Ukraine: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంతో ఉక్రెయిన్పై ఎవరూ దృష్టి పెట్టట్లేదు: జెలెన్స్కీ
ఉక్రెయిన్పై దృష్టిని ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం మరల్చిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. తాము చేస్తోన్న యుద్ధంలో స్తబ్దత ఏమీ లేదని స్పష్టం చేశారు.
కీవ్: ప్రస్తుతం ప్రపంచమంతటా ఇజ్రాయెల్-హమాస్ (Israel-Hamas Conflict) యుద్ధంపైనే చర్చ జరుగుతోంది. దీంతో గత కొన్ని నెలలుగా కొనసాగుతోన్న ఉక్రెయిన్, రష్యా వివాదం (Ukraine-Russia) కనుమరుగవుతోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ (Zelensky ) ఆవేదన వ్యక్తం చేశారు. రష్యాతో యుద్ధంలో ప్రతిష్టంభన లేదని స్పష్టం చేశారు. ఉక్రెయిన్కు చెందిన ఓ సీనియర్ అధికారి యుద్ధంలో ఎలాంటి కదలిక లేదని వెల్లడించిన నేపథ్యంలో జెలెన్స్కీ దీనిపై స్పందించారు.
యూరోపియన్ యూనియన్ కమిషన్ (EU Commission) చీఫ్ ఉర్సులా వాన్ డర్ లెయెన్తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జెలెన్స్కీ మాట్లాడారు. ‘‘కాలం గడిచిపోయింది.. ప్రజలు అలసిపోయారు. అంతేగానీ, యుద్ధం ఆగిపోలేదు. ఇంకా కొనసాగుతూనే ఉంది’’అని స్పష్టం చేశారు. రష్యాతో సంప్రదింపులు జరిపి సంధి చేసుకోవాలని పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్పై ఒత్తిడి తెస్తున్నాయన్న వార్తల్ని జెలెన్స్కీ ఖండించారు. ఎవరూ తమపై ఒత్తిడి చేయట్లేదన్నారు. ఉక్రెయిన్పై ప్రపంచదేశాల దృష్టిని ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతోన్న యుద్ధం మరల్చిందని, దీంతో తమ దేశంపై ఎవరూ దృష్టి పెట్టట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రష్యా లక్ష్యం కూడా అదేనని ఆరోపించారు. ఇప్పటికే తాము ఎంతో ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నామని.. వాటిని అధిగమిస్తామన్న నమ్మకం తనకుందని జెలెన్స్కీ ధీమా వ్యక్తం చేశారు.
ఈ దాడులేంటి..వివరణ ఇవ్వండి: ఇజ్రాయెల్ను అడిగిన అమెరికా
రష్యాతో యుద్ధం కొనసాగుతోన్న నేపథ్యంలో ఉక్రెయిన్కు సాయం చేసేందుకు ఈయూ కమిషన్ ముందుకొచ్చింది. 2027 వరకు మరో 54 బిలియన్ డాలర్లు సాయాన్ని ప్రతిపాదించింది. హంగేరీ, స్లొవేకియా మినహా యూరోపియన్ యూనియన్లోని దాదాపు అన్ని దేశాలు ఉక్రెయిన్కు మద్దతిస్తున్నాయి. మరోవైపు అమెరికా కూడా ఉక్రెయిన్కు చాలాకాలంగా అండగా నిలుస్తోంది. యుద్ధ ఫలితం వచ్చే వరకు ఉక్రెయిన్కు ఆర్థిక సాయంతోపాటు ఆయుధాలనూ సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారు
డెమోక్రటిక్ పార్టీ నుంచి అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారయ్యారు. -
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారు
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి