Jaishankar: చైనాది ‘మైండ్ గేమ్’.., రష్యాది పాలనా దక్షత : ఎస్.జైశంకర్
ద్వైపాక్షిక ఫ్రేమ్వర్క్ కింద సమస్యలను తక్కువ చేసి చూపేందుకు చైనా (China) మైండ్గేమ్ ఆడుతుందని విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ పేర్కొన్నారు.
దిల్లీ: ద్వైపాక్షిక సంబంధాల నేపథ్యంలో చైనా వైఖరిపై భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ (S Jaishankar) కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్-చైనా సంబంధాలు సాధారణ స్థితికి చేరుకోవడం, అవి కొనసాగించడమనేది ఇరు దేశాలకు అతిపెద్ద సవాళ్లలో ఒకటిగా మారుతుందన్నారు. తక్షణ సమస్య మాత్రం బీజింగ్ (China) నిబంధనలు పాటించకపోవడమేనని.. అదే తూర్పు లద్దాఖ్లో ఘర్షణకు దారితీస్తోందన్నారు.
ద్వైపాక్షిక ఫ్రేమ్వర్క్ కింద ఈ సమస్యలను తక్కువ చేసి చూపేందుకు చైనా (China) మైండ్గేమ్ ఆడుతుందని విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ పేర్కొన్నారు. భారత్ మాత్రం అంతర్జాతీయ అంశాలను దృష్టిలో ఉంచుకొని వ్యవహరిస్తోందన్నారు. దిల్లీలో జరుగుతోన్న రైసినా డైలాగ్-2024లో మాట్లాడిన ఆయన.. ద్వైపాక్షిక సంబంధాలలో భారత్-చైనాలు సమతుల్యతను కొనసాగిస్తాయా? అన్న ప్రశ్నకు ఈవిధంగా బదులిచ్చారు.
ఆసియా వైపు రష్యా చూపు..
రష్యా (Russia) ఎంతో పాలనా దక్షత కలిగిన శక్తిమంతమైన దేశమని, అది ఆసియా వైపు చూస్తోందని ఎస్.జైశంకర్ పేర్కొన్నారు. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిణామాలు, వాటి పతనంపై మాట్లాడిన ఆయన.. బీజింగ్తో రష్యాకు పెరుగుతోన్న సాన్నిహిత్యంపైనా స్పందించారు. పశ్చిమ దేశాల విధానాలే ఆ రెండు దేశాలను (Russia-China) దగ్గర చేస్తున్నాయని అన్నారు.
‘అపారమైన పాలనా దక్షత కలిగిన దేశం రష్యా. అటువంటి శక్తులు ఉన్న దేశాలు ఒకే కోణంలో సంబంధాలు కొనసాగించవు. ఇది వారి విధానానికి వ్యతిరేకం’ అని జైశంకర్ పేర్కొన్నారు. భిన్న దేశాలతో సత్సంబంధాలు కొనసాగించడం రష్యాకు అనేక ఐచ్ఛికాలను కల్పిస్తుందని భావిస్తున్నానన్నారు. రష్యాతో కలిసి పనిచేయడం ఆసియా దేశాలకు ఎంతో ముఖ్యమన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి..
అగ్రరాజ్యం అమెరికాలో పోలీసుల కర్కశత్వానికి ఫ్రాంక్ టైసన్ (53) అనే ఆఫ్రో-అమెరికన్ ప్రాణాలు కోల్పోయాడు. -
జీవ వైవిధ్యానికి గొడ్డలిపెట్టు కానున్న వాతావరణ మార్పులు
ఈ శతాబ్దం మధ్యనాటికి జీవవైవిధ్యంలో క్షీణతకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమవుతాయని తాజా అధ్యయనం పేర్కొంది. -
కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదన
రఫాపై దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతుందన్న వార్తల నేపథ్యంలో కాల్పుల విరమణ చర్చలు ఊపందుకుంటున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ తమకు ఓ ప్రతిపాదన పంపినట్లు హమాస్ తెలిపింది. -
బ్రెజిల్లోని హోటల్లో అగ్నిప్రమాదం
దక్షిణ బ్రెజిల్లోని పాటో అలెగ్రి నగరంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించేందుకు స్థానిక ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న ఓ హోటల్లో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. -
చిత్రవార్త
-
అమెరికా డ్రోన్ను కూల్చిన హూతీలు
ఎర్రసముద్రం మళ్లీ వేడెక్కింది. హూతీ వేర్పాటువాదులు దూకుడు పెంచారు. బాలిస్టిక్ క్షిపణులతో బాబ్ ఎల్ మండేబ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలను భయపెడుతున్నారు. -
అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే ఓ రేడియో ఇంటర్వ్యూలో తెలిపారు. -
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం
అమెరికాలోని సౌత్ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంతో ప్రయాణిస్తున్న ఎస్యూవీ అదుపు తప్పి పల్టీలు కొట్టిన ఈ దుర్ఘటనలో భారత సంతతికి చెందిన ముగ్గురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. -
కంబోడియా సైనిక స్థావరంలో పేలుడు
కంబోడియాలో ఓ సైనిక స్థావరంలో పేలుడు సంభవించి 20 మంది సైనికులు మృతి చెందారు. చాలా మందికి గాయాలయ్యాయి. -
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఒక దశలో ఒంటరితనాన్ని అనుభవించారట. చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
అన్నకు నచ్చని తమ్ముడి పెళ్లి.. యువతి అమ్మమ్మ ఇంటికి నిప్పుపెట్టిన ప్రబుద్ధుడు
-
ఆసుపత్రికెళ్తే.. విసనకర్ర, కొవ్వొత్తి తీసుకెళ్లాల్సిందే!
-
‘మా అమ్మాయికి కాళ్లే చచ్చుబడ్డాయి.. ఏపీలో వ్యవస్థే చచ్చుబడింది’
-
ఒక్క ఫోటో .. నాలుగేళ్ల కష్టం
-
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..
-
పెళ్లి శుభలేఖపై పెంపుడు శునకాల పేర్లు