Air Force One: అమెరికా అధ్యక్షుడి ‘ఎయిర్ఫోర్స్ వన్’లో వరుస చోరీలు.. దొంగలెవరో తెలుసా..?
ఎగిరే శ్వేతసౌధంగా ప్రసిద్ధి చెందిన అమెరికా అధ్యక్షుడి విమానం ‘ఎయిర్ ఫోర్స్ వన్’లోనే కొన్నేళ్లుగా దొంగతనాలు జరుగుతున్నాయి.
ఇంటర్నెట్డెస్క్: ప్రపంచంలోనే అత్యంత భద్రత మధ్య ఉండే వ్యక్తి అమెరికా అధ్యక్షుడు జోబైడెన్. అలాంటి వ్యక్తి ఉపయోగించే ‘ఎయిర్ఫోర్స్ వన్ ’ (Air Force One) విమానంలో వరుస చోరీలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని ఇటీవల గుర్తించిన భద్రతా సిబ్బంది.. హస్తలాఘవం ప్రదర్శిస్తున్న సదరు వ్యక్తులను హెచ్చరించారు. కొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆంగ్లపత్రిక ‘పొలిటికో’ వెలుగులోకి తెచ్చింది. ఇంతకీ ఆ దొంగలు ఎవరో తెలుసా.. అధ్యక్షుడి పర్యటనలో ఆయనతో వెళ్లే మీడియా కరస్పాండెంట్లు..!
అమెరికా అధ్యక్షుడి అధికారిక పర్యటనల్లో భాగంగా కొందరు మీడియా కరస్పాండెంట్లను తనతోపాటు ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో తీసుకెళతారు. ఈ సమయంలో సదరు సిబ్బంది ఆ విమానంలోని విస్కీ, వైన్ గ్లాస్లు.. ఇలా ఒకటేమిటీ శ్వేతసౌధం చిహ్నం ఉన్న వస్తువులను వారి బ్యాగ్ల్లో సర్దుకొంటున్నారు. ఆ తర్వాత విమానం దిగేస్తున్నారు. ఈ విషయాన్ని ది వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కేల్లీ ఓడేనియల్ (ఎన్బీసీ) ఇటీవలే తెలిపారు. ఇక ముందు అలాంటి చర్యలు మానుకోవాలని తోటి సభ్యులను ఆయన సున్నితంగా హెచ్చరించారు.
ఎయిర్ ఫోర్స్వన్లో ప్రయాణించామనే జ్ఞాపకం కోసం అక్కడి వస్తువులను చాలా కాలంగా మీడియా సిబ్బంది తీసుకెళ్లేవారు. ఈ అంశాన్ని ఉద్దేశించి కెల్లీ మాట్లాడుతూ మీరు ఎయిర్ఫోర్స్ వన్లో ప్రయాణించారని ప్రజలు నమ్మాలంటే ఆ వస్తువులను తీసుకెళ్లాల్సిన అవసరం లేదు.. ఆ విమానంలో మీరు ఉన్న చిత్రాన్ని మా సిబ్బంది మీకు మెయిల్ చేస్తారని పేర్కొన్నారు.
చాలా ఏళ్లుగా ఇలానే..
గతంలో ఒక సారి ఎయిర్ఫోర్స్ వన్ విమానంలో మీడియా కరస్పాండెంట్లకు డిన్నర్ ఏర్పాటు చేశారు. దీనిలో బంగారం పూత పూసిన పింగాణీ ప్లేట్లను వాడారు. అనంతరం ఆండ్రూస్ జాయింట్ ఎయిర్ బేస్లో విమానం ఆగిన తర్వాత కొందరు కరస్పాండెంట్ల బ్యాక్ప్యాక్ల నుంచి పింగాణీ వస్తువుల చప్పుళ్లు వినిపించాయని ఓ ప్రముఖ పత్రిక ప్రతినిధే స్వయంగా తెలిపారు.
వస్తువులు వాపస్ చేసిన వ్యక్తి..
ఇటీవల ఫిబ్రవరి 5వ తేదీన శ్వేతసౌధం ట్రావెల్ ఆఫీస్ ఎయిర్ఫోర్స్ వన్లో కొంత సామగ్రి కనిపించడంలేదని గుర్తించింది. వీటిల్లో ఓ పిల్లోకేస్ కూడా ఉంది. దీంతో సిబ్బంది ఆ సమయంలో అధ్యక్షుడి పర్యటనకు వెళ్లిన మీడియా ప్రతినిధులకు ఒక ఈమెయిల్ పంపారు. ఎవరి లగేజీలో అయినా పొరబాటున విమానంలోని వస్తువులు కలిసిపోతే.. వాటిని ఎవరికీ తెలియకుండా తిరిగి ఇచ్చేందుకు సాయం చేస్తామని దానిలో పేర్కొన్నారు. దీంతో ఒకరు ఆ పిల్లోకేస్ను సైలెంట్గా తీసుకెళ్లి పెన్సిల్వేనియా అవెన్యూ సమీపంలోని ఆండ్రూ జాక్సన్ విగ్రహం వద్ద సిబ్బందికి అప్పగించారు. ఈ ఘటనపై శ్వేతసౌధం అధికారులు మాట్లాడుతూ మీడియా సిబ్బందిని ఇబ్బంది పెట్టడం తమ ఉద్దేశం కాదని.. ఆ తస్కరణలు ఆపటమే లక్ష్యమని వెల్లడించారు.
అది ఎగిరే శ్వేతసౌధం..
పాక్షిక నీలివర్ణంలోని అమెరికా అధ్యక్ష విమానం అంటే ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన ఆసక్తి ఉంటుంది. దీనిని ఎగిరే శ్వేతసౌధంగా అభివర్ణిస్తారు. ఇందులో అత్యాధునిక రక్షణ వ్యవస్థలు ఉంటాయి. సీక్రెట్ సర్వీస్ సిబ్బంది ఎప్పుడూ కంటికి రెప్పలా కాపాడుతుంటారు. అణ్వస్త్ర పేలుడు కారణంగా వచ్చే కొన్ని రకాల తరంగాలను కూడా ఇది తట్టుకోగలదు. శత్రుదేశ క్షిపణులను గుర్తించి.. వాటిని తప్పుదోవ పట్టించే రాడార్లు కూడా దీనిలో ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మూసేవాలా హత్యకేసు నిందితుడు గోల్డీబ్రార్ మృతి
ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన నిందితుడు గ్యాంగ్స్టర్ గోల్డీబ్రార్ను కొందరు దుండగులు కాల్చి చంపారు. -
చందమామ ఆవలి భాగం నుంచి నమూనాల సేకరణ!
చంద్రుడి ఆవలి భాగం నుంచి నమూనాలు సేకరించడానికి చాంగే-6 వ్యోమనౌకను శుక్రవారం ప్రయోగించనున్నట్లు చైనా ప్రకటించింది. ఇలాంటి ప్రయోగాన్ని చేపట్టడం మానవాళి చరిత్రలో ఇదే మొదటిసారని తెలిపింది. -
క్యాన్సర్ బాధితుడికి రూ.10వేల కోట్ల లాటరీ
క్యాన్సర్తో పోరాడుతున్న ఓ వ్యక్తిని అదృష్టం వరించింది. పవర్బాల్ లాటరీ గేమ్లో ఆయన ఏకంగా 1.3 బిలియన్ డాలర్లను గెలుచుకున్నారు. -
చైనాలో కోతకుగురై కూలిన రోడ్డు.. 24 మంది మృతి
దక్షిణ చైనాలోని గ్వాంగ్డాంగ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా ఓ రహదారి 18 మీటర్ల మేర కోతకుగురై కూలిపోయింది. -
కొలంబియా వర్సిటీలోకి పోలీసులు
అమెరికాలో గాజా ఆందోళనలకు కేంద్ర బిందువైన న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీలోకి మంగళవారం రాత్రి పోలీసులు భారీ సంఖ్యలో ప్రవేశించారు. -
ఆరోగ్యకర జీవనశైలితో ‘అర్ధాయుష్షు జన్యువుల’కు కళ్లెం
ఆరోగ్యకర జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారా.. ఆయుర్దాయాన్ని తగ్గించే జన్యువుల ప్రభావాన్ని 60 శాతానికిపైగా నిలువరించొచ్చని తాజా పరిశోధనలో తేలింది. -
అధిక రక్తపోటుకు జన్యుమూలాల గుర్తింపు
మానవ జన్యుపటంలోని 2వేలకుపైగా ప్రాంతాలు రక్తపోటును ప్రభావితం చేస్తాయని తాజా పరిశోధన తేల్చింది. -
కృష్ణపదార్థ ఉనికిపై ఆధారాలు
విశ్వంలో అంతుచిక్కని కృష్ణపదార్థ ఆచూకీపై శాస్త్రవేత్తలు కీలక ఆవిష్కరణ చేశారు. గెలాక్సీల్లో నక్షత్రాలు, గ్యాస్ కదలికల పరిశీలన ద్వారా కృష్ణపదార్థ ఉనికిని సమర్థించే ఆధారాలను గుర్తించారు. -
వాషింగ్టన్ పోస్ట్ కథనంపై వ్యాఖ్యానించం
సిక్కు వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర కేసు దర్యాప్తు నిమిత్తం భారత్తో నిరంతరం కలిసి పనిచేస్తున్నామని అగ్రరాజ్యం అమెరికా తెలిపింది. -
రష్యా క్షిపణి దాడిలో ‘హ్యారీపోటర్ కోట’ ధ్వంసం
ఉక్రెయిన్లోని అత్యంత సుందర భవనాల్లో ఒక దానిని రష్యా తన క్షిపణి దాడిలో ధ్వంసంచేసింది. నల్ల సముద్ర తీరంలోని ఒడెస్సా నగరంలో హ్యారీపోటర్ కోటగా ప్రసిద్ధి చెందిన ఓ విద్యా సంస్థ భవనంపై క్షిపణితో దాడి చేసింది. -
విమానయాన ఉద్గారాలు భారత్లో ఎక్కువే!
విమానయాన రంగం ద్వారా కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను ఎక్కువగా విడుదల చేస్తున్న మొదటి ఐదు వర్ధమాన దేశాల్లో భారత్ కూడా ఉందని నార్వేజియన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధన తేల్చింది. -
గాజా కాల్పుల విరమణపై పీటముడి!
గాజాలో కాల్పుల విరమణకు సంబంధించి పీటముడి పడింది. శాశ్వత కాల్పుల విరమణను మాత్రమే తాము ఆమోదిస్తామని హమాస్ పేర్కొంటుంటే, యుద్ధాన్ని ఆపేదే లేదని, గాజాలోని రఫాపై దండయాత్ర ఖాయమని ఇజ్రాయెల్ అంటోంది. -
ప్రపంచవ్యాప్తంగా నినదించిన కార్మికలోకం
ప్రపంచ కార్మిక దినోత్సవం ‘మే డే’ సందర్భంగా బుధవారం ఆసియా, యూరప్ ఖండాల్లోని పలు నగరాల్లో కార్మికులు ప్రదర్శనలు నిర్వహించారు. -
మద్యం మత్తులో పైలట్.. సర్వీసు నిలిపివేత
అమెరికాలోని డాలస్ నుంచి జపాన్ రాజధాని టోక్యో వెళ్లాల్సిన జపాన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం అనూహ్య కారణంతో నిలిచిపోయింది. -
పాకిస్థాన్లో 5 లక్షల సిమ్ కార్డుల బ్లాక్
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పాకిస్థాన్.. పన్ను ఆదాయాన్ని పెంచుకునేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. -
బ్రిటన్లో భారీగా తగ్గిన డిపెండెంట్ వీసాలు
ఈ ఏడాది ప్రారంభం నుంచి తాము అమలులోకి తీసుకువచ్చిన విదేశీ విద్యార్థుల డిపెండెంట్ వీసాల్లో భారీ తగ్గుదల నమోదైనట్లు బ్రిటన్ ప్రకటించింది. -
ప్రపంచంలోనే అత్యంత ధనిక ‘ఖైదీ’.. సంపద విలువ రూ. 3.60 లక్షల కోట్లు?
క్రిప్టో కరెన్సీ సంస్థ బినాన్స్ వ్యవస్థాపకుడు చాంగ్ జావో ప్రపంచంలోనే అత్యంత ధనిక ఖైదీగా నిలిచారు.