Nuclear Water: చైనాలో బిగ్గరగా మాట్లాడకండి.. తమ పౌరులకు జపాన్ సూచన!
చైనాలోని జపనీయులు జాగ్రత్తగా ఉండాలని అక్కడి జపాన్ దౌత్య కార్యాలయం హెచ్చరించింది. ఫుకుషిమా అణుజలాల విడుదలపై చైనా తీవ్ర ఆగ్రహంగా ఉన్న విషయం తెలిసిందే.
టోక్యో: జపాన్ (Japan)లో ఫుకుషిమా దైచీ అణు విద్యుత్ కేంద్రం (Fukushima Nuclear Plant) నుంచి రేడియోధార్మిక వ్యర్థ జలాలను పసిఫిక్లోకి విడుదల చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే, దీనిపై చైనా, దక్షిణ కొరియాల నుంచీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ‘అత్యంత స్వార్థపూరిత, బాధ్యతారాహిత్య చర్య’ అని చైనా అగ్గిమీద గుగ్గిలమవుతోంది. స్థానికంగా నిరసనలూ వెలుగుచూస్తున్నాయి. ఈ పరిణామాల నడుమ జపాన్ అప్రమత్తమైంది. చైనాలో నివసిస్తోన్న జపానీయులు జాగ్రత్తగా మసలుకోవాలని సూచించింది. బహిరంగ ప్రదేశాల్లో జపనీస్లో గట్టిగా మాట్లాడొద్దని హెచ్చరించింది.
‘బయటకు వెళ్లినప్పుడు అప్రమత్తంగా ఉండండి. అనవసరంగా జపనీస్లో బిగ్గరగా మాట్లాడటం వంటివి చేయకండి. జపాన్ ఎంబసీ పరిసర ప్రాంతాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి’ అని చైనాలోని జపాన్ దౌత్య కార్యాలయం పేర్కొంది. స్థానికంగా మరిన్ని నిరసనలకు అవకాశం ఉందని హాంకాంగ్లోని జపాన్ కాన్సులేట్ తెలిపింది. దక్షిణ కొరియాలోనూ జపాన్ పౌరులు జాగ్రత్తగా ప్రవర్తించాలని, అనవసరమైన ఇబ్బందులను నివారించాలనే హెచ్చరికలు జారీ అయ్యాయి. సియోల్లోని జపాన్ రాయబార కార్యాలయంలోకి ప్రవేశించిన 16 మంది నిరసనకారులను దక్షిణ కొరియా పోలీసులు గురువారం అరెస్టు చేశారు.
చైనాలో కొవిడ్ ఆంక్షలు ఎత్తేసిన 2 నెలల్లో.. 20లక్షల మరణాలు!
2011లో ఫుకుషిమా అణుకేంద్రం సునామీ కారణంగా దెబ్బతిన్న నాటి నుంచి ఈ అణు వ్యర్థ జలాలను జపాన్ భారీ ట్యాంకుల్లో నిల్వ చేసింది. ప్రస్తుతం వెయ్యి ట్యాంకుల్లో 13.7 లక్షల టన్నుల రేడియోధార్మిక జలాలు ఉన్నాయి. 2024 మార్చి నాటికి వీటిలో 31,200 టన్నుల జలాలను విడుదల చేయాలన్నది టెప్కో ప్రణాళిక. దీనిలో భాగంగానే గురువారం 200 నుంచి 210 క్యూబిక్ మీటర్ల రేడియో ధార్మిక జలాలను శుద్ధి చేసి, సముద్రంలోకి పంపింగ్ చేశారు. గురువారం మధ్యాహ్నం సముద్రం నుంచి సేకరించిన నీటి నమూనాల్లో.. రేడియోధార్మిక స్థాయిలు సురక్షితమైన స్థాయిల్లోనే ఉన్నాయని ‘టెప్కో’ తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దుబాయ్లో అతిపెద్ద విమానాశ్రయం!
ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
టిబెట్పై చైనా అణచివేతను ప్రపంచానికి చాటుతా: నామ్కీ
టిబెట్ గుర్తింపును దెబ్బతీసేందుకు చైనా ప్రయత్నిస్తోందని, టిబెట్ వాసులు నానాటికీ పెరుగుతున్న భయం, అణచివేతల నడుమ బతుకుతున్నట్లు నామ్కీ (24) తెలిపారు. -
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్ దారుణహత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. బాగ్దాద్లోని ఆమె ఇంటి వద్దే గుర్తుతెలియని వ్యక్తి కాల్చిచంపారు. -
దక్షిణ చైనాలో టోర్నడో విధ్వంసం
దక్షిణ చైనాలోని గ్వాంగ్ఝౌ నగరంలో శనివారం ఓ భారీ టోర్నడో విధ్వంసం సృష్టించింది. దీని తాకిడికి అయిదుగురు మరణించగా, 33 మంది గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. -
అమెరికాలో ‘గాజా’ సెగలు.. ఆగని విద్యార్థుల ఆందోళనలు
గాజాపై దాడులకు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో గత పది రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. -
గుండెజబ్బుల ముప్పును పెంచే వాహన ధ్వనులు
వాహనాల రణగొణ ధ్వనులు గుండె జబ్బుల ముప్పును పెంచుతాయని అంతర్జాతీయ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఇందులో గుండెపోటు ముప్పు కూడా ఉందని వెల్లడైంది. -
హూతీల దాడికి గురైన నౌకకు భారత్ అండ
ఎర్రసముద్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో మళ్లీ భారత నౌకాదళం తన సత్తా చూపింది. హూతీ వేర్పాటువాదుల క్షిపణి దాడికి గురైన ఎంవీ ఆండ్రోమేడా స్టార్ నౌకకు అండగా నిలిచింది. -
తీవ్రంగా వేడెక్కనున్న హిందూ మహాసముద్రం
హిందూ మహాసముద్రం తీవ్రస్థాయిలో వేడెక్కే అవకాశం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. 2020 నుంచి 2100 మధ్య ఈ మహాసాగర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలు 1.4 డిగ్రీల నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకూ పెరగొచ్చని స్పష్టంచేస్తోంది. -
ఆరేళ్ల పిల్లాడితో పోటీ పడుతున్నా
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వయసు పెద్ద చర్చనే రేపుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్కు 81 ఏళ్లు. దీంతో ఆయన రేసులో నిలబడటంపై విమర్శలు చెలరేగుతున్నాయి. -
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ దార్
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇశాక్ దార్ అనూహ్య రీతిలో ఉప ప్రధానిగా నియమితులయ్యారు. ఆదివారం ఈ నిర్ణయం వెలువడింది. -
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో 35 బిలియన్ డాలర్ల (రూ.2.9లక్షల కోట్లు)తో కొత్త టెర్మినల్ నిర్మించనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
-
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!