanyahu) కుమారుడు మాత్రం అమెరికాలో ఉన్నారన్న విషయం చర్చనీయాంశమయ్యింది. దీనిపై రిజర్వు సైనికుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యహూ కుమారుడు యాయిర్ (32).. ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్లు సమాచారం. సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్టుకు సంబంధించి పరువునష్టం కేసులో చుక్కెదురయ్యింది. దీంతో ఈ ఏడాది ప్రారంభంలో యాయిర్ అమెరికా వెళ్లిపోయాడు. ప్రస్తుతం మియామిలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై అనేక మంది రిజర్వు సైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘విదేశాల్లో ఉద్యోగం, కుటుంబాలను వదిలి దేశం కోసం నుంచి తిరిగి వచ్చాం. ఇటువంటి సమయంలో ప్రధానమంత్రి కుమారుడెక్కడ..?’ అని ఓ సైనికుడు ప్రశ్నించాడు. ‘ఓ ఇజ్రాయెల్ పౌరుడిగా మనమందరం ఏకం కావాల్సిన సమయం. ప్రధానమంత్రి కుమారుడితోపాటు దేశంలోని ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉండాల్సిందే’ అని మరో సైనికుడు గళమెత్తినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇలా కొన్ని రిజర్వు సైనిక యూనిట్ల నుంచి ఇటువంటి ప్రశ్నలే వచ్చాయని పేర్కొన్నాయి.
కదనరంగంలోకి 3లక్షల మంది ‘రిజర్వు ఆర్మీ’.. అసలేమిటీ సైన్యం..?
నెతన్యహూ కుమారుడు యాయిర్.. థియేటర్ విభాగంలో విద్యాభ్యాసం పూర్తిచేశాడు. ఇజ్రాయెల్లో నిర్బంధ సైనిక సేవను గతంలోనే పూర్తిచేసుకున్నాడు. అయితే, ఇజ్రాయెల్కు చెందిన నేషనల్ యూనిటీ నేత బెన్నీ గాంట్జ్తో డానా కాసిడీ అనే మహిళ సామాజిక వేత్త ప్రేమాయాణం సాగిస్తుందంటూ 2020 ఎన్నికల సమయంలో సోషల్ మీడియాలో యాయిర్ పోస్టు చేశాడు. దీంతో ఆమె కోర్టులో దావా వేశారు. ఈ కేసులో యాయిర్కు చుక్కెదురయ్యింది. కాసిడీకి 34వేల డాలర్లు చెల్లించాలని నెతన్యహూ కుమారుడిని ఇజ్రాయెల్ కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలోనే అతడు అమెరికాకు వెళ్లినట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఒక దశలో ఒంటరితనాన్ని అనుభవించారట. చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన చెప్పారు. -
కారు పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి
అమెరికా(USA)లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ మహిళలు ప్రాణాలు కోల్పోయారు. -
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
Miss Universe Buenos Aires: 60 ఏళ్ల వయసులో అందాల తారగా కిరీటం దక్కించుకుందో మహిళ. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది మిస్ యూనివర్స్ పోటీల్లోనూ పాల్గొననుంది. -
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
అమెరికా(USA)లో ఓ నల్లజాతీయుడిపై పోలీసులు వ్యహరించిన తీరుతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. దాంతో తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. -
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం
-
టాప్లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట
-
లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి బలి
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
‘నా ప్రత్యర్థి మోదీ.. సీఎం కాదు’: హిమంతకు ఖర్గే కౌంటర్