Libya: లిబియా ప్రధాని నివాసంపై రాకెట్‌ గ్రనేడ్‌ దాడి

Libya: లిబియాలో ఎన్నికల నిర్వహణ జరిగే వరకు అధికారం నుంచి తప్పుకొనేది లేదని ప్రధాని తేల్చి చెప్పారు. ఈ తరుణంలో ఆయన నివాసంపై ఆదివారం గ్రనేడ్‌ దాడి జరిగింది.

Published : 01 Apr 2024 08:05 IST

ట్రిపోలి: లిబియా (Libya) ప్రధానమంత్రి అబ్దుల్ హమీద్ అల్-దబేబా నివాసంపై ఆదివారం రాకెట్‌ గ్రనేడ్ దాడి జరిగింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని ఓ మంత్రి వెల్లడించారు. భవనం స్వల్పంగా ధ్వంసమైనట్లు చెప్పారు. ప్రధాని ఇంటికి సమీపంలో పెద్ద పేలుడు శబ్దాలు వినిపించినట్లు పరిసర ప్రాంతాల్లో ఉన్న పౌరులు చెప్పినట్లు రాయిటార్స్‌ తెలిపింది. వెంటనే పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.

2011 నుంచి లిబియాలో (Libya) శాంతిభద్రతల సమస్యలు కొనసాగుతున్నాయి. పాలనపై పట్టుకోసం 2014లో తూర్పు, పశ్చిమ కింద వైరి వర్గాలు ఏర్పడి ఎవరికి వారు సొంతంగా పాలనను కొనసాగిస్తున్నాయి. 2021లో అబ్దుల్ హమీద్ అల్-దబేబా నేతృత్వంలోని నేషనల్‌ యూనిటీ ప్రభుత్వాన్ని ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసింది. కానీ, ఆ ఏడాది చివరికల్లా తూర్పు ప్రాంతంలోని పార్లమెంట్‌ దీన్ని అధికారికంగా గుర్తించడానికి నిరాకరించింది. జాతీయ స్థాయి ఎన్నికల నిర్వహణకు చేసిన ప్రయత్నం ఫలించకపోవడమే దీనికి కారణం. దీంతో అప్పటి నుంచి రాజకీయ అస్థిరత కొనసాగుతోంది.

సుదీర్ఘకాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఎన్నికల నిర్వహణను సజావుగా చేపట్టేలా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని దేశంలోని ముగ్గురు కీలక నేతలు మార్చి ఆరంభంలో అంగీకరించారు. కానీ, ప్రధాని మాత్రం ఎన్నికలు జరిగే వరకు పదవి నుంచి తప్పుకునేది లేదని తేల్చి చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని