North Korea: ఇది కిమ్ పంచుతోన్న అమృతం..!
కరోనా కేసు ఒక్కటీ లేదని రెండేళ్లు గర్వంగా చెప్పుకున్న ఉత్తర కొరియా.. ఇప్పుడు వైరస్ ఉద్ధృతితో ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
వ్యాక్సినేషన్ను ప్రచారాస్త్రంగా మార్చుకున్న ఉ.కొరియా నియంత
ప్యాంగ్యాంగ్: కరోనా కేసు ఒక్కటీ లేదని రెండేళ్లు గర్వంగా చెప్పుకొన్న ఉత్తర కొరియా.. ఇప్పుడు వైరస్ ఉద్ధృతితో ఉక్కిరిబిక్కిరవుతోంది. డబ్ల్యూహెచ్ఓ, పలు దేశాలు కొవిడ్ టీకాలు ఇస్తామంటే అంగీకరించని ఆ దేశం.. ఇప్పుడు కాస్త మెట్టు దిగింది. చివరకు ఇటీవల ప్రజలకు టీకాలు అందించే ప్రక్రియను ప్రారంభించింది. ఇప్పుడు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ దీనిని ప్రచారాస్త్రంగా మలుచుకున్నారు. టీకా కేంద్రాలను తన ప్రభను పెంచుకునే వేదికలుగా మార్చుకున్నారు. ఈ టీకా ప్రేమతో కూడిన అమృతమని, దీనిని కిమ్ బహుమతిగా ఇచ్చారంటూ ఊదరగొడుతున్నారు అక్కడి అధికారులు. డెయిలీ స్టార్ అనే వార్తా సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది.
తాజా ఉద్ధృతిని అడ్డుకునేందుకు ఉత్తర కొరియా.. చైనా నుంచి టీకాలు పొందుతోంది. అయితే ప్రస్తుతం అవి అందరికీ అందుబాటులో లేవు. దేశ నిర్మాణ రంగ ప్రాజెక్టుల్లో పనిచేస్తోన్న సైనికులకు మాత్రమే వీటిని అందిస్తున్నారు. అందుకోసం ఏర్పాటు చేసిన టీకా కేంద్రాల వద్ద ప్రభుత్వం లౌడ్ స్పీకర్లు పెట్టి.. కిమ్ ఘనతను చాటుతోంది. ఈ వ్యాక్సినేషన్ అత్యున్నత వ్యక్తి నుంచి అందిన దయగల బహుమతి అని, ఇది కిమ్ ఇస్తోన్న ‘ప్రేమతో కూడిన అమృతం’ అని స్పీకర్లు వాయించుతున్నాయి.
రెండేళ్లుగా కరోనా వైరస్తో ప్రపంచమంతా ఉక్కిరిబిక్కిరి అవుతుంటే.. గత నెల వరకు తమ దగ్గర ఒక్క కేసు కూడా నమోదు కాలేదని కిమ్ ప్రభుత్వం తెలిపింది. కొద్దివారాల క్రితం మొదటి కేసును ధ్రువీకరించింది. ఒమిక్రాన్ వేరియంట్ను గుర్తించినట్లు ప్రకటించింది. కొవిడ్ ప్రకటన అయితే చేసింది కానీ.. రోజువారీ గణాంకాల్లో మాత్రం దేశ ప్రజలు మిస్టరీ జ్వరాల బారినపడుతున్నట్లు చెప్తోంది. కొద్ది రోజుల క్రితం రికార్డు స్థాయి 3.9లక్షల మంది ఆ జ్వరం బారినపడ్డారు. ప్రస్తుతం ఆ సంఖ్య లక్షకు తగ్గింది. దాంతో రాజధాని నగరం ప్యాంగ్యాంగ్లో ప్రభుత్వం కొవిడ్ ఆంక్షలను సడలించింది. ఇక ఇప్పటివరకూ 70 మరణాలు వచ్చినట్లు తెలిపింది. కాగా, అరకొర సదుపాయాలున్న ఈ పేద దేశం వెల్లడిస్తోన్న లెక్కలపై నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
జపాన్లోని పలు ప్రాంతాల్లో ప్రజలు ఆచరించే ఓ సంప్రదాయం గురించిన విషయాలు ప్రస్తుతం వైరల్గా మారుతున్నాయి. -
నెట్ఫ్లిక్స్కు నిరసన సెగ.. నెట్టింట్లో బాయ్కాట్ కాల్స్
నెటిఫ్లిక్స్ (Netflix) నిరసన సెగను ఎదుర్కొంటోంది. దానిని బాయ్కాట్ చేయాలంటూ పలువురు పోస్టులు పెడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
పెన్సిల్వేనియాలో ర్యాలీ నిర్వహిస్తానని ప్రకటించిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ -
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ.. అధికారికంగా ప్రకటించిన కమలా హారిస్
డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి కమలాహారిస్ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. -
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ