Maldives: చైనా అనుకూలుడికే ‘మాల్దీవులు’ పట్టం.. భారత్తో దౌత్యం జరిపేనా!
చైనా అనుకూలుడిగా పేరున్న మహమ్మద్ ముయిజ్జు (Mohamed Muizzu) పార్టీ పార్లమెంటరీ ఎన్నికల్లో విజయం సాధించింది.
ఇంటర్నెట్ డెస్క్: మాల్దీవుల (Maldives) పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (PNC) భారీ మెజార్టీతో విజయం సాధించింది. మొత్తం 93 స్థానాలకు గాను 70 సీట్లను కైవసం చేసుకుంది. ముయిజ్జకు అగ్నిపరీక్షగా నిలిచిన ఈ ఎన్నికలను అటు చైనా, ఇటు భారత్లు నిశితంగా పరిశీలించాయి.
మాల్దీవుల పార్లమెంటు (పీపుల్స్ మజ్లీస్)లోని 93 నియోజకవర్గాలకు ఆదివారం పోలింగ్ నిర్వహించారు. మొత్తం 602 బ్యాలెట్ బాక్సులు ఏర్పాటుచేశారు. వీటితోపాటు మూడు విదేశాల్లో (భారత్లోని తిరువనంతపురం, శ్రీలంకలోని కొలంబో, మలేషియాలోని కౌలాలంపూర్) వీటిని ఉంచారు. మొత్తం 2.84 లక్షల ఓటర్లు ఉండగా.. 75 శాతం పోలింగ్ నమోదైంది. ఫలితాల్లో ముయిజ్జుకు చెందిన పీఎన్సీ 70 స్థానాలను గెలుచుకోగా.. దాని మిత్రపక్షాలు మూడుచోట్ల విజయం సాధించాయి. భారత్కు అనుకూలంగా ఉండే మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం మహహ్మద్ సోలికి చెందిన మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ (MDP) 15 సీట్లకే పరిమితమైంది. ఈ పార్టీ గతంలో 65 స్థానాలను గెలుచుకోవడం గమనార్హం.
చైనా వైపు మొగ్గుచూపు..
మాల్దీవుల్లో చిన్న ద్వీపాలు కలిపి దాదాపు 1,192 ప్రాంతాలున్నాయి. ఇవన్నీ 800 కి.మీ. పరిధిలో విస్తరించి ఉన్నాయి. శ్వేతవర్ణపు బీచ్లు, రిసార్టులతో మెరిసిపోయే ఈ ప్రాంతం.. హిందూ మహాసముద్రంలో భౌగోళిక రాజకీయాలకు వేదికగా మారింది. అయితే, తమ దేశంపై భారత్ ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్న ముయిజ్జు.. చైనాతో ఆర్థిక సహకారాన్ని పెంపొందించుకునేందుకు కృషి చేశారు. మూడు నెలల క్రితం చైనాలో పర్యటించి.. అధ్యక్షుడు జిన్పింగ్తో కలిసి రక్షణ సహకారం, ఇతర అభివృద్ధి ప్రాజెక్టుల ఒప్పందాలపై సంతకాలు చేశారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి డ్రాగన్ కంపెనీలకే ముఖ్యమైన కాంట్రాక్టులు కట్టబెట్టారు.
భారత్కు డెడ్లైన్..
‘చిన్న దేశమైనంత మాత్రాన.. మమ్మల్ని వేధించేందుకు లైసెన్సు ఇవ్వలేదంటూ’ భారత్ను ఉద్దేశిస్తూ (India Maldives Conflict) ముయిజ్జు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో భారత్కు చెందిన సైన్యం తిరిగి వెళ్లిపోవాలని డెడ్లైన్ విధించారు. ఈక్రమంలో భారత బలగాలు వెనక్కి వచ్చేశాయి. అధ్యక్షుడి ఈ చర్యలపై సొంత దేశంలోనే విమర్శలు వచ్చాయి. చివరకు మాటమార్చిన ఆయన భారత్ ఆర్థికసాయం తమకెంతో ముఖ్యమని చెప్పారు.
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
భారత్ వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న ముయిజ్జును విపక్ష ‘ఎండీపీ’ కట్టడి చేసేందుకు యత్నించింది. ముఖ్యంగా భారత సైన్యాన్ని వెనక్కి పంపించివేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. 2018 నుంచి అవినీతి జరిగిందని ఆరోపిస్తూ వచ్చిన ఓ నివేదికపై దర్యాప్తు జరపడంతోపాటు అధ్యక్షుడిపై అభిశంసన చేపట్టాలని డిమాండ్ చేసింది. అయినప్పటికీ భారత్ వ్యతిరేక నినాదంతో ఎన్నికల్లోకి వెళ్లిన మహమ్మద్కే అక్కడి ప్రజలు పట్టం కట్టారు.
మొన్నటివరకు సంకీర్ణ ప్రభుత్వంలో ఉండటంతో మహమ్మద్ ముయిజ్జు ఆటలు సాగలేదు. అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ పార్టీ బలం తక్కువగా ఉండటంతో అక్కడి పార్లమెంటులో సొంత నిర్ణయాలు తీసుకోలేకపోయారు. తాజా పార్లమెంటరీ ఎన్నికల్లో మాత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. దీంతో ఆయనకు నచ్చిన విధానాలను రూపొందించుకునేందుకు మార్గం సుగమమైనట్లు విశ్లేషకుల అంచనా. ఈ క్రమంలో భారత్తోనూ ముయిజ్జు దౌత్యపరంగా ఎటువంటి వ్యూహాలు అనుసరిస్తారనే విషయాన్ని చూడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారు
డెమోక్రటిక్ పార్టీ నుంచి అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారయ్యారు. -
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారు
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి