Kim Jong un: ‘యుద్ధం వస్తే.. శత్రువులకు చావుదెబ్బ’ - కిమ్ పిలుపు
శత్రువులు ఎవరైనా రెచ్చగొడితే చావుదెబ్బ తీయాలని కిమ్ పిలుపునిచ్చారు.
ఇంటర్నెట్ డెస్క్: దేశం చుట్టూ నెలకొన్న భౌగోళిక పరిస్థితులను దృష్టిలోపెట్టుకొని మునుపెన్నడూ లేనివిధంగా యుద్ధానికి సిద్ధంగా ఉండాలని ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) తన సేనలకు పిలుపునిచ్చాడు. అక్కడి (North Korea) మిలటరీ యూనివర్సిటీని సందర్శించిన ఆయన.. శత్రువులు ఎవరైనా రెచ్చగొడితే చావుదెబ్బ తీయాలని ప్రతిజ్ఞ చేశారు. ప్రధాన శ్రతువుగా భావించే దక్షిణ కొరియాలో పార్లమెంటు ఎన్నికల ఫలితాల రోజే కిమ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
‘తమతో ఘర్షణకు దిగాలని శత్రువు భావిస్తే.. తమ వద్ద ఉన్న అన్ని మార్గాలను సమీకరించడం ద్వారా డీపీఆర్కే (డెమొక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా) వారిని నిస్సంకోచంగా చావుదెబ్బ తీస్తుంది’ అని యూనివర్సిటీ విద్యార్థులు, సిబ్బందిని ఉద్దేశిస్తూ కిమ్ పేర్కొన్నారు. కేవలం యుద్ధానికి సిద్ధంగా ఉండటమే కాకుండా.. తప్పకుండా విజయం సాధించాలని సైనికులకు పిలుపునిచ్చారు. ఇందుకు తమవద్ద ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకుంటామన్నారు.
రూ.లక్ష కోట్ల మోసం.. మహిళా టైకూన్కు మరణశిక్ష!
కిమ్ హయాంలో ఉత్తర కొరియా ఇటీవల భారీ ఆయుధ సంపత్తిని సమకూర్చుకుంటోంది. క్షిపణి ప్రయోగాలతో మునిగిపోతోంది. రష్యాతో సైనిక, రాజకీయ సంబంధాలను పెంచుకుంటోన్న కిమ్.. ఉక్రెయిన్తో యుద్ధం నేపథ్యంలో మాస్కోకు సాయం చేస్తోంది. దక్షిణ కొరియా(South Korea)ను ప్రధాన శత్రువుగా భావిస్తోన్న కిమ్.. అటువైపు నుంచి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా దీటుగా ఎదుర్కొంటామనే ప్రకటనలు చేస్తున్నారు. దక్షిణ కొరియాలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో అక్కడి అధికార పార్టీ ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?