North Korea: ఇది కిమ్ పంచుతోన్న అమృతం..!
కరోనా కేసు ఒక్కటీ లేదని రెండేళ్లు గర్వంగా చెప్పుకున్న ఉత్తర కొరియా.. ఇప్పుడు వైరస్ ఉద్ధృతితో ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
వ్యాక్సినేషన్ను ప్రచారాస్త్రంగా మార్చుకున్న ఉ.కొరియా నియంత
ప్యాంగ్యాంగ్: కరోనా కేసు ఒక్కటీ లేదని రెండేళ్లు గర్వంగా చెప్పుకొన్న ఉత్తర కొరియా.. ఇప్పుడు వైరస్ ఉద్ధృతితో ఉక్కిరిబిక్కిరవుతోంది. డబ్ల్యూహెచ్ఓ, పలు దేశాలు కొవిడ్ టీకాలు ఇస్తామంటే అంగీకరించని ఆ దేశం.. ఇప్పుడు కాస్త మెట్టు దిగింది. చివరకు ఇటీవల ప్రజలకు టీకాలు అందించే ప్రక్రియను ప్రారంభించింది. ఇప్పుడు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ దీనిని ప్రచారాస్త్రంగా మలుచుకున్నారు. టీకా కేంద్రాలను తన ప్రభను పెంచుకునే వేదికలుగా మార్చుకున్నారు. ఈ టీకా ప్రేమతో కూడిన అమృతమని, దీనిని కిమ్ బహుమతిగా ఇచ్చారంటూ ఊదరగొడుతున్నారు అక్కడి అధికారులు. డెయిలీ స్టార్ అనే వార్తా సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది.
తాజా ఉద్ధృతిని అడ్డుకునేందుకు ఉత్తర కొరియా.. చైనా నుంచి టీకాలు పొందుతోంది. అయితే ప్రస్తుతం అవి అందరికీ అందుబాటులో లేవు. దేశ నిర్మాణ రంగ ప్రాజెక్టుల్లో పనిచేస్తోన్న సైనికులకు మాత్రమే వీటిని అందిస్తున్నారు. అందుకోసం ఏర్పాటు చేసిన టీకా కేంద్రాల వద్ద ప్రభుత్వం లౌడ్ స్పీకర్లు పెట్టి.. కిమ్ ఘనతను చాటుతోంది. ఈ వ్యాక్సినేషన్ అత్యున్నత వ్యక్తి నుంచి అందిన దయగల బహుమతి అని, ఇది కిమ్ ఇస్తోన్న ‘ప్రేమతో కూడిన అమృతం’ అని స్పీకర్లు వాయించుతున్నాయి.
రెండేళ్లుగా కరోనా వైరస్తో ప్రపంచమంతా ఉక్కిరిబిక్కిరి అవుతుంటే.. గత నెల వరకు తమ దగ్గర ఒక్క కేసు కూడా నమోదు కాలేదని కిమ్ ప్రభుత్వం తెలిపింది. కొద్దివారాల క్రితం మొదటి కేసును ధ్రువీకరించింది. ఒమిక్రాన్ వేరియంట్ను గుర్తించినట్లు ప్రకటించింది. కొవిడ్ ప్రకటన అయితే చేసింది కానీ.. రోజువారీ గణాంకాల్లో మాత్రం దేశ ప్రజలు మిస్టరీ జ్వరాల బారినపడుతున్నట్లు చెప్తోంది. కొద్ది రోజుల క్రితం రికార్డు స్థాయి 3.9లక్షల మంది ఆ జ్వరం బారినపడ్డారు. ప్రస్తుతం ఆ సంఖ్య లక్షకు తగ్గింది. దాంతో రాజధాని నగరం ప్యాంగ్యాంగ్లో ప్రభుత్వం కొవిడ్ ఆంక్షలను సడలించింది. ఇక ఇప్పటివరకూ 70 మరణాలు వచ్చినట్లు తెలిపింది. కాగా, అరకొర సదుపాయాలున్న ఈ పేద దేశం వెల్లడిస్తోన్న లెక్కలపై నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల