Japan: ఈదురు గాలులతో జపాన్ చంద్రయానం చివరి నిమిషంలో వాయిదా..!
జపాన్ చేపట్టిన చంద్రయానం తాజాగా వాయిదా పడింది. తదుపరి తేదీని ప్రకటించలేదు. ప్రయోగానికి 27 నిమిషాల ముందు తీవ్రమైన గాలు వీయడంతో వాయిదా వేశారు.
ఇంటర్నెట్డెస్క్: తొలిసారి చంద్రుడిపై అడుగుపెట్టాలన్న జపాన్ (Japan) కల సాకారమయ్యేందుకు మరింత సమయం పట్టనుంది. తాజాగా ఆ దేశం నేడు నిర్వహించాల్సి చంద్రయానం వాయిదా పడింది. ఈ ప్రాజెక్టు కోసం హెచ్-2ఏ పేరిట రాకెట్ను జపాన్ సిద్ధం చేసింది. కానీ, ప్రయోగ కేంద్రం వద్ద గాలులు తీవ్రంగా వీయడం, ఉపరితల వాతావరణంలో కూడా అనిశ్చిత పరిస్థితులు నెలకొనడంతో లాంచ్కు 27 నిమిషాల ముందు యాత్రను వాయిదా వేశారు. ఇప్పటికే ఈ రకం రాకెట్పై చేసిన ప్రయోగాలు 98 శాతం విజయవంతం అయ్యాయి.
‘‘గాలుల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. దీంతో ముందుగా హెచ్చరించిన ప్రదేశాల్లోనే కాకుండా వేరే చోట్ల కూడా రాకెట్ శకలాలు కూలే అవకాశం ఉంది’’ మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ చీఫ్ వెల్లడించారు. ఈ యాత్ర కోసం మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్తో కలిసి జపాన్ స్పేస్ ఏజెన్సీ పనిచేస్తోంది. ప్రయోగ కేంద్రం వద్ద 5,000-15,000 మీటర్ల ఎత్తులో గాలి వేగం గంటకు 108 కిలోమీటర్లుగా నమోదైంది. జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ (జేఏఎక్స్ఏ) సేఫ్టీ మేనేజర్ మిషియో కవాకమి వెల్లడించారు. జపాన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పలు తుపాన్లు ఉండటం కూడా ప్రయోగాన్ని ప్రభావితం చేసింది. తదుపరి ప్రయోగ తేదీని నిర్ణయించలేదు. రీఫ్యూయలింగ్ వంటి కనీస చర్యలను చేపట్టాల్సి ఉండటంతో గురువారం వరకు దీనిని సిద్ధం చేసే పరిస్థితి లేదు. సెప్టెంబర్ 15 తర్వాతనే ప్రయోగ తేదీ ఉండవచ్చని భావిస్తున్నారు.
మూన్ స్నైపర్ మిషన్..
ఈ రాకెట్లో జపాన్ ఏరోనాటిక్స్ ఎక్స్ప్లోరేషన్కు చెందిన స్లిమ్ (స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్)ను చంద్రుడిపైకి చేర్చనున్నారు. జనవరి-ఫిబ్రవరి మధ్యలో కక్ష్యను ఆధారంగా చేసుకొని స్లిమ్ చంద్రుడిపై ల్యాండ్ అయ్యేట్లు జేఏఎక్స్ఏ ప్రణాళికలు సిద్ధం చేసింది. జాబిల్లిపై నిర్దేశించిన ప్రదేశానికి కేవలం 100 మీటర్లు అటుఇటుగా ల్యాండ్ అయ్యేట్లు స్లిమ్ను డిజైన్ చేశారు. దీనిలోనే జేఏఎక్స్ఏ, నాసా, ఈఎస్ఏ కలిసి మరో పరికరాన్ని కూడా అక్కడకు తీసుకెళ్లనున్నారు. తాజాగా సిద్ధం చేసిన హెచ్-2ఏ రాకెట్పై 46 ప్రయోగాలు చేపట్టగా.. 45 సఫలం అయ్యాయి. తాజాగా చేపట్టిన ప్రయోగం 47వది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చిత్ర వార్త
గాజాలోని ఖాన్యూనియన్లో తాత్కాలిక శిబిరంలో ఏర్పాటు చేసిన ఓ పాఠశాలలో చదువుకుంటున్న పాలస్తీనా చిన్నారులు -
ఆరేళ్ల పిల్లాడితో పోటీ పడుతున్నా: జో బైడెన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వయసు పెద్ద చర్చనే రేపుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్కు 81 ఏళ్లు. దీంతో ఆయన రేసులో నిలబడటంపై విమర్శలు చెలరేగుతున్నాయి. -
గుండెజబ్బుల ముప్పును పెంచే వాహన ధ్వనులు
వాహనాల రణగొణ ధ్వనులు గుండె జబ్బుల ముప్పును పెంచుతాయని అంతర్జాతీయ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఇందులో గుండెపోటు ముప్పు కూడా ఉందని వెల్లడైంది. -
టిబెట్పై చైనా అణచివేతను ప్రపంచానికి చాటుతా: నామ్కీ
టిబెట్ గుర్తింపును దెబ్బతీసేందుకు చైనా ప్రయత్నిస్తోందని, టిబెట్ వాసులు నానాటికీ పెరుగుతున్న భయం, అణచివేతల నడుమ బతుకుతున్నట్లు నామ్కీ (24) తెలిపారు. -
దుబాయ్లో అతిపెద్ద విమానాశ్రయం!
ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్ దారుణహత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. బాగ్దాద్లోని ఆమె ఇంటి వద్దే గుర్తుతెలియని వ్యక్తి కాల్చిచంపారు. -
దక్షిణ చైనాలో టోర్నడో విధ్వంసం
దక్షిణ చైనాలోని గ్వాంగ్ఝౌ నగరంలో శనివారం ఓ భారీ టోర్నడో విధ్వంసం సృష్టించింది. దీని తాకిడికి అయిదుగురు మరణించగా, 33 మంది గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. -
అమెరికాలో ‘గాజా’ సెగలు.. ఆగని విద్యార్థుల ఆందోళనలు
గాజాపై దాడులకు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో గత పది రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. -
హూతీల దాడికి గురైన నౌకకు భారత్ అండ
ఎర్రసముద్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో మళ్లీ భారత నౌకాదళం తన సత్తా చూపింది. హూతీ వేర్పాటువాదుల క్షిపణి దాడికి గురైన ఎంవీ ఆండ్రోమేడా స్టార్ నౌకకు అండగా నిలిచింది. -
తీవ్రంగా వేడెక్కనున్న హిందూ మహాసముద్రం
హిందూ మహాసముద్రం తీవ్రస్థాయిలో వేడెక్కే అవకాశం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. 2020 నుంచి 2100 మధ్య ఈ మహాసాగర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలు 1.4 డిగ్రీల నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకూ పెరగొచ్చని స్పష్టంచేస్తోంది. -
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ దార్
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇశాక్ దార్ అనూహ్య రీతిలో ఉప ప్రధానిగా నియమితులయ్యారు. ఆదివారం ఈ నిర్ణయం వెలువడింది. -
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో 35 బిలియన్ డాలర్ల (రూ.2.9లక్షల కోట్లు)తో కొత్త టెర్మినల్ నిర్మించనున్నారు.