Trump: ట్రంప్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాల పునరుద్ధరణ
క్యాపిటల్ హిల్పై దాడి సందర్భంలో ట్రంప్ సామాజిక మాధ్యమ ఖాతాలను నిషేధించిన విషయం తెలిసిందే. వాటిని తాజాగా ఒక్కొక్కటిగా ఆయా సంస్థలు పునరుద్ధరిస్తున్నాయి.
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) ఫేస్బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) ఖాతాలను పునరుద్ధరిస్తున్నట్లు మెటా (Meta) ప్లాట్ఫామ్స్ బుధవారం ప్రకటించింది. 2020 ఆఖర్లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ (Trump) ఓటమిపాలైన విషయం తెలిసిందే. దీన్ని జీర్ణించుకోలేని ఆయన మద్దతుదారులు 2021, జనవరి 6న క్యాపిటల్ హిల్పై దాడికి దిగారు. ఆ సమయంలో సామాజిక మాధ్యమాల వేదికగా ట్రంప్ (Trump) చేసిన ప్రకటనలే ఈ దాడికి పురిగొల్పాయన్న ఆరోపణలు వచ్చాయి. ఆయన నుంచి మరిన్ని సందేశాలు వెలువడితే పరిస్థితి మరింత దిగజారొచ్చన్న అనుమానంతో అప్పట్లో ట్రంప్ సామాజిక ఖాతాలను కంపెనీ నిషేధించింది. ఇటీవలే ట్విటర్ సైతం ఆయన ఖాతాను పునరుద్ధరించింది.
‘‘ఖాతాల నిషేధం అసాధారణ పరిస్థితుల్లో తీసుకున్న నిర్ణయం. రాజకీయ నాయకులు ఏం చెబుతున్నారో ప్రజలకు తెలియాలి’’ అని మెటా అంతర్జాతీయ వ్యవహారాలను పర్యవేక్షించే విభాగాధిపతి నిక్ క్లెగ్ అన్నారు. తద్వారా ఆ సమాచారం ఆధారంగా వారు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. 2024లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల బరిలో తానూ ఉంటానని ట్రంప్ (Trump) ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.
తమ కొత్త కంటెంట్ విధానం ప్రకారం.. ట్రంప్ చేసిన ఏదైనా సందేశం హానికారకమైనదని మెటా నిర్ణయించి.. అయినా, ప్రజలకు దాన్ని తెలుసుకోవడంపై ఆసక్తి ఉందని భావిస్తే దాన్ని ఆయన ఖాతాపై అలాగే కొనసాగిస్తామని క్లెగ్ తెలిపారు. కానీ, దాన్ని ఇతరులు షేర్ చేసేందుకు మాత్రం అనుమతించబోమని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ గళాన్ని వినిపించే అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. వారు చెప్పే సమాచారంలో వాస్తవం లేకపోయినా మాట్లాడే అవకాశం ఉండాలని తాము భావిస్తున్నట్లు చెప్పారు. అయితే, తప్పులు పునరావృతం కాకుండా స్పష్టమైన కట్టుదిట్టాలను ఏర్పాటు చేశామన్నారు.
ట్రంప్ ఖాతాను నిషేధించే నాటికి ఆయనకు ఫేస్బుక్లో 34 మిలియన్లు, ఇన్స్టాగ్రామ్లో 23 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక మాధ్యమ వేదిక ఫేస్బుక్. ఇది ట్రంప్ ఎన్నికల ప్రచారం కార్యక్రమాలకు కావాల్సిన నిధుల సేకరణలోనూ కీలక పాత్ర పోషించింది. తాజా మెటా నిర్ణయంపై ట్రంప్ స్పందించారు. ‘‘మీ ప్రియమైన అధ్యక్షుణ్ని నిషేధించడం ద్వారా బిలియన్ల డాలర్ల విలువను కోల్పోయిన ఫేస్బుక్ తాజాగా నా ఖాతాను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. ఒక సిట్టింగ్ అధ్యక్షుడిపై ఇలాంటి చర్యలకు మరోసారి దిగొద్దు. ఇంకెవరికీ ఇలా జరగొద్దు’’ అని ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమమైన ‘ట్రుత్ సోషల్’లో రాసుకొచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా భార్యకు ఏదైనా జరిగితే.. పాక్ ఆర్మీ చీఫ్కు ఇమ్రాన్ఖాన్ వార్నింగ్
Imran Khan: తన భార్య అవినీతి కేసులో అరెస్టు కావడం, దోషిగా తేలి శిక్ష అనుభవించడానికి పాక్ ఆర్మీ చీఫే కారణమని ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. -
ఐరాసలో భారత్కు వీటో అధికారం.. మస్క్ ప్రతిపాదనపై అమెరికా స్పందనిదే..
UNSC: ఐరాసలో సంస్కరణలకు తమ మద్దతు ఉంటుందని అమెరికా పునరుద్ఘాటించింది. భారత్కు శాశ్వత సభ్యత్వం ఉండాలన్న మస్క్ ప్రతిపాదనపై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. -
అధిక సమయం ఆన్లైన్లో ఉంటే.. పిల్లలు బడికి గైర్హాజరయ్యే ముప్పు అధికం
తగినంత నిద్ర, వ్యాయామం, తినడం వంటివి తగ్గించి పిల్లలు అధిక సమయం ఆన్లైన్లో ఉంటే పాఠశాలలకు గైర్హాజరయ్యే ముప్పు పెరుగు తుందని ఫిన్లాండ్లో నిర్వహించిన తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. -
జపాన్ బుల్లెట్ రైల్లో చొరబడ్డ పాము
జపాన్ బుల్లెట్ రైళ్లు కచ్చితత్వానికి పెట్టింది పేరు. ఆలస్యం మాట పక్కనపెడితే నిర్దేశించిన సమయం కంటే ముందే గమ్యస్థానాలు చేరిన చరిత్రా ఉంది. -
జైలు నుంచి గృహ నిర్బంధానికి ఆంగ్ సాన్ సూకీ
మయన్మార్ కీలక నేత, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్ సాన్ సూకీని ఆ దేశ సైనిక ప్రభుత్వం జైలు నుంచి గృహ నిర్బంధానికి మార్చింది. -
సోషల్ మీడియా వెర్రి ముదిరి సంకెళ్లు
సామాజిక మాధ్యమాల్లో పేరు కోసం కొంతమంది చేసే పనులు ప్రాణాంతకంగా మారుతున్నాయి. -
ఇజ్రాయెల్ దాడి చేయడం ఖాయం
ఇరాన్పై ప్రతీకార దాడి ఎప్పుడు.. ఎలా చేయాలనే అంశంపై తమ దేశమే నిర్ణయం తీసుకుంటుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. -
భారీ వర్షాలతో దుబాయ్ అతలాకుతలం
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయ్ భారీ వర్షాలతో అతలాకుతలం అయ్యింది. -
రష్యా క్షిపణి దాడిలో 17 మంది మృతి
ఉక్రెయిన్లో పౌర నివాసాలపై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం చెర్నివ్ నగరంపై మాస్కో క్షిపణులు ప్రయోగించింది. -
మొక్కల సెన్సర్లతో రైతులకు ముందస్తు హెచ్చరికలు
మొక్కలకు ఎదురవుతున్న ముప్పును చాలా త్వరగా పసిగట్టి, రైతులను అప్రమత్తం చేసే సెన్సర్లను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. -
న్యూయార్క్లో కాల్పుల కలకలం: ఒకరి మృతి
అమెరికాలోని న్యూయార్క్ నగరం బ్రాంక్స్ కౌంటీలో మంగళవారం సాయంత్రం 6 గంటలకు దుండగుల కాల్పులు కలకలం రేపాయి. -
భారత్-పాక్ వివాదాల్లో జోక్యం చేసుకోం: అమెరికా
ఉగ్రవాదులు తమ ఇళ్లలో ఉన్నా అంతం చేసేందుకు భారత్ వెనకాడదని ఇటీవల ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై అమెరికా స్పందించింది. -
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
గాజా యుద్ధంలో భాగంగా కృత్రిమ గర్భధారణ (Vitro fertilisation) కోసం నిల్వ ఉంచిన వేల సంఖ్యలో పిండాలు, వీర్య నమూనాలు దెబ్బతిన్నట్లు వెల్లడైంది.
తాజా వార్తలు (Latest News)
-
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు
-
కేసీఆర్ను బద్నాం చేయాలనే కాఫర్ డ్యామ్ కట్టడంలేదు: కేటీఆర్
-
మల్కాజిగిరిలో భారీ మెజారిటీతో ఈటల గెలుపు: కిషన్రెడ్డి
-
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
-
రాహుల్ స్పూన్ ఫీడింగ్ కిడ్.. సురక్షిత స్థానాలనే ఎంచుకుంటున్నారు: ఆజాద్
-
ఎన్కౌంటర్ల ‘లక్ష్మణ్’.. మావోయిస్టులకు సింగం