North Korea: ఉపగ్రహ ప్రయోగ వైఫల్యం.. ఓ పెద్ద లోపం: ఉత్తరకొరియా
అతి త్వరలోనే మరో నిఘా ఉపగ్రహం ప్రయోగిస్తామని ఉత్తరకొరియా ప్రకటించింది. దీంతోపాటు శక్తిమంతమైన అణ్వాయుధాల తయారీని వేగవంతం చేయాలని కిమ్ నేతృత్వంలోని ఆ దేశ పాలకులు నిర్ణయించారు.
ఇంటర్నెట్డెస్క్: తమ తొలి ఉపగ్రహ ప్రయోగ వైఫల్యం ఓ పెద్ద లోపమని ఉత్తరకొరియా(North Korea) కీలక అధికారులు పేర్కొన్నారు. మరికొద్ది రోజుల్లోనే మరో సారి ప్రయోగం చేపడతామని వారు వెల్లడించినట్లు ఆ దేశ అధికారిక మీడియా కేసీఎన్ఏ వెల్లడించింది. ఉత్తర కొరియాలోని వర్కర్స్పార్టీ పార్టీ మూడు రోజులపాటు నిర్వహించిన సమావేశం ఆదివారం ముగిసింది. శక్తిమంతమైన అణ్వాయుధాల తయారీని మరింత వేగవంతం చేస్తామని కిమ్జోంగ్ ఉన్(Kim Jong Un), ఆయన సీనియర్ అధికారులు ఈ సమావేశంలో ప్రతిజ్ఞ చేశారు.
అమెరికా, దక్షిణ కొరియా దళాల కదలికలను గుర్తించేందుకు త్వరగా అంతరిక్ష టెక్నాలజీపై పట్టు సాధించాలన్న కిమ్(Kim Jong Un) ఆశయానికి ఈ వైఫల్యం ఎదురుదెబ్బగా భావించింది. దీంతోపాటు దేశంలోని సాంకేతికత ఆధునికీకరణ వంటి అంశాలపై పార్టీ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించినట్లు కేసీఎన్ఏ వెల్లడించింది.
ఈ ఉపగ్రహ ప్రయోగానికి సంబంధించిన ఏర్పాట్లలో బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించిన అధికారులను ఈ సమావేశంలో కొరియన్ వర్కర్స్ పార్టీ నిందించింది. ఈ వైఫల్యాల నుంచి వీలైనంత త్వరగా నేర్చుకొని అతి వేగంగా మరో ఉపగ్రహ ప్రయోగాన్ని చేపట్టాలని వారికి టార్గెట్ నిర్ణయించారు. కానీ, ఈ ప్రయోగాన్ని ఎప్పటి లోగా నిర్వహించాలనే అంశం మాత్రం వెల్లడించలేదు. మరో వైపు దక్షిణ కొరియా నిఘా బృందాలు మాత్రం ఈ ప్రయోగ వైఫల్యానికి కారణాలు కనుగొనేందుకే ప్యాంగ్యాంగ్కు కొన్ని వారాల సమయం పట్టవచ్చని పేర్కొంటోంది. ఈ వైఫల్యానికి ఎవరిని బాధ్యులను చేసిందో మాత్రం వర్కర్స్ పార్టీ వెల్లడించలేదు.
వర్కర్స్పార్టీ పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం సందర్భంగా శత్రుదేశాలైన దక్షిణ కొరియా, అమెరికా తీరు వల్ల ఈ ప్రాంతంలో మారుతున్న పరిస్థితులపై సమీక్షించారు. దీంతోపాటు అమెరికా వ్యతిరేక దేశాలకు సంఘీభావంగా పనిచేయాలని నిర్ణయించారు. 2022 నుంచి ఉత్తర కొరియా దాదాపు 100 క్షిపణి పరీక్షలు నిర్వహించింది. వీటిల్లో కొన్ని నిఘా ఉపగ్రహ ప్రయోగానికి సంబంధించినవి కూడా ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇజ్రాయెల్ అధికారుల్లో.. ‘ఐసీసీ’ అరెస్టు వారెంట్ల గుబులు!
2014 నాటి గాజా యుద్ధం కేసులో తమ సైనిక అధికారులు, నేతలపై ‘అంతర్జాతీయ నేర న్యాయస్థానం’ అరెస్టు వారెంట్లు జారీ చేయొచ్చన్న వార్తలపై ఇజ్రాయెల్లో ఆందోళన నెలకొంది. -
కెన్యాలో డ్యామ్ కూలి 40 మంది మృతి
కెన్యా (Kenya)లో డ్యామ్ కూలడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. -
కెనడా ప్రధాని ట్రూడో సమక్షంలో.. ‘ఖలిస్థానీ’ నినాదాలు
Justin Trudeau: కెనడా ప్రధాని ట్రూడో సభలో ఖలిస్థానీ అనుకూల నినాదాలు వినిపించడం చర్చనీయాంశంగా మారింది. -
అతడి హత్యకు పుతిన్ ఆదేశించి ఉండకపోవచ్చు: అమెరికా
రష్యా ఉద్యమకారుడు, ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీని హత్య చేయమని ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఆదేశాలు జారీ చేసి ఉండకపోవచ్చని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ మేరకు ఇటీవల వాల్స్ట్రీట్ పత్రిక ఓ కథనం ప్రచురించింది. -
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పాలస్తీనా జెండా కలకలం
గాజా (Gaza) పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా జో బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా జరుగుతోన్న నిరసనలతో అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాలు దద్దరిల్లుతున్నాయి. -
రంగంలోకి బైడెన్.. గాజాలోకి మరింత సాయానికి ఇజ్రాయెల్ అనుమతి
Israel-Hamas Conflict: గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. దీంతో అక్కడ అనేక మంది ఆకలితో అలమటిస్తున్నారు. వారికి సాయం అందించేలా సరిహద్దుల్లో మరిన్ని దారులు తెరుస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. -
చిత్ర వార్త
గాజాలోని ఖాన్యూనియన్లో తాత్కాలిక శిబిరంలో ఏర్పాటు చేసిన ఓ పాఠశాలలో చదువుకుంటున్న పాలస్తీనా చిన్నారులు -
ఆరేళ్ల పిల్లాడితో పోటీ పడుతున్నా: జో బైడెన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వయసు పెద్ద చర్చనే రేపుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్కు 81 ఏళ్లు. దీంతో ఆయన రేసులో నిలబడటంపై విమర్శలు చెలరేగుతున్నాయి. -
గుండెజబ్బుల ముప్పును పెంచే వాహన ధ్వనులు
వాహనాల రణగొణ ధ్వనులు గుండె జబ్బుల ముప్పును పెంచుతాయని అంతర్జాతీయ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఇందులో గుండెపోటు ముప్పు కూడా ఉందని వెల్లడైంది. -
టిబెట్పై చైనా అణచివేతను ప్రపంచానికి చాటుతా: నామ్కీ
టిబెట్ గుర్తింపును దెబ్బతీసేందుకు చైనా ప్రయత్నిస్తోందని, టిబెట్ వాసులు నానాటికీ పెరుగుతున్న భయం, అణచివేతల నడుమ బతుకుతున్నట్లు నామ్కీ (24) తెలిపారు. -
దుబాయ్లో అతిపెద్ద విమానాశ్రయం!
ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్ దారుణహత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. బాగ్దాద్లోని ఆమె ఇంటి వద్దే గుర్తుతెలియని వ్యక్తి కాల్చిచంపారు. -
దక్షిణ చైనాలో టోర్నడో విధ్వంసం
దక్షిణ చైనాలోని గ్వాంగ్ఝౌ నగరంలో శనివారం ఓ భారీ టోర్నడో విధ్వంసం సృష్టించింది. దీని తాకిడికి అయిదుగురు మరణించగా, 33 మంది గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. -
అమెరికాలో ‘గాజా’ సెగలు.. ఆగని విద్యార్థుల ఆందోళనలు
గాజాపై దాడులకు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో గత పది రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. -
హూతీల దాడికి గురైన నౌకకు భారత్ అండ
ఎర్రసముద్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో మళ్లీ భారత నౌకాదళం తన సత్తా చూపింది. హూతీ వేర్పాటువాదుల క్షిపణి దాడికి గురైన ఎంవీ ఆండ్రోమేడా స్టార్ నౌకకు అండగా నిలిచింది. -
తీవ్రంగా వేడెక్కనున్న హిందూ మహాసముద్రం
హిందూ మహాసముద్రం తీవ్రస్థాయిలో వేడెక్కే అవకాశం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. 2020 నుంచి 2100 మధ్య ఈ మహాసాగర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలు 1.4 డిగ్రీల నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకూ పెరగొచ్చని స్పష్టంచేస్తోంది. -
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ దార్
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇశాక్ దార్ అనూహ్య రీతిలో ఉప ప్రధానిగా నియమితులయ్యారు. ఆదివారం ఈ నిర్ణయం వెలువడింది. -
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో 35 బిలియన్ డాలర్ల (రూ.2.9లక్షల కోట్లు)తో కొత్త టెర్మినల్ నిర్మించనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్