Maldives: చైనా అనుకూలుడికే ‘మాల్దీవులు’ పట్టం.. భారత్తో దౌత్యం జరిపేనా!
చైనా అనుకూలుడిగా పేరున్న మహమ్మద్ ముయిజ్జు (Mohamed Muizzu) పార్టీ పార్లమెంటరీ ఎన్నికల్లో విజయం సాధించింది.
ఇంటర్నెట్ డెస్క్: మాల్దీవుల (Maldives) పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (PNC) భారీ మెజార్టీతో విజయం సాధించింది. మొత్తం 93 స్థానాలకు గాను 70 సీట్లను కైవసం చేసుకుంది. ముయిజ్జకు అగ్నిపరీక్షగా నిలిచిన ఈ ఎన్నికలను అటు చైనా, ఇటు భారత్లు నిశితంగా పరిశీలించాయి.
మాల్దీవుల పార్లమెంటు (పీపుల్స్ మజ్లీస్)లోని 93 నియోజకవర్గాలకు ఆదివారం పోలింగ్ నిర్వహించారు. మొత్తం 602 బ్యాలెట్ బాక్సులు ఏర్పాటుచేశారు. వీటితోపాటు మూడు విదేశాల్లో (భారత్లోని తిరువనంతపురం, శ్రీలంకలోని కొలంబో, మలేషియాలోని కౌలాలంపూర్) వీటిని ఉంచారు. మొత్తం 2.84 లక్షల ఓటర్లు ఉండగా.. 75 శాతం పోలింగ్ నమోదైంది. ఫలితాల్లో ముయిజ్జుకు చెందిన పీఎన్సీ 70 స్థానాలను గెలుచుకోగా.. దాని మిత్రపక్షాలు మూడుచోట్ల విజయం సాధించాయి. భారత్కు అనుకూలంగా ఉండే మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం మహహ్మద్ సోలికి చెందిన మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ (MDP) 15 సీట్లకే పరిమితమైంది. ఈ పార్టీ గతంలో 65 స్థానాలను గెలుచుకోవడం గమనార్హం.
చైనా వైపు మొగ్గుచూపు..
మాల్దీవుల్లో చిన్న ద్వీపాలు కలిపి దాదాపు 1,192 ప్రాంతాలున్నాయి. ఇవన్నీ 800 కి.మీ. పరిధిలో విస్తరించి ఉన్నాయి. శ్వేతవర్ణపు బీచ్లు, రిసార్టులతో మెరిసిపోయే ఈ ప్రాంతం.. హిందూ మహాసముద్రంలో భౌగోళిక రాజకీయాలకు వేదికగా మారింది. అయితే, తమ దేశంపై భారత్ ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్న ముయిజ్జు.. చైనాతో ఆర్థిక సహకారాన్ని పెంపొందించుకునేందుకు కృషి చేశారు. మూడు నెలల క్రితం చైనాలో పర్యటించి.. అధ్యక్షుడు జిన్పింగ్తో కలిసి రక్షణ సహకారం, ఇతర అభివృద్ధి ప్రాజెక్టుల ఒప్పందాలపై సంతకాలు చేశారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి డ్రాగన్ కంపెనీలకే ముఖ్యమైన కాంట్రాక్టులు కట్టబెట్టారు.
భారత్కు డెడ్లైన్..
‘చిన్న దేశమైనంత మాత్రాన.. మమ్మల్ని వేధించేందుకు లైసెన్సు ఇవ్వలేదంటూ’ భారత్ను ఉద్దేశిస్తూ (India Maldives Conflict) ముయిజ్జు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో భారత్కు చెందిన సైన్యం తిరిగి వెళ్లిపోవాలని డెడ్లైన్ విధించారు. ఈక్రమంలో భారత బలగాలు వెనక్కి వచ్చేశాయి. అధ్యక్షుడి ఈ చర్యలపై సొంత దేశంలోనే విమర్శలు వచ్చాయి. చివరకు మాటమార్చిన ఆయన భారత్ ఆర్థికసాయం తమకెంతో ముఖ్యమని చెప్పారు.
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
భారత్ వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న ముయిజ్జును విపక్ష ‘ఎండీపీ’ కట్టడి చేసేందుకు యత్నించింది. ముఖ్యంగా భారత సైన్యాన్ని వెనక్కి పంపించివేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. 2018 నుంచి అవినీతి జరిగిందని ఆరోపిస్తూ వచ్చిన ఓ నివేదికపై దర్యాప్తు జరపడంతోపాటు అధ్యక్షుడిపై అభిశంసన చేపట్టాలని డిమాండ్ చేసింది. అయినప్పటికీ భారత్ వ్యతిరేక నినాదంతో ఎన్నికల్లోకి వెళ్లిన మహమ్మద్కే అక్కడి ప్రజలు పట్టం కట్టారు.
మొన్నటివరకు సంకీర్ణ ప్రభుత్వంలో ఉండటంతో మహమ్మద్ ముయిజ్జు ఆటలు సాగలేదు. అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ పార్టీ బలం తక్కువగా ఉండటంతో అక్కడి పార్లమెంటులో సొంత నిర్ణయాలు తీసుకోలేకపోయారు. తాజా పార్లమెంటరీ ఎన్నికల్లో మాత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. దీంతో ఆయనకు నచ్చిన విధానాలను రూపొందించుకునేందుకు మార్గం సుగమమైనట్లు విశ్లేషకుల అంచనా. ఈ క్రమంలో భారత్తోనూ ముయిజ్జు దౌత్యపరంగా ఎటువంటి వ్యూహాలు అనుసరిస్తారనే విషయాన్ని చూడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉగ్రదాడులకు కుట్ర.. ఉక్రెయిన్ ‘ఏజెంట్’ను చంపిన రష్యా
Russia: ఉక్రెయిన్కు సాయం చేస్తున్నాడనన్న ఆరోపణలతో ఓ ‘ఏజెంట్’ను రష్యా హతమార్చింది. ఈ విషయాన్ని ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది. -
China: చంద్ర శిలల సేకరణకు బయల్దేరిన చైనా..!
జాబిల్లిపై ఖనిజాల గుట్టు విప్పేందుకు చైనా ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీనిలోభాగంగా చాంగే-6ను నేడు ప్రయోగించింది. -
ఘోర బస్సు ప్రమాదం.. పాక్లో 20 మంది దుర్మరణం
హైవేపై బస్సు అదుపుతప్పి లోయలో పడిన ఘటనలో 20 మంది దుర్మరణం చెందిన ఘటన పాకిస్థాన్లో చోటుచేసుకుంది. -
ఉక్రెయిన్పై రష్యా ‘క్లోరోపిక్రిన్’ ప్రయోగం? ఏంటీ ఆయుధం?
Ukraine-Russia Conflict: ఉక్రెయిన్పై యుద్ధంలో పైచేయి సాధించడం కోసం రష్యా రసాయన ఆయుధాలు వాడుతోందని అమెరికా ఆరోపించింది. -
భారత్పై బైడెన్కు అమితమైన గౌరవం: శ్వేతసౌధం
Biden: విదేశీయులను ఆహ్వానించడమంటే భారత్కు భయమంటూ అమెరికా అధ్యక్షుడు బైడెన్ చేసిన వ్యాఖ్యలపై శ్వేతసౌధం వివరణ ఇచ్చింది. -
విదేశీ వలసదారులంటే భారత్కు భయం
విదేశీ వలసదారులను తమ దేశంలోకి అనుమతించేందుకు భారత్ భయపడుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. చైనా, రష్యా, జపాన్లదీ అదే పరిస్థితి అని పేర్కొన్నారు. -
రణరంగంగా యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా
న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీలో పాలస్తీనా అనుకూల ప్రదర్శనకారులను ఖాళీ చేయించిన పోలీసులు గురువారం యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ఏంజెలిస్ (యూసీఎల్ఏ)లోకి ప్రవేశించారు. -
లావుగా ఉన్నాడని బలవంతంగా ట్రెడ్మిల్ వ్యాయామం.. అమెరికాలో ఆరేళ్ల బాలుడి మృతి
కుమారుడు లావుగా ఉన్నాడని భావించిన ఓ వ్యక్తి ట్రెడ్మిల్పై బలవంతంగా పరిగెత్తించి అతడి మరణానికి కారణమయ్యాడు. -
యూఏఈలో మళ్లీ భారీవర్షాలు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)ను మళ్లీ భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో ఇప్పటికే పలు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. -
గోల్డీబ్రార్ బతికే ఉన్నాడు
భారత్కు చెందిన గ్యాంగ్స్టర్ గోల్డీబ్రార్ అమెరికాలోని కాలిఫోర్నియాలో హత్యకు గురయ్యాడన్న ప్రచారాన్ని అక్కడి పోలీసులు ఖండించారు. -
ఒడెస్సాపై మళ్లీ క్షిపణి దాడి.. 14 మందికి గాయాలు
దక్షిణ ఉక్రెయిన్లోని ఒడెస్సా ఓడ రేవు పట్టణంపై మళ్లీ రష్యా క్షిపణులు ప్రయోగించింది. వారంలో ఈ నగరంపై ఇది మూడో దాడి. -
కిమ్ ఆనందానికి ఏటా 25 మంది కన్యలు
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. -
22.6 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి లేజర్ సందేశం
అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా నిర్వహించిన ఒక ప్రయోగంలో భాగంగా.. సుదూర విశ్వం నుంచి ఒక లేజర్ సంకేతం భూమికి చేరింది. అది సుమారు 22.6 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చింది. -
చైనా రోడ్డు ప్రమాదంలో 48కి చేరిన మృతులు
దక్షిణ చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లో రహదారి కోతకు గురై 24 వాహనాలు లోయలో పడిన ఘటనలో మరణించిన వారి సంఖ్య గురువారం 48కి చేరుకుంది. -
విశ్వం అంచుల్లో గురుత్వాకర్షణ శక్తి బలహీనం ఇందుకే..
విస్తరిస్తున్న విశ్వం అంచుల్లోని ‘కాస్మిక్ గ్లిచ్’ గుట్టు విప్పే సరికొత్త నమూనాను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. కెనడాలోని వాటర్లూ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ ఘనత సాధించారు. -
శక్స్గావ్ లోయలో చైనా నిర్మాణాలు.. తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసిన భారత్
పాక్ ఆక్రమిత కశ్మీర్లో(పీఓకే)ని శక్స్గావ్ లోయలో చైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. -
బోయింగ్ విమానాల ప్రజావేగు మృతి.. 2 నెలల వ్యవధిలో రెండో ఘటన
ప్రముఖ విమానాల తయారీ సంస్థ బోయింగ్కు చెందిన 737 మ్యాక్స్ విమానాల్లో లోపాలు ఉన్నాయని బయటపెట్టిన విజిల్ బ్లోయర్ (ప్రజావేగు) జాషువా డీన్(45) మరణించారు. -
కాంగోలో కొత్తరకం ఎంపాక్స్
దేశ చరిత్రలోనే అత్యంత భారీ ఎంపాక్స్ విజృంభణను కట్టడి చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్న కాంగో నెత్తిన మరో పిడుగు పడింది. -
యుద్ధాన్ని పూర్తిగా ఆపితేనే సంతకం
గాజా కాల్పుల విరమణకు సంబంధించి అమెరికా, ఇతర మధ్యవర్తుల తాజా ప్రతిపాదనను హమాస్ తీవ్రంగా పరిశీలిస్తోంది. -
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ను సంతోష పెట్టడానికి ఏటా 25 మంది యువతులతో కూడిన బృందం పని చేస్తుందని తాజా కథనం వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఘట్కేసర్లో దారుణం.. ఆస్తికోసం భర్తను గొలుసులతో బంధించి చిత్రహింసలు
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘అప్రమత్తంగా ఉండండి’ : ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
-
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు
-
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!