Jaishankar: ప్రపంచంలో ‘3F’ల సంక్షోభం.. కేంద్ర మంత్రి జైశంకర్
ఉగ్రవాదాన్ని దీర్ఘకాలంగా పెంచి పోషించిన ఓ దేశం.. చివరకు దానికే బలవుతోందని పాకిస్థాన్ను ఉద్దేశించి కేంద్రమంత్రి జైశంకర్ వ్యాఖ్యానించారు.
దిల్లీ: చట్టబద్ధ పాలనను విస్మరించడం, పరస్పరం కుదుర్చుకున్న ఒప్పందాలకు తూట్లు పొడవడం వంటి చర్యలతో ఆసియా భూభాగం, సముద్ర జలాల్లో సరికొత్త ఉద్రిక్తతలు తలెత్తాయని భారత విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్.జైశంకర్ (S Jaishankar) వెల్లడించారు. తూర్పు లద్ధాఖ్తోపాటు దక్షిణ చైనా సముద్రంలో చైనా (China) దుందుడుకు ధోరణి నేపథ్యంలో కేంద్ర మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. ఉగ్రవాదాన్ని దీర్ఘకాలంగా పెంచి పోషించిన ఓ దేశం.. చివరకు దానికే బలవుతోందని పాకిస్థాన్ (Pakistan)ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ఇరాన్తో డీల్.. భారత్కు అమెరికా వార్నింగ్..!
‘‘ప్రపంచం ప్రస్తుతం మూడు ‘ఎఫ్’ల సంక్షోభం ఎదుర్కొంటోంది. అవే ఫ్యూయెల్ (ఇంధనం), ఫుడ్ (ఆహారం), ఫెర్టిలైజర్స్ (ఎరువులు). అదేవిధంగా ఒప్పందాలను నిర్లక్ష్యం చేయడం, చట్టపాలనను విస్మరించడంతో ఆసియాలో కొత్త ఉద్రిక్తతలు ఉద్భవించాయి’’ అని జైశంకర్ పేర్కొన్నారు. అంతర్జాతీయ దౌత్యనీతిలో ధనబలం, ఆంక్షల బెదిరింపులు అస్త్రాలుగా మారాయని చెబుతూ.. చాబహార్ పోర్టు విషయంలో ఇరాన్తో భారత్ కుదుర్చుకున్న ఒప్పందంపై అమెరికా ‘ఆంక్షల’ హెచ్చరికలను పరోక్షంగా ప్రస్తావించారు. ‘‘ప్రపంచాన్ని సాధ్యమైనంతవరకు స్థిరీకరించడంలో దోహదపడటమే భారత్ పని. ‘భారత్ ఫస్ట్’, ‘వసుధైవ కుటుంబం’ల కలయికే ‘విశ్వబంధు’గా దేశ గుర్తింపును నిర్వచిస్తుంది’’ అని జైశంకర్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జీ7 సదస్సు వేళ.. మోదీ-జెలెన్స్కీ భేటీ
జీ7 సదస్సుకు వెళ్లిన ప్రధాని మోదీ(Modi) పలు దేశాల అధినేతలతో సమావేశాల్లో పాల్గొన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతోనూ సమావేశమయ్యారు. -
అలాగైతే కాల్పుల విరమణ చేస్తాం: ఉక్రెయిన్కు రష్యా ఆఫర్
ఒకవైపు జీ7(G7) దేశాలు చర్చల్లో బిజీగా ఉండగా.. రష్యా అధ్యక్షుడు పుతిన్(Putin) నుంచి కీలక ప్రకటన వచ్చింది. -
చైనాలో #MeeToo ఉద్యమ ప్రచారం.. మహిళా జర్నలిస్టుకు ఐదేళ్ల జైలు
#MeeToo ఉద్యమంలో భాగంగా మహిళా హక్కులపై విస్తృత ప్రచారం చేసిన ఓ మహిళా జర్నలిస్టుకు చైనా ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. -
‘నేను సమస్యల్లో పడతానేమో’: టీ20ల్లో అమెరికా చేతిలో పాక్ ఓటమిపై మిల్లర్ వ్యాఖ్య
ప్రస్తుతం అగ్రదేశంలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ (T20 World Cup 2024) గ్రూప్ మ్యాచుల్లో పాకిస్థాన్కు అమెరికా షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై అడిగిన ప్రశ్నకు ఆ దేశ ప్రతినిధి సరదాగా స్పందించారు. -
నేతలంతా ఒకవైపు.. బైడెన్ మరోవైపు: వైరల్గా అధ్యక్షుడి వ్యవహారశైలి
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) మరోసారి వార్తల్లో నిలిచారు. జీ7 సదస్సు వేళ..ఇటలీలో ఆయన వ్యవహారశైలి వైరల్గా మారింది. -
కువైట్ మృతుల్లో ముగ్గురు ఏపీవాసులు
కువైట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన వారిలో 45 మందిని భారతీయులుగా అధికారులు గుర్తించారు. -
కొక్కొరోకో కెపాసిటర్లు!
సరిగా ఉపయోగించుకోవాలేగానీ వ్యర్థాల నుంచీ మేలైన ఉత్పత్తులను తయారుచేయవచ్చని శాస్త్రవేత్తలు రుజువు చేశారు. -
ఉక్రెయిన్కు రూ.4.17 లక్షల కోట్ల రుణం
రష్యాతో యుద్ధంలో భీకరంగా పోరాడుతున్న ఉక్రెయిన్కు మరింత అండగా నిలిచేందుకు జీ7 దేశాలు ముందుకొచ్చాయి. -
ఎల్ నినోకు బై బై.. ఇక లా నినా వంతు
ఇప్పటికే వేడెక్కిన భూగోళంపై ఉష్ణోగ్రతల్ని మరింత పెంచి, వేసవిలో విపరీతమైన భగభగలకు కారణమైన ఎల్ నినో వాతావరణ పరిస్థితులు సెలవు తీసుకున్నాయి. -
విధ్వంసం కేసులో నిర్దోషిగా ఇమ్రాన్ఖాన్
జైలుశిక్ష అనుభవిస్తున్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ (72)కు గురువారం ఇస్లామాబాద్ కోర్టులో భారీ ఊరట లభించింది. -
సంక్షిప్త వార్తలు (4)
శరణార్థులను స్వీకరించడానికి ఐరోపా సమాఖ్య (ఈయూ) విధించిన నియమావళిని ఉల్లంఘించినందుకు హంగరీ 20 కోట్ల యూరోల జరిమానా కట్టాలని, ఇకపైనా ఉల్లంఘిస్తూనే ఉంటే రోజుకు అదనంగా 10 లక్షల యూరోల చొప్పున కట్టాలని యూరోపియన్ న్యాయస్థానం (ఈసీజే) గురువారం ఆదేశించింది. -
పాత పేపర్ల కట్టలో చైనా సైనిక రహస్యాలు
సైనిక చరిత్రకు సంబంధించిన పుస్తకాలను ఆసక్తితో చదివే ఓ చైనా వ్యక్తికి అనూహ్య పరిణామం ఎదురైంది. -
ఇటలీ పార్లమెంట్లో ముష్టిఘాతాలు
ఇటలీ పార్లమెంట్లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ప్రాంతీయ స్వయం ప్రతిపత్తిని విస్తరించే ప్రభుత్వ వివాదాస్పద ప్రతిపాదనలు దిగువ సభలో చట్టసభ్యుల మధ్య ముష్టిఘాతాలకు దారితీశాయి. -
అమెరికా ఎన్నికల్లో జోక్యానికి ప్రత్యర్థి దేశాల ప్రయత్నాలు
అమెరికా ఎన్నికలను ప్రభావితం చేసేందుకు పెద్దఎత్తున తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేలా ప్రత్యర్థి దేశాలు ప్రయత్నిస్తున్నాయని అగ్రరాజ్య నిఘా విభాగాధికారులు వెల్లడించారు. -
తుర్కియేలో నిరుటి భూకంపాలకు ముందు అసాధారణ స్థాయిలో ఉష్ణోగ్రతలు
నిరుడు ఫిబ్రవరిలో తుర్కియేను రెండు భారీ భూకంపాలు కుదిపేయడానికి 12-19 రోజుల ముందు ఆ దేశంలో భూతల ఉష్ణోగ్రతలు అసాధారణ స్థాయిలో నమోదైనట్లు పరిశోధకులు గుర్తించారు. -
భారత్ గురించి మరింత తెలుసుకోవాలని ఉందట..! చైనాలో ఆసక్తికర సర్వే
చైనీయులు భారత్ గురించి మరింత తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారట. చైనా వార్తా సంస్థ ‘ది గ్లోబల్ టైమ్స్’ ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం వెల్లడైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
వారి సేవలు మరో రూపంలో వినియోగించుకుంటాం: చంద్రబాబు
-
‘జమిలి’పై కోవింద్ కమిటీ నివేదిక.. త్వరలో క్యాబినెట్ ముందుకు!
-
జీ7 సదస్సు వేళ.. మోదీ-జెలెన్స్కీ భేటీ
-
ఫోన్ నంబర్లకు ఛార్జీలు.. ట్రాయ్ స్పష్టత
-
‘కన్నప్ప’ను కృష్ణంరాజు ప్రభాస్తో చేద్దామనుకున్నారు.. కానీ: మోహన్బాబు
-
నీట్ కుంభకోణానికి ముగింపు పలకాలి: ఎంకే స్టాలిన్