Indonesia: బురదనీటిలో వృద్ధ మహిళలు వణుకుతుంటే.. డబ్బులు సంపాదిస్తున్న క్రియేటర్లు
వృద్ధమహిళలు బురదలో స్నానం చేస్తూ వణుకుతుంటూ ఆ వీడియోలను లైవ్స్ట్రీమ్ చేసి కొందరు టిక్టాక్ క్రియేటర్లు డబ్బులు దండుకుంటున్నారు. ఈ తరహా ఘటనలు ఇండోనేసియాలోని లొంబొక్ ప్రాంతంలో ఎక్కువగా జరుగుతున్నాయి.
రెడీ..1, 2, 3.. యాక్షన్ అన్నాడు టిక్టాక్ క్రియేటర్..
అంతే.. ఎదురుగా బురద నీటిలో కూర్చున్న ఓ వృద్ధ మహిళ వణుక్కుంటూ ఆ నీటిని జగ్గుతో ఎత్తి నెత్తిమీద పోసుకుంది..
చల్లగాలికి తోడు చలి ఎక్కువ కావడంతో ఆమె మరింత వణుకుతోంది..
మళ్లీ నీళ్లు నెత్తిమీద చల్లుకుంది..
క్రియేటర్ కట్ చెప్పేంతవరకు ఈ దుర్మార్గం కొనసాగుతూనే ఉంది..
ఇదంతా లైవ్ స్ట్రీమ్ జరగడం గమనార్హం..
ఎక్కడ జరుగుతోంది?
ఇండోనేషియాలోని కొన్ని ప్రాంతాలు ఇలాంటి దారుణాలకు వేదికగా నిలుస్తున్నాయి. లైవ్ స్ట్రీమ్లో భాగంగా చూసిన వీక్షకులు ఆన్లైన్ ద్వారా కాయిన్స్ పంపిస్తారు. వాటిని మార్చుకోవడం ద్వారా నగదు వస్తుందని దీన్ని రూపొందించిన ఓ వ్యక్తి తెలిపాడు. ఈ బురద నీటి స్నానాలను తొలిసారిగా లొంబొక్ దీవిలో చిత్రీకరించారు. టిక్టాక్లో విరివిగా ప్రచారంలోకి రావడంతో ఇండోనేషియా అధికారులు స్పందించారు. వెంటనే వాటిని నిషేధిస్తున్నట్టు ప్రకటించారు. ఈ వీడియోలను టిక్టాక్ నుంచి తొలగించాలని ఆ సంస్థకు లేఖ రాశారు. కొందరు మహిళలు కనీసం ఏడు, ఎనిమిది గంటలు ఈ నీటిలోనే ఉండటం బాధాకరమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఆదాయం రావడంతో చలిని భరిస్తూ..
ఇండోనేసియాలోని లొంబొక్ ప్రాంతంలో పేదరికం ఎక్కువ. క్రియేటర్లు ఎక్కువ ఆదాయం ఆశ చూపించడంతో వృద్ధ మహిళలు తమ కుటుంబాల పోషణ కోసం వీటిపై ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. అయితే క్రియేటర్లు మాత్రం భారీగా ఆదాయం పొందుతూ మహిళలకు మాత్రం అతి తక్కువ మొత్తాలను ఇస్తున్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. చాలా సేపు బురద నీటిలో ఉండటంతో వృద్ధులకు అనేక శ్వాససంబంధిత వ్యాధులు వస్తున్నట్టు సమాచారం. అమెరికా తరువాత ఇండోనేసియాలో టిక్టాక్ యూజర్లు 106 మిలియన్ల మంది ఉంటారని అంచనా. అయితే తమకు రోజువారీ వచ్చే కూలీ కన్నా టిక్టాక్ క్రియేటర్లు ఇచ్చే డబ్బు ఎక్కువగా ఉందని ఆ అమాయక మహిళలు చెబుతుండటం గమనార్హం. తమకు కష్టంగా ఉన్నా వీటిని భరిస్తామని వారు అంటున్నారు. దీని ద్వారా వచ్చే ఆదాయంతో తన మనవళ్లు, మనవరాళ్లకు కనీసం ఒక్కపూటైనా కడుపు నిండుతోందని వారు తెలిపారు. అయితే ఇటువంటి చర్యలు దుర్మార్గమని క్రియేటర్లపై కేసులు పెట్టాలని ప్రజాసంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు.
- జకార్తా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
UN: మన దేశ అంతర్గత వ్యవహారాలపై స్పందించిన అమెరికా, జర్మనీకి భారత్ గట్టిగా సమాధానమిచ్చిన విషయం తెలిసిందే. ఇది జరిగిన ఒక రోజు వ్యవధిలోనే ఐరాస సైతం కీలక వ్యాఖ్యలు చేసింది. -
నాటో దేశాలపై దాడులు చేయం
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే వార్తలను ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఖండించారు. కానీ ఉక్రెయిన్కు పశ్చిమ దేశాలు ఎఫ్-16 యుద్ధ విమానాలను అందజేస్తే వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు. -
ప్రధానిగా, మంచి తండ్రిగా వ్యవహరించడం కష్టం: సునాక్
ఓ పక్క పలు సమస్యలు ఎదుర్కొంటున్న దేశానికి ప్రధానిగా వ్యవహరించడం..మరోపక్క ఇద్దరు చిన్న పిల్లలకు మంచి తండ్రిగా ఉంటూ సమన్వయం చేసుకోవడం తనకు కష్టమైనపనిగా ఉందని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ పేర్కొన్నారు. -
16కు చేరిన లెబనాన్ మృతులు
లెబనాన్లోని దక్షిణ ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ దాడుల్లో తొలుత ఏడుగురు పారామెడికల్ సిబ్బంది మరణించినట్లు వార్తలొచ్చాయి. -
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
దక్షిణాఫ్రికాలో ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు బ్రిడ్జి నుంచి లోయలో పడడంతో 45 మంది మృతిచెందారు. -
నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టేయలేం: ట్రూడో
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేమంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
హవాయ్లో ఇంధన తొలగింపు పూర్తి
హవాయ్లోని భూగర్భ ఇంధన ట్యాంక్ కాంప్లెక్సు నుంచి మిలియన్ల కొద్దీ గ్యాలన్ల ఇంధనం తొలగింపు పూర్తయిందని అమెరికా సైన్యం తెలిపింది. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలపైనా అమెరికా స్పందన
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత్ నుంచి అభ్యంతరాలను ఎదుర్కొన్న అమెరికా తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలపైనా స్పందించింది. -
ఉత్తర కొరియాపై ఆంక్షల పర్యవేక్షణ కమిటీ
ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై విధించిన ఆంక్షలను పర్యవేక్షించేందుకు ఐక్యరాజ్య సమితి నిపుణులతో వేసిన కమిటీ పదవీ కాలాన్ని పొడిగించేందుకు భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రష్యా వీటో అధికారంతో అడ్డుకుంది. -
ఇద్దరి మృతదేహాల వెలికితీత
అమెరికాలోని బాల్టిమోర్లో నౌక ఢీకొని వంతెన కూలిన ప్రమాదంలో గల్లంతైన ఆరుగురిలో ఇద్దరి మృతదేహాలను బుధవారం సహాయక సిబ్బంది వెలికితీశారు. -
ఉక్రెయిన్పై దాడుల పరంపర
ఉక్రెయిన్లోని దక్షిణ, తూర్పు ప్రాంతాలపై బుధవారం రాత్రి రష్యా క్షిపణలు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో డజను మందికిపైగా గాయపడ్డారని గురువారం అధికారులు వెల్లడించారు. -
మాలిలో వాగ్నర్ గ్రూపు
ఆఫ్రికా దేశమైన మాలిలో ప్రభుత్వ బలగాలకు రష్యా అనుకూల వాగ్నర్ గ్రూపు సహకరిస్తోంది. మాలి మధ్య, ఉత్తర ప్రాంతంలో ఇటీవల సోదాలు, డ్రోన్లద్వారా ప్రభుత్వ బలగాలు చేసిన దాడుల్లో పదుల సంఖ్యలో పౌరులు చనిపోయారు. -
అమెరికాలో దుండగుడి కత్తిపోట్లు
అమెరికాలోని ఇల్లినోయీ రాష్ట్రం రాక్ఫోర్డ్లో ఓ దుండగుడు కత్తి దాడికి పాల్పడటంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయపడ్డారు. -
Pakistan: భారత్తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది.
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!