militants attack: బస్సులోంచి కిడ్నాప్‌ చేసి.. 9 మందిని చంపిన ఉగ్రవాదులు

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో ఉగ్రవాదులు పేట్రేగిపోయారు.

Updated : 13 Apr 2024 13:13 IST

కరాచీ : పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. నోష్కి (Noshki) జిల్లాలోని హైవేపై కాపు కాసిన కొందరు ముష్కరులు.. క్వెట్టా నుంచి తఫ్తాన్‌కు వెళ్తున్న ఓ బస్సును అడ్డుకున్నారు. అందులోని 9 మంది ప్రయాణికులను కిడ్నాప్‌ చేసి పర్వత ప్రాంతాలకు తీసుకెళ్లారు. దీంతో భయభ్రాంతులకు గురైన ఇతర ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టగా.. ఓ వంతెన సమీపంలో ఆ తొమ్మిది మంది మృతదేహాలు దొరికాయి. మరో ఘటనలో ఇదే రహదారిపై ప్రయాణిస్తున్న కారుపై దుండగులు కాల్పులకు పాల్సడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కాగా ఇప్పటి వరకూ ఏ ఉగ్రసంస్థ ఈ ఘటనలకు బాధ్యత వహించలేదు.

దీనిపై స్పందించిన బలూచిస్థాన్ ముఖ్యమంత్రి మీర్ సర్ఫరాజ్ బుగ్తీ ఈ దుర్ఘటనకు పాల్పడిన ఉగ్రవాదులను క్షమించబోమన్నారు. అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నఖ్వీ స్పందిస్తూ మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని