North Korea: దక్షిణ కొరియా ద్వీపం దిశగా కిమ్ సైన్యం కాల్పులు..!
ఉత్తరకొరియా భారీ కవ్వింపు చర్యకు పాల్పడింది. ఏకంగా దక్షిణ కొరియాకు చెందిన ద్వీపం దిశగా వందల సంఖ్యలో శతఘ్ని గుండ్లను పేల్చింది.
ఇంటర్నెట్డెస్క్: ఉత్తర కొరియా (North Korea) భారీ కవ్వింపు చర్యకు పాల్పడింది. ఈ సారి ఏకంగా దక్షిణ కొరియా ద్వీపమైన యొన్పియోంగ్పై వందల సంఖ్యలో శతఘ్ని గుండ్లను పేల్చింది. ఈ విషయాన్ని దక్షిణకొరియా సైనిక వర్గాలు ధ్రువీకరించాయి. ఆ ద్వీపంలోని ప్రజలు తక్షణమే ఖాళీ చేయాలని హెచ్చరికలు జారీ చేశాయి.
ఇరాన్లో జంట పేలుళ్లు మా పనే.. ఉగ్రసంస్థ ఐఎస్ ప్రకటన
శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల మధ్యలో ఉత్తర కొరియా దాదాపు 200 శతఘ్ని గుండ్లను ఈ ద్వీపం దిశగా పేల్చింది. కాకపోతే.. అవి దక్షిణ కొరియా భూభాగానికి చేరలేదు. మధ్యలోనే సముద్రంలోని బఫర్ జోన్లో పడిపోయాయి. దీనిపై దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్స్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు తమ దేశ పౌరులు, సైనిక సిబ్బందికి ఎటువంటి హాని జరగలేదన్నారు. ఉత్తర కొరియా చర్యలు ఈ ప్రాంతంలో శాంతి సుస్థిరతకు ముప్పుగా మారాయన్నారు. 2010లో ఉత్తరకొరియా ఈ ద్వీపంపై జరిపిన కాల్పుల్లో నలుగురు చనిపోయారు. అంతేకాదు రెండేళ్లుగా క్షిపణి పరీక్షలు చేస్తూ సియోల్ను కవ్విస్తోంది. వీటిల్లో కొన్నింటి శకలాలు ద.కొరియా సముద్ర జలాల్లో పడ్డాయి.
అమెరికా, దక్షిణ కొరియా దేశాలు కవ్విస్తే.. వాటిని నాశనం చేయడానికి సిద్ధంగా ఉండాలని నూతన సంవత్సరం సందర్భంగా ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఇటీవలే సైన్యానికి పిలుపునిచ్చారు. ఇక నుంచి ద.కొరియాతో ఎటువంటి సయోధ్య, పునరేకీకరణ ప్రయత్నాలు ఉండవని తేల్చేశారు. ముఖ్యంగా అమెరికా వైపు నుంచి వచ్చే ముప్పును కాచుకొని ఉండాలని ఆయన సూచించారు. వాషింగ్టన్, సియోల్ సైనిక ఘర్షణకు ప్రయత్నిస్తే.. మా వద్ద ఉన్న అణ్వాయుధాలు కూడా వాడటానికి వెనుకాడబోమని హెచ్చరించారు. ఇది జరిగిన కొన్ని రోజుల్లోనే కిమ్ చిన్న కుమార్తే తదుపరి వారసురాలిగా నియమితులయ్యే అవకాశముందని దక్షిణ కొరియా నిఘా సంస్థ గురువారం వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్