Israel: హమాస్తో యుద్ధమే.. అధికారికంగా ప్రకటించిన ఇజ్రాయెల్
మిలిటెంట్ సంస్థ హమాస్తో తాము యుద్ధంలో ఉన్నామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇప్పటికే ప్రకటించగా.. ఇందుకు సంబంధించిన నిర్ణయానికి అక్కడి సెక్యూరిటీ కేబినెట్ ఆమోదం తెలిపింది.
టెల్అవీవ్: హమాస్ మిలిటెంట్ల మెరుపు దాడితో ఇజ్రాయెల్ (Israel Hamas conflict) దద్దరిల్లింది. ప్రతిగా పాలస్తీనాలోని గాజాపై ఇజ్రాయెల్ కూడా వైమానిక దాడులకు దిగింది. ఈ భీకర దాడుల్లో ఇరువైపులా కలిపి ఇప్పటివరకు 1000 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో మూడు, నాలుగు వేల మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ క్రమంలో తాము యుద్ధంలో ఉన్నామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇప్పటికే ప్రకటించగా.. ఇందుకు సంబంధించిన నిర్ణయానికి తాజాగా అక్కడి సెక్యూరిటీ కేబినెట్ ఆమోదం తెలిపింది.
‘గాజా నుంచి అక్టోబర్ 7న ఉదయం 6గంటలకు ఇజ్రాయెల్పై ఉగ్రవాదులు జరిపిన భీకర దాడులతో యుద్ధం మొదలైంది’ అని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో అవసరమైన సైనిక కార్యకలాపాలు కొనసాగించవచ్చని తెలిపింది. తదుపరి వివరాలను మాత్రం వెల్లడించలేదు. అయితే, ఈ విషయాన్ని నెతన్యాహు ఇప్పటికే ప్రకటించగా.. తాజాగా అక్కడి సెక్యూరిటీ కేబినెట్ ఇందుకు ఆమోద ముద్ర వేసింది.
ఇజ్రాయెల్పై మెరుపు దాడులకు దిగిన పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్.. ఒకేసారి వేల రాకెట్లను గాజా నుంచి ప్రయోగించింది. దీంతోపాటు సాయుధులైన డజన్లకొద్దీ మిలిటెంట్లు సరిహద్దులు దాటి ఇజ్రాయెల్లోకి ప్రవేశించారు. భూమి, ఆకాశం, సముద్రం నుంచి ఒక్కసారిగా హమాస్ విరుచుకుపడటంతో ఇజ్రాయెల్ ఉక్కిరిబిక్కిరి అయ్యింది. హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ పట్టణాల్లో స్వైర విహారం చేస్తూ.. డజన్లకొద్దీ ఇజ్రాయెలీలను బందీలుగా చేసుకున్నారు. ఓవైపు వారిని విడిపించేందుకు ప్రయత్నాలు చేస్తుండటంతోపాటు గాజాపై ఇజ్రాయెల్ ప్రతిదాడులను కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఇరువైపుల వెయ్యి మంది ప్రాణాలు కోల్పోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మందుగుండు సామగ్రి పేలి.. 20 మంది సైనికులు మృతి!
ఓ సైనిక స్థావరంలో సంభవించిన మందుగుండు సామగ్రి పేలుడు ఘటనలో 20 మంది సైనికులు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కంబోడియాలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. -
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఒక దశలో ఒంటరితనాన్ని అనుభవించారట. చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన చెప్పారు. -
కారు పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి
అమెరికా(USA)లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ మహిళలు ప్రాణాలు కోల్పోయారు. -
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
Miss Universe Buenos Aires: 60 ఏళ్ల వయసులో అందాల తారగా కిరీటం దక్కించుకుందో మహిళ. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది మిస్ యూనివర్స్ పోటీల్లోనూ పాల్గొననుంది. -
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
అమెరికా(USA)లో ఓ నల్లజాతీయుడిపై పోలీసులు వ్యహరించిన తీరుతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. దాంతో తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. -
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.
తాజా వార్తలు (Latest News)
-
చెలరేగిన సంజు, జురెల్.. లఖ్నవూపై రాజస్థాన్ విజయం
-
మందుగుండు సామగ్రి పేలి.. 20 మంది సైనికులు మృతి!
-
ఐసీఐసీఐ బ్యాంక్ లాభం రూ.11,672 కోట్లు.. ఒక్కో షేరుకు ₹10 డివిడెండ్
-
ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య కలచివేసింది: సీవీ ఆనంద్
-
డ్రగ్ తయారీ మాఫియా గుట్టురట్టు.. 300 కేజీలు స్వాధీనం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM