Moscow Airports: ఉక్రెయిన్ డ్రోన్ల ఎఫెక్ట్.. మాస్కో ఎయిర్పోర్టుల్లో రాకపోకలు నిలిపివేత
Drone Attack: రష్యాపై ఉక్రెయిన్ మరోసారి డ్రోన్లను ప్రయోగించింది. మాస్కో శివారుల్లో నాలుగు డ్రోన్లను కూల్చేసినట్లు పుతిన్ సైన్యం వెల్లడించింది.
మాస్కో: ఇటీవల కాలంలో రష్యా (Russia)పై వరుసగా డ్రోన్ దాడులు (Drone Attack) జరుగుతున్నాయి. ఉక్రెయిన్ (Ukraine) వైపు నుంచి వస్తోన్న ఈ దాడిని పుతిన్ (Putin) సేనలు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాయి. తాజాగా మాస్కో సమీపంలో, సరిహద్దుల్లోని బ్రియాన్స్క్ ప్రాంతంలోకి మంగళవారం నాలుగు ఉక్రెయిన్ డ్రోన్లు దూసుకురాగా.. రష్యా సైన్యం వాటిని కూల్చేసింది.
ఈ నేపథ్యంలోనే ముందు జాగ్రత్త చర్యగా మాస్కోలోని నాలుగు ప్రధాన ఎయిర్పోర్టు (Moscow Airports)ల్లో విమానాల రాకపోకలను (Flights suspended) అధికారులు నిలిపివేసినట్లు రష్యా అధికారిక మీడియా వెల్లడించింది. ‘‘వుకోవో, షెరిమెటివో, దొమోదెడొవో, జుకోవ్స్కీ ప్రాంతాల్లో గగనతలాన్ని మూసివేశాం. ఈ నాలుగు ఎయిర్పోర్టుల్లో విమానాల ల్యాండింగ్ను అనుమతించట్లేదు. ఇక్కడి నుంచి బయల్దేరే విమానాలు కూడా ఆలస్యం కానున్నాయి’’ అని ఓ అధికారి చెప్పినట్లు సదరు మీడియా కథనం పేర్కొంది. దీంతో దాదాపు 50 విమానాల రాకపోకలపై ఈ ప్రభావం పడింది. మరోవైపు, ఉక్రెయిన్ జరిపిన తాజా డ్రోన్ దాడుల్లో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని రష్యా రక్షణ శాఖ ధ్రువీకరించింది.
మళ్లీ అధికారంలోకి వస్తే భారత ఉత్పత్తులపై అధిక పన్ను విధిస్తా
గత కొద్ది రోజులుగా రష్యా భూభాగాలను లక్ష్యంగా చేసుకుని తరచూ డ్రోన్ దాడులు జరుగుతున్నాయి. గత ఆదివారం కూడా ఉక్రెయిన్కు కెందిన ఓ డ్రోన్ రష్యాలోని కుర్స్క్ ప్రాంతంలో కుప్పకూలింది. ఈ ఘటనలో రైల్వే స్టేషన్ పైకప్పు కూలి ఐదుగురు గాయపడ్డారు. గతవారం మాస్కోలో అధ్యక్ష భవనానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేసింది. కీవ్ ప్రయోగించిన డ్రోన్ను తమ గగనతల రక్షణ వ్యవస్థ కూల్చివేసినట్లు మాస్కో వర్గాలు తెలిపాయి. డ్రోన్ శకలాలు పడి మాస్కో ఎక్స్ పో సెంటర్ కాంప్లెక్స్ భవనం పాక్షికంగా ధ్వంసమైనట్లు పేర్కొన్నాయి. అప్పుడు కూడా సమీపంలోని విమానాశ్రయాల్లో రాకపోకలు నిలిపివేశారు. అయితే, ఈ దాడులకు బాధ్యత వహిస్తూ ఉక్రెయిన్ ఎలాంటి ప్రకటనలు చేయడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ.. అధికారికంగా ప్రకటించిన కమలా హారిస్
డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి కమలాహారిస్ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. -
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల