USA: కొత్త ప్రభుత్వంతో చర్చలకు త్వరలో న్యూదిల్లీకి అమెరికా ప్రతినిధి
భారత్లోని కొత్త ప్రభుత్వంతో సంబంధాలు బలోపేతం చేసుకొనేందుకు అమెరికా యత్నాలు మొదలుపెట్టింది.
ఇంటర్నెట్డెస్క్: కొత్త ప్రభుత్వంతో సత్సంబంధాల కోసం అమెరికా ప్రయత్నాలను మొదలుపెట్టింది. తమ దేశ జాతీయ భద్రతా సలహాదారు (NSA) జాక్ సలీవాన్ను భారత్ పంపాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని శ్వేతసౌధం ప్రకటించింది. ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఫోన్ చేసిన సందర్భంగా ఈ విషయం చర్చకు వచ్చింది. ‘‘బైడెన్ నేడు ప్రధాని మోదీకి ఫోన్ చేశారు. ఈ సందర్భంగా త్వరలో జాతీయ భద్రతా సలహాదారు న్యూదిల్లీ పర్యటన ప్రస్తావనకు వచ్చింది. కొత్త ప్రభుత్వంతో భారత్-అమెరికా ప్రధాన్యాలపై చర్చించనున్నారు. వీటిల్లో సాంకేతిక భాగస్వామ్యం, వ్యూహాత్మక బంధం, పరస్పర విశ్వాసం వంటి అంశాలు ఉండనున్నాయి’’ అని శ్వేత సౌధం ఓ ప్రకటనలో తెలిపింది.
అమెరికా ఎన్ఎస్ఏ పర్యటన తేదీలను తర్వలోనే ప్రకటించనున్నారు. ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం జరిగిన కొన్ని రోజుల్లోనే ఈ పర్యటన చోటు చేసుకోనుంది. ఇక అమెరికాలోని కీలక నాయకులు కూడా ప్రధానికి అభినందనలు తెలిపిన వారిలో ఉన్నారు. సెనెట్ ఫారెన్ రిలేషన్స్ కమిటీ ఛైర్మన్ బెన్ కార్డిన్ భారత ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. ‘‘ఎండలను లెక్కచేయకుండా భారత ప్రజలు ఓట్లు వేసి ప్రజాస్వామ్య విధానాలపై ఉన్న గౌరవాన్ని చాటుకొన్నారు. రానున్న సంవత్సరాల్లో ప్రపంచాన్ని సుసంపన్నం చేసేందుకు భారత్-అమెరికా భాగస్వామ్యం మరింత బలపడుతుంది’’ అని పేర్కొన్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన ప్రధాని మోదీకి అమెరికా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్ చైనా సహా పలు ప్రపంచ దేశాలు అభినందనలు తెలిపాయి. ఈ సందర్భంగా ఆయా దేశాధినేతలంతా భారత్తో సంబంధాలను బలోపేతం చేసుకోవాలన్న ఆకాంక్షను వెల్లడించారు. ‘‘విజయం సాధించిన ప్రధాని మోదీకి, ఎన్డీయే కూటమికి శుభాకాంక్షలు. ఈ చరిత్రాత్మక ఎన్నికలో 65 కోట్ల మంది పాల్గొన్నారు’’ అని అమెరికా అధ్యక్షుడు బైడెన్ తెలిపారు. దీనికి ధన్యవాదాలు తెలియజేస్తే ప్రధాని కూడా ఎక్స్లో పోస్టు చేశారు. మోదీని అభినందించిన వారిలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘే, నేపాల్ ప్రధాని పుష్ప కమాల్ దహల్, మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు, భూటాన్, మారిషస్, జమైకా ప్రధానులు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
పెన్సిల్వేనియాలో ర్యాలీ నిర్వహిస్తానని ప్రకటించిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ -
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ.. అధికారికంగా ప్రకటించిన కమలా హారిస్
డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి కమలాహారిస్ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. -
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే