Malawi: మలావీ ఉపాధ్యక్షుడు ప్రయాణిస్తున్నసైనిక విమానం అదృశ్యం

మలావీ  ఉపాధ్యక్షుడు సౌలస్‌ షిలిమా(51), మరో తొమ్మిది మందిని తీసుకెళుతున్న సైనిక విమానం సోమవారం అదృశ్యమైంది.

Published : 11 Jun 2024 05:18 IST

బ్లాంటైర్‌: మలావీ  ఉపాధ్యక్షుడు సౌలస్‌ షిలిమా(51), మరో తొమ్మిది మందిని తీసుకెళుతున్న సైనిక విమానం సోమవారం అదృశ్యమైంది. రాజధాని లిలోంగ్వే నుంచి బయలుదేరిన ఈ విమానం సుమారు 45 నిమిషాల అనంతరం 370 కిలోమీటర్ల దూరంలోని జుజు అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. అయితే ఎంతసేపైనా ఉపాధ్యక్షుడి విమానం జాడ లేదు. అదే సమయంలో దానికి రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి. మరోవైపు, విమానం గల్లంతైన సంగతి తెలియగానే అధ్యక్షుడు లాజరస్‌ చక్వేరా బహమాస్‌ పర్యటన రద్దు చేసుకున్నారు. విమానం ఆచూకీ కనిపెట్టేందుకు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని