Israel: బందీల కుటుంబాల నుంచి నెతన్యాహుకు నిరసన!
Israel: బందీల విడుదలకు సమయం మించిపోతోందని వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వారిని వెంటనే విడిపించేందుకు నెతన్యాహు ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జెరూసలెంలో నిరసన ప్రదర్శన చేపట్టారు.
జెరూసలెం: ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేలాది మంది ఆదివారం నిరసన ప్రదర్శన చేపట్టారు. జెరూసలెంలోని పార్లమెంట్ ముందు గుమిగూడి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. హమాస్ (Hamas) చెరలో ఉన్న బందీలను వెంటనే తీసుకురావాలని డిమాండ్ చేశారు. ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని ప్రజలు నినదించారు.
గతేడాది అక్టోబర్ 7న హమాస్ జరిపిన దాడిలో 1200 మంది ఇజ్రాయెలీలు మరణించిన విషయం తెలిసిందే. దాదాపు 250 మందిని బందీలుగా చేసుకున్నారు. ఈ ఘటన తర్వాత యావత్ ఇజ్రాయెల్ (Israel) ఏకతాటిపైకి వచ్చింది. హమాస్పై ప్రారంభించిన యుద్ధంలో ప్రభుత్వానికి మద్దతుగా నిలిచింది. కానీ, ఇప్పటికీ పరిస్థితులు ఓ కొలిక్కి రాలేదు. ఇంకా చాలా మంది హమాస్ చెరలో బందీలుగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు రెండు వర్గాలుగా చీలిపోయారు. కొందరు నెతన్యాహు పోరాటానికి మద్దతుగా నిలుస్తుంటే మరికొందరు యుద్ధానికి వెంటనే ముగింపు పలికి బందీలను విడిపించాలని డిమాండ్ చేస్తున్నారు.
నవంబర్లో కుదిరిన సంధి మేరకు దాదాపు సగం మంది బందీలను హమాస్ విడుదల చేసిన విషయం తెలిసిందే. కానీ, మరింత మందిని తీసుకొచ్చేందుకు మధ్యవర్తులుగా వివిధ దేశాలు చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటి వరకు ఫలించలేదు. దీంతో బందీల కుటుంబాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు తమవారు బయటకు రారంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మధ్యవర్తులు చేస్తున్న ప్రయత్నాలకు నెతన్యాహు ప్రభుత్వమే అడ్డుపడుతోందని ఆరోపిస్తున్నారు.
హూతీల డ్రోన్ల కూల్చివేత..
మరోవైపు ఎర్ర సముద్రంలో ఇంకా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా హూతీ తిరుగుబాటుదారులకు చెందిన రెండు డ్రోన్లను కూల్చి వేసినట్లు అమెరికా ప్రకటించింది. ఒకటి యెమెన్ భూభాగంపై కూల్చగా.. మరొకటి ఎర్ర సముద్రంపై విహరిస్తుండగా దాడి చేసినట్లు తెలిపింది. అంతర్జాతీయ జలాల్లో సురక్షిత ప్రయాణానికి ప్రతిదాడులు చేయక తప్పడం లేదని అమెరికా సెంట్కామ్ ప్రకటించింది. దీనిపై హూతీల నుంచి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటనా రాలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రఫాపై దండయాత్ర జరిగితే..రక్తపాతమే: WHO ఆందోళన
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఒక కొలిక్కి రావడం లేదు. దాంతో నెతన్యాహు హెచ్చరించినట్లు రఫా(Rafah)పై దండయాత్ర జరిగితే ఎదురయ్యే విపత్కర పరిస్థితులపై ఆందోళన వ్యక్తం అవుతోంది. -
‘భారత్ తలుపులు తెరిచే ఉన్నాయి’.. బైడెన్ వ్యాఖ్యలపై జైశంకర్ కౌంటర్!
విదేశీ వలసదారులను తమ దేశంలోకి అనుమతించేందుకు భారత్ భయపడుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి ఎస్.జైశంకర్ ఖండించారు. భిన్న సమాజాలకు చెందిన పౌరుల కోసం భారత్ తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉన్నాయన్నారు. -
17మంది రోగులను హత్య చేసిన నర్సు..700 ఏళ్ల జైలు శిక్ష
తాను పని చేసే ఆసుపత్రిలో చేరిన రోగులకు అధిక మోతాదులో ఇన్సులిన్ ఇచ్చి హత్య చేస్తున్న అమెరికాలోని ఓ నర్సుకు అక్కడి కోర్టు శనివారం 700 ఏళ్ల జైలు శిక్ష విధించింది. -
నిజ్జర్ హత్య కేసు.. ఆ ముగ్గురు నిందితులకు ‘పాక్ ఐఎస్ఐ’తో సంబంధాలు..!
Nijjar murder: ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసులో కెనడా అరెస్టు చేసిన ముగ్గురు నిందితులకు పాకిస్థాన్ ఐఎస్ఐతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. -
యుద్ధ విమానానికి పైలట్గా కృత్రిమ మేధ!
కృత్రిమ మేధ (ఏఐ) క్రమంగా అన్ని రంగాల్లోకీ ప్రవేశిస్తోంది. యుద్ధవిమాన పైలట్గానూ అది ఎదిగింది. తాజాగా ఏఐ నియంత్రిత ఎఫ్-16 ఫైటర్ జెట్ అమెరికాలో గగనవిహారం చేసింది. -
నేపాల్ కరెన్సీ రూ.100 నోటుపై వివాదాస్పద భూభాగాలతో కొత్తపటం
నేపాల్ తన తాజా కరెన్సీ నోటుపై మూడు కొత్త భూభాగాలను చేర్చడం ద్వారా నవీకరించిన దేశ రాజకీయ పటం ముద్రించనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. -
జాబిల్లి ఆవలివైపు శిలల కోసం చైనా వ్యోమనౌక
మనకు కనిపించని చందమామ అవతలి భాగం నుంచి మట్టి, శిలలను సేకరించి, భూమికి తెచ్చేందుకు చైనా శుక్రవారం చాంగే-6 అనే వ్యోమనౌకను ప్రయోగించింది. -
వారంలో అంగీకరిస్తే సరే.. లేకపోతే రఫాపై దండయాత్రే
గాజా కాల్పుల విరమణ అంశం రోజుకో మలుపు తిరుగుతోంది. ఒప్పందం కుదిర్చేందుకు అమెరికా, ఈజిప్టు, ఖతార్ తెర వెనక ప్రయత్నాలు చేస్తుంటే విరమణకు అంగీకరించాల్సిన హమాస్, ఇజ్రాయెల్ పరస్పరం హెచ్చరికలు జారీ చేసుకుంటున్నాయి. -
రిషి సునాక్కు ఎదురుదెబ్బ
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీకి భారీ పరాజయాలు ఎదురవుతున్నాయి. -
2,200కు చేరిన అరెస్టులు
అమెరికా యూనివర్సిటీల్లో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి. రోజుకో యూనివర్సిటీలోకి పోలీసులు ప్రవేశించి ఆందోళనకారులను బయటకు పంపుతున్నారు. -
నిజ్జర్ హత్య కేసులో ముగ్గురి అరెస్టు
ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో నిందితులుగా పేర్కొంటూ శుక్రవారం కెనడా పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. -
పీవోకేలో రోడ్డు ప్రమాదం.. 20 మంది మృతి
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని గిల్గిత్-బాల్టిస్తాన్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 43 మంది ప్రయాణికులతో రావల్పిండి నుంచి గిల్గిత్ వెళుతున్న బస్సు.. డైమెర్ జిల్లాలో కారాకోరం హైవేపై అదుపు తప్పి లోయలో పడింది. -
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ప్రసిద్ధి చెందిన ఆన్లైన్ ఫార్మసీ సంస్థ హిమ్స్ సీఈఓ ఆండ్రూ డుడమ్ ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మనీ స్వైపింగ్ స్కామ్.. బ్యాంక్ మెసేజ్లతో కొత్త మోసం!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
-
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
భద్రతా బలగాలపై ఉగ్ర కాల్పులు.. అయిదుగురు జవాన్లకు గాయాలు
-
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్