Russia : మెసేజింగ్ యాప్ నుంచే మాస్కోదాడి కుట్ర అమలు.. నిందితుల ఇంటరాగేషన్లో వెల్లడి..!
రష్యా రాజధాని మాస్కోలో జరిగిన దాడికి కేవలం ఓ మెసేజింగ్ యాప్ ద్వారానే కుట్రదారులు రూపం ఇచ్చినట్లు తెలుస్తోంది. నిందితుల ఇంటరాగేషన్ వీడియోలను రష్యా అధికారిక టీవీ విడుదల చేసింది.
ఇంటర్నెట్డెస్క్: రష్యా (Russia) రాజధాని మాస్కోలోని క్రాకస్ సిటీ కాన్సర్ట్ హాలులో దాడి (Moscow attack) చేసిన ముష్కరులను కేవలం మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ నుంచే నడిపించినట్లు గుర్తించారు. నిందితులను బంధించినట్లు ఇప్పటికే రష్యా ప్రకటించింది. తమకు డబ్బులు, ఆయుధాలు ఇచ్చిన వారెవరో తెలియదని వారు చెబుతున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలను జాతీయ టీవీ చానెళ్లు ప్రసారం చేశాయి. నలుగురు నిందితులు, వారు వాడిన కారును చూపాయి. వీరిని బ్రియాన్స్క్ పశ్చిమ ప్రాంతంలో ఖట్సన్ అనే గ్రామం వద్ద రష్యా ప్రత్యేక దళాలు అరెస్ట చేశాయి. రాత్రి వేళ చిత్రీకరించిన ఈ దృశ్యాల్లో దళాలు ఒక వ్యక్తిని ప్రశ్నిస్తుండగా.. రష్యా యాసలో అతడు మాట్లాడుతున్నట్లు ఉన్నాయి. వీరంతా తజికిస్థాన్కు చెందిన వారని రష్యా ఎంపీ ఒకరు పేర్కొన్నారు.
కింద కూర్చొని ఉన్న ఓ నిందితుడు మాట్లాడుతూ ‘‘డబ్బుల కోసమే ప్రజలపై కాల్పులు జరిపాను’’ అని చెబుతున్నట్లు స్పష్టంగా ఉంది. కొందరు 5 లక్షల రూబుళ్లను ఆఫర్ చేసినట్లు పేర్కొన్నాడు. అంతేకాదు.. వీటిల్లో సగం మొత్తం ఇప్పటికే స్వీకరించి ఓ బ్యాంక్ ఖాతాలో వేసినట్లు గుర్తించారు. తమను సంప్రదించి డీల్ కుదుర్చుకొని డబ్బు, ఆయుధాలు సరఫరా చేసినవారు ఎవరో తెలియదని పేర్లు చెప్పలేదని.. కేవలం టెలిగ్రామ్ యాప్ నుంచే సంప్రదించినట్లు వెల్లడించాడు. దాడి అనంతరం ఆయుధాలను రోడ్డుపక్కన పారేసినట్లు మరో దుండగుడు తెలిపాడు. ఇక నిందితులపై దళాలు దాడి చేస్తున్న వీడియోలు కూడా బయటకు వచ్చాయి. తమ దళాలు ఎఫ్ఎస్బీతో కలిసి నిందితులను అరెస్టు చేసినట్లు చెచెన్ నాయకుడు రంజాన్ కదిరోవ్ పేర్కొన్నాడు.
మాస్కోపై జరిగిన దాడిలో ఇప్పటి వరకు దాదాపు 133 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 11 మంది అనుమానితులను అదుపులోకి తీసుకొన్నారు. ఈ దాడికి ఇస్లామిక్ స్టేట్ ఇప్పటికే బాధ్యత స్వీకరించింది. తాము మిషిన్గన్లు, బాంబులు, కత్తులతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఒక దశలో ఒంటరితనాన్ని అనుభవించారట. చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన చెప్పారు. -
కారు పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి
అమెరికా(USA)లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ మహిళలు ప్రాణాలు కోల్పోయారు. -
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
Miss Universe Buenos Aires: 60 ఏళ్ల వయసులో అందాల తారగా కిరీటం దక్కించుకుందో మహిళ. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది మిస్ యూనివర్స్ పోటీల్లోనూ పాల్గొననుంది. -
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
అమెరికా(USA)లో ఓ నల్లజాతీయుడిపై పోలీసులు వ్యహరించిన తీరుతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. దాంతో తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. -
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు