Japan Airlines: టోక్యో ఎయిర్ పోర్టులో రెండు విమానాలు ఢీ
జపాన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం ప్రమాదానికి గురైంది. టోక్యోలోని హనేడా విమానాశ్రయం రన్ వేపై దిగుతున్న సమయంలో ఒక్కసారిగా మంటల్లో చిక్కుకొంది.
టోక్యో: జపాన్ ఎయిర్లైన్స్కు చెందిన జేఏఎల్ 516 విమానం ప్రమాదానికి గురైంది. రాజధాని టోక్యోలోని హనేడా విమానాశ్రయం రన్ వేపై దిగుతుండగా మంటల్లో చిక్కుకుంది. క్షణాల్లోనే మంటలు వ్యాపించాయి. హొక్కైడో విమనాశ్రయం నుంచి ఇది బయల్దేరి వచ్చింది.
ఈ ఘటనపై జపాన్ ఎయిర్లైన్స్ సంస్థ అధికారులు స్పందిస్తూ.. విమానం రన్వేపై దిగిన తర్వాత అక్కడే ఉన్న కోస్టు గార్డు ఎయిర్క్రాఫ్ట్ను ఢీకొన్నట్లు భావిస్తున్నామని జాతీయ మీడియా ఎన్హెచ్కేకు తెలియజేశారు. ఇప్పటికీ విమానం మంటలు అదుపులోకి రాలేదు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో జేఏల్ 516 విమానంలో సిబ్బంది, ప్రయాణికులు కలిపి 400 మంది వరకు ఉన్నారని ఎన్హెచ్కే పేర్కొన్నట్లు జపాన్ టైమ్స్ వెల్లడించింది. వీరందరినీ బయటకు చేర్చినట్లు తెలిపింది. ఎంతమంది గాయపడ్డారో కచ్చితంగా తెలియరాలేదు.
కనిపించని కోస్టుగార్డు సిబ్బంది ఆచూకీ
ప్రమాద సమయంలో కోస్టుగార్డు విమానంలో ఉన్న ఆరుగురు సిబ్బందిలో ఒకరు బయటపడగా.. మరో ఐదుగురి ఆచూకీ లభ్యం కాలేదని ఎన్హెచ్కే వెల్లడించింది. ఒక్కసారిగా మంటలు తీవ్రం కావడంతో లోపలికి వెళ్లి వెతకడం విమానాశ్రయ సిబ్బందికి కూడా సాధ్యం కాలేదు. తాజా ఘటనతో హనేడా విమానాశ్రయాన్ని అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. దాదాపు 70కి పైగా అగ్నిమాపక శకటాలను మంటలను అదుపు చేస్తున్నాయి. ఈ ఘటనపై జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి..ఎప్పటికప్పుడు వివరాలు వెల్లడించాలని అధికారులను ఆదేశించారు.
జపాన్లో ఈ తరహా ప్రమాదం చోటు చేసుకోవడం గత మూడు దశాబ్దాల కాలంలో ఇదే తొలిసారి. చివరిసారిగా 1985లో జేఏఎల్ జంబో జెట్ విమానం టోక్యో నుంచి ఒకాసా నగరానికి వెళ్తుండగా.. గున్మా ప్రాంతంలో కూలిపోయింది. ఈ ఘటనలో 520 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒకవైపు వరుస భూకంపాలతో జపాన్ చిగురుటాకులా వణికిపోతున్న వేళ.. విమాన ప్రమాదం చోటు చేసుకోవడం అక్కడి ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రంగంలోకి బైడెన్.. గాజాలోకి మరింత సాయానికి ఇజ్రాయెల్ అనుమతి
Israel-Hamas Conflict: గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. దీంతో అక్కడ అనేక మంది ఆకలితో అలమటిస్తున్నారు. వారికి సాయం అందించేలా సరిహద్దుల్లో మరిన్ని దారులు తెరుస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. -
చిత్ర వార్త
గాజాలోని ఖాన్యూనియన్లో తాత్కాలిక శిబిరంలో ఏర్పాటు చేసిన ఓ పాఠశాలలో చదువుకుంటున్న పాలస్తీనా చిన్నారులు -
ఆరేళ్ల పిల్లాడితో పోటీ పడుతున్నా: జో బైడెన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వయసు పెద్ద చర్చనే రేపుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్కు 81 ఏళ్లు. దీంతో ఆయన రేసులో నిలబడటంపై విమర్శలు చెలరేగుతున్నాయి. -
గుండెజబ్బుల ముప్పును పెంచే వాహన ధ్వనులు
వాహనాల రణగొణ ధ్వనులు గుండె జబ్బుల ముప్పును పెంచుతాయని అంతర్జాతీయ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఇందులో గుండెపోటు ముప్పు కూడా ఉందని వెల్లడైంది. -
టిబెట్పై చైనా అణచివేతను ప్రపంచానికి చాటుతా: నామ్కీ
టిబెట్ గుర్తింపును దెబ్బతీసేందుకు చైనా ప్రయత్నిస్తోందని, టిబెట్ వాసులు నానాటికీ పెరుగుతున్న భయం, అణచివేతల నడుమ బతుకుతున్నట్లు నామ్కీ (24) తెలిపారు. -
దుబాయ్లో అతిపెద్ద విమానాశ్రయం!
ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్ దారుణహత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. బాగ్దాద్లోని ఆమె ఇంటి వద్దే గుర్తుతెలియని వ్యక్తి కాల్చిచంపారు. -
దక్షిణ చైనాలో టోర్నడో విధ్వంసం
దక్షిణ చైనాలోని గ్వాంగ్ఝౌ నగరంలో శనివారం ఓ భారీ టోర్నడో విధ్వంసం సృష్టించింది. దీని తాకిడికి అయిదుగురు మరణించగా, 33 మంది గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. -
అమెరికాలో ‘గాజా’ సెగలు.. ఆగని విద్యార్థుల ఆందోళనలు
గాజాపై దాడులకు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో గత పది రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. -
హూతీల దాడికి గురైన నౌకకు భారత్ అండ
ఎర్రసముద్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో మళ్లీ భారత నౌకాదళం తన సత్తా చూపింది. హూతీ వేర్పాటువాదుల క్షిపణి దాడికి గురైన ఎంవీ ఆండ్రోమేడా స్టార్ నౌకకు అండగా నిలిచింది. -
తీవ్రంగా వేడెక్కనున్న హిందూ మహాసముద్రం
హిందూ మహాసముద్రం తీవ్రస్థాయిలో వేడెక్కే అవకాశం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. 2020 నుంచి 2100 మధ్య ఈ మహాసాగర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలు 1.4 డిగ్రీల నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకూ పెరగొచ్చని స్పష్టంచేస్తోంది. -
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ దార్
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇశాక్ దార్ అనూహ్య రీతిలో ఉప ప్రధానిగా నియమితులయ్యారు. ఆదివారం ఈ నిర్ణయం వెలువడింది. -
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో 35 బిలియన్ డాలర్ల (రూ.2.9లక్షల కోట్లు)తో కొత్త టెర్మినల్ నిర్మించనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా నకిలీ వీడియో.. దిల్లీలో కేసు నమోదు
-
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
-
వైవిధ్య చిత్రాలు వచ్చేస్తున్నాయ్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
-
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,505
-
తెదేపాకు మద్దతిస్తున్నారని.. ఎస్టీ కాలనీకి తాగునీరు బంద్
-
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం: 9 మంది మృతి, 23 మందికి గాయాలు