Mehul Choksi: భారత్కు రాకుండా.. ఆంటిగ్వా పోలీసులు, జడ్జీకి ఛోక్సీ లంచాలు..!
తన అప్పగింతను ఆలస్యం చేసేందుకు మెహుల్ ఛోక్సీ (Mehul Choksi) ఆంటిగ్వాలో కుట్రలు పన్నుతున్నట్లు తాజాగా బయటపడింది. ఇందుకోసం ఆయన అక్కడి పోలీసులు, జడ్జీకి లంచాలు ఇచ్చినట్లు ఓ ఇన్వెస్టిగేటర్ సంచలన విషయాలను వెల్లడించారు.
ఇంటర్నెట్ డెస్క్: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కుంభకోణం ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ (Mehul Choksi) భారత్కు రాకుండా ఉండేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆంటిగ్వా (Antigua)లో ఉన్న ఛోక్సీ.. తన అప్పగింత కేసును ఆలస్యం చేసేందుకు ఆ దేశ పోలీసులకు లంచాలను ఇస్తున్నట్లు తాజాగా బయటపడింది. ఆర్థిక నేరాలను విశ్లేషించే ప్రముఖ ఇన్వెస్టిగేటర్ కెన్నెత్ రిజాక్.. ఛోక్సీ కుట్రల గురించి సంచలన విషయాలు వెల్లడించారు.
పీఎన్బీ కుంభకోణం కేసులో ఛోక్సీని అప్పగించేందుకు ఆంటిగ్వాలో భారత్ పిటిషన్లు దాఖలు చేసింది. ఈ పిటిషన్లపై కోర్టు విచారణలను ఆలస్యం చేసేందుకు ఛోక్సీ కుట్రలు పన్నుతున్నారని రిజాక్ తన బ్లాగ్లో పేర్కొన్నారు. ఆంటిగ్వా సీనియర్ పోలీసు అధికారి సహా కొంతమంది ప్రభుత్వ అధికారులకు ఆయన లంచాలు ఇస్తున్నట్లు తెలిపారు. సీనియర్ ఇన్స్పెక్టర్ హెన్రీని ఛోక్సీ తన రెస్టారెంట్లో పలుమార్లు రహస్యంగా కలిసినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు చెప్పారని పేర్కొన్నారు. పోలీసులతో పాటు ఆంటిగ్వా మెజిస్ట్రేట్ కాన్లిఫి క్లేర్క్కు కూడా ఛోక్సీ లంచాలు ఇచ్చినట్లు రిజాక్ వెల్లడించారు. వీరిద్దరూ కలిసి కేసు విచారణను ఆలస్యంగా చేస్తున్నారని తెలిపారు. అంతేగాక, ఛోక్సీ (Mehul Choksi)ని భారత్ అప్పగించేందుకు ఇంటర్పోల్ చేస్తున్న ప్రయత్నాల్లో హెన్రీ, క్లేర్క్ జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు.
‘అదృశ్యం’ కూడా నాటకమే..
ఈ సందర్భంగా 2021 నాటి ఛోక్సీ ‘అదృశ్యం’ ఘటనకు సంబంధించి కూడా అనేక విషయాలను రిజాక్ తన బ్లాగ్లో వెల్లడించారు. క్యూబాకు పారిపోయేందుకు ఛోక్సీ ప్రయత్నించాడని, అది విఫలమవడంతోనే ‘కిడ్నాప్’ నాటకం ఆడినట్లు తెలిపారు. అందుకు సాక్ష్యాలు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. ‘‘భారత్, క్యూబా మధ్య ఖైదీల అప్పగింత ఒప్పందం లేదు. అందుకే 2021 మే నెలలో ఛోక్సీ (Mehul Choksi) ఆ దేశానికి పారిపోవాలనుకున్నాడు. ఇందుకోసం ఓ స్మగ్లర్ల బృందంతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే, ఒప్పందం ప్రకారం మాట్లాడుకున్న మొత్తాన్ని చెల్లించేందుకు అతడు నిరాకరించాడు. దీంతో ఆ బృందం ఛోక్సీని డొమినికా తీరంలో దించేసి వెళ్లిపోయింది. ఆ తర్వాత డొమినికా పోలీసులు పట్టుకోవడంతో కిడ్నాప్ నాటకం తెరపైకి తెచ్చాడు’’ అని రిజాక్ వివరించారు.
రూ. 13,500 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం (PNB Scam) కేసులో ఛోక్సీ, ఆయన మేనల్లుడు నీరవ్ మోదీ ప్రధాన నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కుంభకోణం బయటకు రాకముందే ఆంటిగ్వా పారిపోయిన ఛోక్సీ.. అక్కడి పౌరసత్వాన్ని వినియోగించుకొని నివసిస్తున్నాడు. అయితే 2021 మే నెలలో ఆంటిగ్వా నుంచి అకస్మాత్తుగా అదృశ్యమైన అతడు.. ఆ తర్వాత రెండు రోజులకు పక్కనే ఉన్న డొమినికాలో పోలీసులకు చిక్కాడు. ఛోక్సీని బలవంతంగా కిడ్నాప్ చేసి డొమినికా తీసుకెళ్లారని ఆయన తరఫు న్యాయవాదులు ఆరోపించారు. ఆ సమయంలో ఛోక్సీని భారత్కు రప్పించేందుకు ప్రయత్నాలు జరిగినప్పటికీ అవి ఫలించలేదు. కిడ్నాప్ కేసులో విచారణ జరిపిన డొమినికా.. అనారోగ్య కారణాల రీత్యా అతడికి బెయిల్ మంజూరు చేస్తూ తిరిగి ఆంటిగ్వా వెళ్లేందుకు అనుమతినిచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ.. అధికారికంగా ప్రకటించిన కమలా హారిస్
డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి కమలాహారిస్ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. -
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల